logo

దురలవాట్లకు దూరమవ్వండి

జూదం, మద్యం వంటి దురలవాట్లకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని శ్రీసత్యసాయి సేవాట్రస్టు ప్రతినిధి మూర్తి సాయిరాం సూచించారు. హిందూ ధర్మాన్ని ఆచరిస్తే సన్మార్గంలో నడవొచ్చని చెప్పారు.

Published : 31 Mar 2023 03:09 IST

కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు

చింతపల్లి, న్యూస్‌టుడే: జూదం, మద్యం వంటి దురలవాట్లకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని శ్రీసత్యసాయి సేవాట్రస్టు ప్రతినిధి మూర్తి సాయిరాం సూచించారు. హిందూ ధర్మాన్ని ఆచరిస్తే సన్మార్గంలో నడవొచ్చని చెప్పారు. చింతపల్లి మండలం చౌడుపల్లి పంచాయతీ బయలుకించంగిలో గురువారం సేవాట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమితుల సమావేశంలో సాయిరాం ఆధ్యాత్మిక ప్రవచనాలు వినిపించారు. అల్లూరి జిల్లాలోని వివిధ మండలాలనుంచి సత్యసాయి సేవాసమితి సభ్యులు, భజనమండలి సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో భజన బృందాలు గీతాలను ఆలపించి అలరించాయి. ముఖ్య అతిథులుగా సత్యసాయి సేవాట్రస్టు ప్రతినిధులు వంశీ, సిరివెన్నెల శ్రీరామశాస్త్రి హాజరయ్యారు. గిరిజన గ్రామాల్లో సత్యసాయి సేవా ట్రస్టు ద్వారా ప్రేమామృత ధార కార్యక్రమం కింద తాగునీటిని అందించడం తమకు మరచిపోని అనుభూతి ఇస్తోందని ఈసందర్భంగా సేవాట్రస్టు ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని