పులకించిన శ్రీరామగిరి
మా రాములోరి కల్యాణం మళ్లీ ఇక్కడ చూస్తామో.. లేదో.. అన్న సందేహంతో శ్రీరామగిరిలో జరిగిన సీతారాముల కల్యాణానికి భక్తులు పోటెత్తారు.
కనులపండువగా జగదభిరాముని కల్యాణం
భక్తులకు యజ్ఞోపవీతం చూపిస్తున్న అర్చకులు
వరరామచంద్రాపురం, న్యూస్టుడే: మా రాములోరి కల్యాణం మళ్లీ ఇక్కడ చూస్తామో.. లేదో.. అన్న సందేహంతో శ్రీరామగిరిలో జరిగిన సీతారాముల కల్యాణానికి భక్తులు పోటెత్తారు. కుటుంబసమేతంగా జానకిరామయ్య పెళ్లిని చూడాలని ముందుగా వచ్చి కల్యాణ మండపంలో కూర్చున్నారు. శ్రీరామగిరి కొండపైనున్న ఆలయం నుంచి కింద కల్యాణ మండపం వరకు గురువారం జనజాతర నెలకొంది. రామనామస్మరణ మార్మోగింది.
కొండపై నుంచి ఊరేగింపుగా వస్తున్న స్వామివారికి పూలతో స్వాగతం
వరరామచంద్రాపురం మండలంలోని శ్రీరామగిరి రామాలయంలో, గ్రామంలోని కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణం అర్చకులు పురుషోత్తమాచార్యులు బృందం కనులపండువగా జరిపించింది. వేకువజాము నుంచే ప్రధాన ఆలయంలో స్వామివారి పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. మూలవర్లుకు, ఉత్సవర్లుకు అభిషేకాలు చేసి, పట్టువస్త్రాలు అలంకరించారు. సుప్రభాతసేవ, అష్టోత్తర శతనామావళీ, పూజా కైంకర్యాలు పూర్తిచేసి ముందుగా గర్భగుడిలోని మూలవర్లుకు కల్యాణం నిర్వహించారు. భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఉత్సవర్లును పల్లకీలో ఉంచి, మేళతాళాలతో కొండ పైనుంచి, గ్రామంలోని కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. కల్యాణ ద్రవాలపై, భక్తులపై సంప్రోక్షణ జలాలు చిలకరించారు. కన్యాదానం, మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు తదితర ఘట్టాలను రుత్వికుల వేదమంత్రాల ఘోషలో, భక్తుల జయజయధ్వానాల మధ్య కమనీయంగా జరిపారు. భక్తులకు వేదాశీర్వచనం చేసి అర్చకులు, తీర్థప్రసాదాలు అందించారు. స్వామివారి అక్షింతల కోసం తొక్కిలాసట జరగకుండా ఎటపాక సీఐ గజేంద్రకుమార్ ఆధ్వర్యంలో కూనవరం, వీఆర్పురం ఎస్సైలు వెంకటేశ్, దుర్గాప్రసాద్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లాకేంద్రంలో కోలాహలం
సుండ్రుపుట్టులో కల్యాణానికి పట్టువస్త్రాలు తీసుకొస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
పాడేరు, న్యూస్టుడే: జిల్లాకేంద్రం పాడేరు సుండ్రుపుట్టులోని పురాతన రామాలయంలో, పాతపాడేరులో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. నక్కలపుట్టులో గ్రామపెద్ద బొర్రా నాగరాజు దంపతుల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. మధ్యాహ్నం అన్నసమారాధన జరిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
రెండో రోజు నామినేషన్ల సందడి
[ 20-04-2024]
నామినేషన్ల స్వీకరణ రెండో రోజు అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ తెలిపారు. -
అనంత బాబు అరాచకాలకు ముగింపు పలుకుదాం
[ 20-04-2024]
ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకాలతో మన్యం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వైకాపాను ఓడించి ఆయన ఆట కట్టించడమే తమ లక్ష్యమని రంపచోడవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి స్పష్టంచేశారు. -
కన్నాయిగూడెం ఎంపీటీసీ సభ్యుడి హత్య
[ 20-04-2024]
కన్నాయిగూడెం మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఇందుకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం వివరాలు వెల్లడించారు. -
సిద్ధం..ప్రయాణానికి యుద్ధం
[ 20-04-2024]
‘ఎక్కడైనా సీఎం వస్తున్నాడంటే వరాలు జల్లులు కురిపిస్తారని ఆనందపడతారు. జగన్ వస్తే మాత్రం అమ్మో అంటున్నారు. ఈ సీఎం వస్తే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే.. కరెంటు తీగలు తొలగించాల్సిందే. -
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 20-04-2024]
కశింకోట మండలం తాళ్లపాలెం డా.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
చంద్రబాబు ఆశీస్సులున్నాయి: ఈశ్వరి
[ 20-04-2024]
తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శుక్రవారం కొయ్యూరు మండలంలో పర్యటించారు. తన అనుచరులను కలిసి నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. -
ఎండ తీవ్రతతో ద్విచక్రవాహనం దగ్ధం
[ 20-04-2024]
అధిక ఉష్ణోగ్రతతో ఓ ద్విచక్రవాహనం దగ్ధమైన ఘటన శుక్రవారం పాడేరు పట్టణంలో చోటుచేసుకుంది. పాడేరు ప్రధాన రహదారి సినిమాహాల్ కూడలి వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. -
ఏజెన్సీలో వేసవి తాపం
[ 20-04-2024]
మైదాన ప్రాంతాలకు దీటుగా ఈ సారి ఏజెన్సీ ప్రాంతంలోనూ వేసవి తాపం గట్టిగానే చూపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా ఏజెన్సీలో ప్రధాన కేంద్రాలైన పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
సైకో పాలనతో ప్రజలకు తీవ్రనష్టం
[ 20-04-2024]
అరకులోయ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్లు దాఖలు చేసే ముందు ఆయన స్వగ్రామం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ లకేయిపుట్టులో గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నిర్వాసితులను ముంచిన జగన్
[ 20-04-2024]
జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జిల్లాలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడేరు పట్టణంలో పర్యటించి అనేక హామీలు గుప్పించారు. -
పోక్సో కేసులో ప్రిన్సిపల్కు ఐదేళ్ల జైలు
[ 20-04-2024]
ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రిన్సిపల్ నాగసాయి నరసింహమూర్తికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు