logo

రామచంద్రుడికి అప్పన్న స్వామి కానుకలు

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా రామతీర్థంలో కొలువైన సీతారాములకు సింహాద్రి అప్పన్నస్వామి తరఫున కానుకలు సమర్పించారు.

Published : 31 Mar 2023 03:09 IST

పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో రామతీర్థం వెళ్తున్న ఈఓ త్రినాథరావు దంపతులు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా రామతీర్థంలో కొలువైన సీతారాములకు సింహాద్రి అప్పన్నస్వామి తరఫున కానుకలు సమర్పించారు. ఈవో వి.త్రినాథరావు దంపతులు గురువారం సింహాచలం దేవస్థానం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందజేశారు. తొలుత సింహగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పండితులు వేదమంత్రోచ్ఛారణలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ కానుకలతో ఆలయ బేడామండపం ప్రదక్షిణం చేశారు. అర్చక పరివారం, అధికారులతో ఊరేగింపుగా వెళ్లి సీతారాములకు కానుకలు సమర్పించారు.

రామతీర్థంలో సమర్పించిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని