ఉచితం సరే.. బస్సులేవి సారూ!
పదో తరగతి విద్యార్థులు పరీక్షలు వెళ్లి రావడానికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు తమ గ్రామాలకు బస్సులే రావడం లేదని.
ఆటోలో పరిమితికి మించి ఇలా..
మాడుగుల, దేవరాపల్లి, న్యూస్టుడే: పదో తరగతి విద్యార్థులు పరీక్షలు వెళ్లి రావడానికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు తమ గ్రామాలకు బస్సులే రావడం లేదని, నానాపాట్లు పడి ఆటోలు పట్టుకుంటే తప్ప ప్రయాణ సౌకర్యమే లేదని గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో సొంత వాహనాలు ఉన్నవారికి మినహా మిగిలిన వారికి ప్రమాదకర ప్రయాణం మినహా గత్యంతరం లేకుండా పోయింది. మాడుగుల నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు బస్సు సౌకర్యమే లేదు. కొన్ని గ్రామాలకు ఉన్న బస్సులు తొలగించగా.. లోతట్టు ప్రాంతాలు ఈ సదుపాయానికి దూరంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల్లో 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 2,313 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
వాహనాల కోసం వేచి ఉన్న విద్యార్థులు
* మాడుగుల మండలం- ఇక్కడ 5 కేంద్రాల్లో 733 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మాడుగుల, కె.జె.పురం, ఒమ్మలి, తాటిపర్తిలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. తాటిపర్తి పాఠశాలకు ఎల్.పొన్నవోలు గిరిజనాశ్రమ పాఠశాల విద్యార్థులు రావాలి. వారికి తాటిపర్తి 20 కి.మీ. దూరం. ఇక్కడికి బస్సు సదుపాయం లేదు. రోజూ ఆటోల్లో రావాలంటే ఖర్చులు ఎవరు భరిస్తారన్నది ప్రశ్న. విద్యార్థులను తరలించే బాధ్యత ఉపాధ్యాయులపైనే పడడంతో వారు తల పట్టుకుంటున్నారు. ఒమ్మలి కేంద్రానిదీ అదే సమస్య. గతంలో ఉదయం 6 గంటలకు నర్సీపట్నం నుంచి బస్సు బయల్దేరి మాడుగుల 8 గంటలకు చేరుకునేది. అన్ని గ్రామాల మీదుగా ఈ బస్సు రావడంతో పరీక్షల సమయంలో మరింత ఉపయోగంగా ఉండేది. అప్పటి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బస్సును పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నా తర్వాత మళ్లీ రద్దు చేశారు. ఈ బస్సును తిరిగేలా చేస్తే పరీక్షల్లో వివిధ గ్రామాల విద్యార్థులకు మేలు కలుగుతుంది.
* కోనాం, చీడికాడ, మంచాల కేంద్రాల్లో 570 మంది పరీక్షలు రాయనున్నారు. ఈ కేంద్రాలకూ బస్సు సౌకర్యం లేదు. అప్పలరాజుపురం, ఖండివరం విద్యార్థులు మంచాలకు వెళ్లాలి. దూరంగా ఉన్న ఈ కేంద్రానికి ఆటోలే దిక్కు.
* దేవరాపల్లి, తెనుగుపూడి కేంద్రాల్లో 460 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పెదగంగవరం, జీనబాడు, వాలాబు గిరిజన గ్రామల విద్యార్థులు దేవరాపల్లి రావాలి. వేచలం, ఎం.అలమండ, కలిగొట్ల, ఏ.కొత్తపల్లి, ముషిడిపల్లి గ్రామాల నుంచి 20 కి.మీ. దూరం నుంచి ఇక్కడికి రావలసి ఉంది. వీటి మధ్య బస్సు సదుపాయం లేదు.
* కె.కోటపాడులో రెండు, ఎ.కోడూరులో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 550 మంది పరీక్షలు రాయనున్నారు. ఈ మండలంలో పలు గ్రామాలకు బస్సు సదుపాయం ఉన్నా.. పాతవలసకు చెందిన విద్యార్థులు కె.కోటపాడు రావాలంటే ప్రైవేటు వాహనాల్లోనే చేరుకోవాలి. వీటిని అధికారులు పరిశీలించి కనీసం గతంలో తిరిగిన బస్సులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
రెండో రోజు నామినేషన్ల సందడి
[ 20-04-2024]
నామినేషన్ల స్వీకరణ రెండో రోజు అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ తెలిపారు. -
అనంత బాబు అరాచకాలకు ముగింపు పలుకుదాం
[ 20-04-2024]
ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకాలతో మన్యం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వైకాపాను ఓడించి ఆయన ఆట కట్టించడమే తమ లక్ష్యమని రంపచోడవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి స్పష్టంచేశారు. -
కన్నాయిగూడెం ఎంపీటీసీ సభ్యుడి హత్య
[ 20-04-2024]
కన్నాయిగూడెం మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఇందుకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం వివరాలు వెల్లడించారు. -
సిద్ధం..ప్రయాణానికి యుద్ధం
[ 20-04-2024]
‘ఎక్కడైనా సీఎం వస్తున్నాడంటే వరాలు జల్లులు కురిపిస్తారని ఆనందపడతారు. జగన్ వస్తే మాత్రం అమ్మో అంటున్నారు. ఈ సీఎం వస్తే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే.. కరెంటు తీగలు తొలగించాల్సిందే. -
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 20-04-2024]
కశింకోట మండలం తాళ్లపాలెం డా.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
చంద్రబాబు ఆశీస్సులున్నాయి: ఈశ్వరి
[ 20-04-2024]
తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శుక్రవారం కొయ్యూరు మండలంలో పర్యటించారు. తన అనుచరులను కలిసి నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. -
ఎండ తీవ్రతతో ద్విచక్రవాహనం దగ్ధం
[ 20-04-2024]
అధిక ఉష్ణోగ్రతతో ఓ ద్విచక్రవాహనం దగ్ధమైన ఘటన శుక్రవారం పాడేరు పట్టణంలో చోటుచేసుకుంది. పాడేరు ప్రధాన రహదారి సినిమాహాల్ కూడలి వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. -
ఏజెన్సీలో వేసవి తాపం
[ 20-04-2024]
మైదాన ప్రాంతాలకు దీటుగా ఈ సారి ఏజెన్సీ ప్రాంతంలోనూ వేసవి తాపం గట్టిగానే చూపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా ఏజెన్సీలో ప్రధాన కేంద్రాలైన పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
సైకో పాలనతో ప్రజలకు తీవ్రనష్టం
[ 20-04-2024]
అరకులోయ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్లు దాఖలు చేసే ముందు ఆయన స్వగ్రామం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ లకేయిపుట్టులో గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నిర్వాసితులను ముంచిన జగన్
[ 20-04-2024]
జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జిల్లాలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడేరు పట్టణంలో పర్యటించి అనేక హామీలు గుప్పించారు. -
పోక్సో కేసులో ప్రిన్సిపల్కు ఐదేళ్ల జైలు
[ 20-04-2024]
ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రిన్సిపల్ నాగసాయి నరసింహమూర్తికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?