కాఫీ ఘుమఘుమ..ప్రభుత్వ ప్రోత్సాహం మమ
అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మన్యం కాఫీపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. స్థానికంగా ప్రాసెసింగ్ చేసి నాణ్యమైన కాఫీ పొడి తయారు చేసి లాభాలు అందించేలా గిరిజన సహకార సంస్థ (జీసీసీ), సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) చేస్తున్న ప్రయత్నాలకు సర్కారు నుంచి ప్రోత్సాహం కరవవుతోంది.
తక్కువ ధరకే పంట విక్రయించాల్సిన దుస్థితి
ప్రాసెసింగ్ యూనిట్కు అనుమతుల్లో తాత్సారం
గూడెంకొత్తవీధి, న్యూస్టుడే
అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మన్యం కాఫీపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. స్థానికంగా ప్రాసెసింగ్ చేసి నాణ్యమైన కాఫీ పొడి తయారు చేసి లాభాలు అందించేలా గిరిజన సహకార సంస్థ (జీసీసీ), సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) చేస్తున్న ప్రయత్నాలకు సర్కారు నుంచి ప్రోత్సాహం కరవవుతోంది. రూ. 5 కోట్ల వ్యయంతో ఐటీడీఏ గూడెంకొత్తవీధి, జి.మాడుగుల మండలాల్లో చేపట్టిన ఎకో పల్పింగ్ యూనిట్ల నిర్మాణాల నిధులు పక్కదారి పట్టించడంతో అవి మధ్యలోనే నిలిచిపోయాయి. జీసీసీ రూ. 4 కోట్ల వ్యయంతో డౌనూరులో ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించేందుకు చర్యలు తీసుకున్నా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంలో ఎక్కడ లేని తాత్సారం చేస్తోంది.
మన్యంలో పూర్తి సేంద్రియ విధానంలో పండించే ప్రధాన వాణిజ్య పంట కాఫీ. ఐటీడీఏ ప్రోత్సాహంతో 11 మండలాల పరిధిలో 10 లక్షలకు పైగా ఎకరాల్లో గిరిజనులు పండిస్తున్న ఈ పంటకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రతిష్ఠాత్మక సేంద్రియ ధ్రువీకరణ (ఆర్గానిక్ సర్టిఫికేషన్) సాధించడం ఇందుకు నిదర్శనం. చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో 2600 మంది గిరిజన రైతులకు సేంద్రియ ధృవపత్రాలు అందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 1500 మందికి వీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీసీసీ 150 టన్నుల కాఫీ కొనుగోలు చేసింది. ఆశించిన లాభాలు రాలేదు. 2022-23లో కొనుగోలు ధర పెంచి సేకరించింది. దళారుల కంటే జీసీసీ అధిక ధరకు కొనుగోలు చేయడంతో రైతులు సంస్థకే విక్రయించారు. కాఫీని ప్రత్యేకంగా బెంగళూరులో ప్రాసెసింగ్ చేయించి గ్రేడింగ్ వచ్చేలా చూసి అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించారు. వెయ్యి టన్నుల కాఫీతో రూ. 20కోట్ల టర్నోవర్ సాధించింది.
సొంతంగా ప్రాసెసింగ్తో లాభం
మన్యం కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నా గ్రేడింగ్పైనే కొనుగోలు ధర ఆధారపడి ఉంటుంది. కాఫీ ఎంత చక్కగా ప్రాసెసింగ్ జరిగితే అంత మంచి ధర లభిస్తుంది. జీసీసీ కొనుగోలు చేసిన కాఫీ అంతా బెంగళూరులో ప్రాసెసింగ్ చేయిస్తున్నారు. ఇది అదనపు వ్యయంగా భావించిన జీసీసీ సొంతంగా ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాట చేయాలని భావించింది. కొయ్యూరు మండలంలోని డౌనూరు వద్ద అయిదు ఎకరాల స్థలంలో రూ. 3.5 కోట్ల వ్యయంతో ఈ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు గతేడాది జీసీసీ ప్రభుత్వానికి పంపించింది. అనుమతులు వస్తే యూనిట్ ఏర్పాటవుతుంది. అయితే.. దీనికి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మళ్లీ ఈ ఏడాది యూనిట్ స్థాపన అంచనా రూ. 50 లక్షలు అదనంగా పెరిగింది. అయినా రూ. 4 కోట్లతో డౌనూరులో యూనిట్ ఏర్పాటుకు మళ్లీ ప్రతిపాదనలు పంపారు. ఇప్పుడు అనుమతులు వస్తే యూనిట్ స్థాపించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థానికంగా ప్రాసెసింగ్ ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. అలా చేస్తే అదనపు వ్యయం తగ్గి ఆ లాభం రైతులకు అందించేందుకు వీలుంటుంది. అయితే ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది.
నిలిచిన ఎకోపల్పింగ్ యూనిట్లు
గిరిజన రైతులు కాఫీని పండ్ల రూపంలో విక్రయించడంతో నష్టపోతున్నారు. పండ్లు పల్పింగ్ చేసి ఆరబెట్టి పిక్కలుగా, పొడిగా అమ్మితే మూడింతల లాభం వస్తుంది. ఈ విషయం గ్రహించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసిన రోణంకి గోపాలకృష్ణ గూడెంకొత్తవీధి, జి.మాడుగుల మండలాల్లో ఎకో పల్పింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు రెండేళ్ల కిందటే చర్యలు తీసుకున్నారు. గూడెంకొత్తవీధి యూనిట్కు రూ. 2.27 కోట్లు, జి.మాడుగుల యూనిట్కు రూ. 2.38 కోట్లు కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభించారు. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలోనే ఇవి అందుబాటులోకి తేవాలని అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేపట్టారు. ఆ నిధులు పక్కదారి పట్టడంతో గుత్తేదారులకు రావాల్సిన బిల్లుల చెల్లింపులు ఆగిపోయి నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇందుకోసం తెచ్చిన అధునాతన యంత్రాలు గత ఆరు నెలలుగా నిరుపయోగంగా ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్కు అనుమతులు ఇచ్చి, ఆగిపోయిన ఎకో పల్పింగ్ యూనిట్ల పనులు పునఃప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో వ్యయం తగ్గి కాఫీ రైతులు లాభాలు అర్జించేందుకు వీలవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం అనుమతిస్తే యూనిట్ స్థాపిస్తాం
మన్యం కాఫీని ఇక్కడే ప్రాసెసింగ్ చేసి నాణ్యత పెంచేలా ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని భావించాం. అందుకు రూ. 3.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. అనుమతి రాలేదు. ప్రస్తుతం ఆ వ్యయం రూ. 50 లక్షలు పెరిగింది. ప్రభుత్వం అనుమతులు ఇస్తే రూ. 4 కోట్ల వ్యయంతో యూనిట్ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకువస్తాం.
జి.సురేష్కుమార్, జీసీసీ ఎండీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నారాయణమూర్తి మనవడి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ