పేదల కళ్లల్లో వెలుగు
దేశంలోనే ఒకే ప్రాంగణంలో 22 వేల మందికి ఉపాధిని చూపిస్తూ రికార్డుకెక్కిన బ్రాండిక్స్ సంస్థ ఇప్పుడు పేద ప్రజలకు కంటిచూపును అందిస్తూ ఆదర్శనీయమైన సేవలు అందిస్తోంది.
40,234 మందికి ఉచిత వైద్య సేవలు
వంద వారాలు దాటిన బ్రాండిక్స్ శిబిరాలు
అచ్యుతాపురం, న్యూస్టుడే
శిబిరంలో కంటి పరీక్షలు చేస్తున్న వైద్యులు
దేశంలోనే ఒకే ప్రాంగణంలో 22 వేల మందికి ఉపాధిని చూపిస్తూ రికార్డుకెక్కిన బ్రాండిక్స్ సంస్థ ఇప్పుడు పేద ప్రజలకు కంటిచూపును అందిస్తూ ఆదర్శనీయమైన సేవలు అందిస్తోంది. ఇక్కడి కంటి శిబిరానికి వచ్చే వారిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ.. పైసా ఖర్చులేకుండా నమ్మకమైన సేవలు అందివ్వడంతో కంటి వైద్యశిబిరానికి వచ్చే ప్రజల సంఖ్య తగ్గడం లేదు. నెలలో రెండు, నాలుగు ఆదివారాలు క్రమం తప్పకుండా నిర్వహించే శిబిరానికి వివిధ ప్రాంతాల నుంచి 800 మంది వరకు హాజరవుతున్నారు. 2017లో జనవరి 22న అచ్యుతాపురం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రారంభమైన కంటి వైద్య శిబిరానికి వచ్చే రోగుల సంఖ్య పెరిగిపోవడంతో బ్రాండిక్స్ ఆవరణలో రూ.కోటిన్నరతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇలా ప్రజల నమ్మకాన్ని చూరగొన్న బ్రాండిక్స్ ఇప్పటివరకు 103 వారాల పాటు విజయవంతంగా శిబిరాలు నిర్వహించింది. ఈ శిబిరాల ద్వారా 40,234 మందికి వైద్య సేవలు అందివ్వగా, వీరిలో 4 వేల మందికి మందికి శస్త్రచికిత్సలు చేయగా 25,736 మందికి కళ్లద్దాలు అందించారు. శిబిరాలకు హాజరయ్యే వారికి మజ్జిగ, అల్పాహారం, భోజనాలు కూడా అందిస్తున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు గొర్లె గంగ. రాంబిల్లి మండలానికి చెందిన ఈ వృద్ధురాలి భర్త అనారోగ్యంతో మంచానపడ్డాడు. పిల్లలు లేరు. ఇలా పుట్టెడు కష్టంలో ఉన్న ఈమె కంటిచూపు నాలుగేళ్లగా మసమసకగా కనిపిస్తున్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, మంచానపడ్డ భర్తను గుర్తుకు తెచ్చుకుని కంటి శస్త్రచికిత్స చేయించుకోలేకపోయింది. చుట్టుపక్కలవాళ్లు బ్రాండిక్స్ కంటి వైద్యశిబిరం గురించి చెప్పడంతో పాటు దగ్గరుండి శస్త్రచికిత్స చేయించడానికి ముందుకొచ్చారు. దీంతో గంగకు కంటిచూపు తిరిగి వచ్చింది.
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు కె.సత్యవతి. విశాఖలో పేరున్న కంటి ఆసుపత్రులు, క్లినిక్లు ఎన్నో ఉన్నా బ్రాండిక్స్ కంటి వైద్యశిబిరం అందిస్తున్న నమ్మకమైన సేవలు ఈమెను విశాఖ నుంచి అచ్యుతాపురం రప్పించాయి. వైద్య శిబిరానికి హాజరై సేవలు పొందింది. వేలాది రూపాయలు ఫీజు చెల్లించి ప్రైవేటు కంటి ఆసుపత్రులకు వెళ్లినా అందని సేవలు బ్రాండిక్స్ కంటి వైద్యశిబిరం ద్వారా పొందానని మహిళ ఆనందంగా చెబుతోంది.
..ఇది ఏదో ఒకరిద్దరు మహిళలు చెప్పిన మాటలు కాదు. బ్రాండిక్స్ కంటి వైద్యశిబిరంపై ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలకు ఉన్న నమ్మకానికి రెండు సాక్ష్యాలు.
మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు
- కొల్లి వరలక్ష్మి, వాలంటీర్, కంటివైద్యశిబిరం
బ్రాండిక్స్లో ఉచిత కంటి వైద్య శిబిరాల్లో వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఇప్పటివరకు జరిగిన 103 శిబిరాలకు హాజరై రోగులకు నా వంతు సాయం చేస్తున్నాను. ఇక్కడ చికిత్సలు పొందిన వేలాది మంది ఆప్యాయంగా పలకరించడంతో పాటు మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు.
ఆత్మసంతృప్తి కల్గింది
- కేవీ.వేణుగోపాల్, ఏజీఎం, శంకర్ ఫౌండేషన్
కంటివైద్య శిబిరాలకు హాజరై రోగులకు అవసరమైన మార్గనిర్దేశం చేయడం ద్వారా ఎంతో గుర్తింపు వచ్చింది. శంకర్ ఫౌండేషన్ ద్వారా వేలాది మందికి వైద్యసేవలు అందించినా బ్రాండిక్స్ కంటి వైద్యశిబిరం ద్వారా అందిస్తున్న సేవలు ఒక వ్యక్తిగా ఎంతో ఆత్మ సంతృప్తి పొందాను. సామాన్య ప్రజలకు ఇక్కడ అందుతున్న సేవలు ఆదర్శనీయం.
ఆ వృద్ధుడి బాధే కదిలించింది..
- దొరస్వామి, బ్రాండిక్స్ భారతీయ భాగస్వామి, అచ్యుతాపురం
విశాఖ నుంచి కంపెనీకి వస్తుండగా కళ్లు కనిపించని ఓ వృద్ధుడు అచ్యుతాపురం కూడలి దాటలేక ఇబ్బందిపడుతున్నాడు. అతన్ని రోడ్డు దాటించి కంటిచూపుపై ప్రశ్నిస్తే అందరూ ఉన్నా శస్త్రచికిత్స చేయించడంలేదని దీనంగా చెప్పాడు. అప్పుడే ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటుచేయాలనే ఆలోచన కల్గింది. శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి ద్వారా లక్షలాది మందికి పద్మశ్రీ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ అందిస్తున్న సేవలను తెలుసుకుని వారి ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించాం. ఆదాయం సంపాదిస్తేనే కుటుంబసభ్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. వయసు మీదపడి కళ్లు కనిపించకపోయినా పట్టించుకోవడం లేదు. ఇటువంటి వారికి కంటిచూపును అందివ్వడమే లక్ష్యంగా శిబిరాలు నిర్వహిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.