మహానేతతో మరచిపోలేని జ్ఞాపకాలు
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చీ రాగానే ప్రజల మనసుల్లో సుస్థిరస్థానం పొందిన మహానేత ఎన్టీఆర్. ఆయనతో మన్యంవాసుల అనుబంధం మరపురాని జ్ఞాపకాలు మిగిల్చింది. ఒకప్పటి చింతపల్లి అసెంబ్లీ నియోజకవర్గం తెదేపాకు కంచుకోటగా ఉండేది.
ఎన్టీఆర్తో చల్లంగి లక్ష్మణరావు, అప్పటి ఎమ్మెల్యే ఎల్బీ దుక్కు (పాత చిత్రం)
చింతపల్లి, న్యూస్టుడే: సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చీ రాగానే ప్రజల మనసుల్లో సుస్థిరస్థానం పొందిన మహానేత ఎన్టీఆర్. ఆయనతో మన్యంవాసుల అనుబంధం మరపురాని జ్ఞాపకాలు మిగిల్చింది. ఒకప్పటి చింతపల్లి అసెంబ్లీ నియోజకవర్గం తెదేపాకు కంచుకోటగా ఉండేది. చింతపల్లికి చెందిన చల్లంగి లక్ష్మణరావు మొదటి నుంచి తెదేపాకు వీరాభిమాని. ఈయన ఖజానా శాఖలో ఉద్యోగం చేస్తూనే ఎన్టీఆర్పై ఉన్న అభిమానంతో తెదేపాకు మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ఎస్.కోట ఎమ్మెల్యే ఎల్బీ దుక్కు రాష్ట్రస్థాయిలో లెజిస్లేచర్ కమిటీ ఛైర్మన్గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన వద్ద పీఏగా లక్ష్మణరావు పనిచేశారు. ఆ సమయంలో తరచూ గిరిజన ప్రాంతాల్లో సమస్యలపై ఎల్బీ దుక్కుతో కలసి ఎన్టీఆర్ను లక్ష్మణరావు కలుస్తూ ఉండేవారు.
సొంత సొమ్ముతో చింతపల్లిలో విగ్రహం
ఎన్టీఆర్పై ఉన్న అభిమానంతో నా సొంత నిధులతో చింతపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాను. అప్పటికి మన్యంలో ఎక్కడా ఎన్టీఆర్కు విగ్రహాలు లేవు. నేనే తొలిసారిగా చింతపల్లిలో ఏర్పాటు చేశాను. పదివేల మందితో విగ్రహావిష్కరణ చేయించాం. తెదేపా ప్రభుత్వ హయాంలో అటవీ, గిరిజన సంక్షేమ శాఖామంత్రులుగా పనిచేసిన అయ్యన్నపాత్రుడు, మణికుమారి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీపై ఉన్న అభిమానంతో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తెదేపాలో క్రియాశీలకంగా పనిచేస్తున్నా. నా కుమార్తె చల్లంగి జ్ఞానేశ్వరి నాతోపాటే పార్టీలో పనిచేస్తోంది. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారామె. 2004లో చింతపల్లి నుంచి ఎమ్మెల్యేగా తెదేపా తరఫున పోటీ చేశారు. ఎన్టీఆర్తో ఉన్న అనుబంధం మాటల్లో వర్ణించలేనిది
చల్లంగి లక్ష్మణరావు, తెదేపా జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి
పిలిచి కారులో తీసుకెళ్లారు..!
రంపచోడవరం, న్యూస్టుడే
తెదేపా స్థాపించిన నాటి నుంచి పార్టీలో ఉన్నాను. ఎన్టీఆర్ నటించిన జానపద, పౌరాణిక చిత్రాలను ఎక్కువగా చూస్తూ ఆయన అభిమానినయ్యాను. 1982లో పార్టీ స్థాపించిన తర్వాత అదే సంవత్సరం నవంబరులో ఎన్టీఆర్ రంపచోడవరం వచ్చారు. అప్పటికి నేను చిన్నవాడినే అయినా ఎన్టీఆర్ వెంటే పర్యటించాను. 1985లో రంపచోడవరం మండల పరిషత్ అధ్యక్షునిగా పనిచేశాను. 1989లో రంపచోడవరం (అప్పట్లో ఎల్లవరం) నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. అత్యధిక మెజారిటీతో గెలుపొందాను. ఆ తర్వాత 1994, 1999 సంవత్సరాల్లో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందాను. మొదటిసారిగా 1989లో ఎమ్మెల్యే అయిన తర్వాత రంపచోడవరంలోని గోదావరి ఫ్లయివుడ్ ఫ్యాక్టరీకి స్థానికులు కలపను సరఫరా చేసేందుకు అనుమతులు ఇప్పించాలని కోరేందుకు హైదరాబాదు వెళ్లారు. ఎన్టీఆర్ను కలిసేందుకు అబిడ్స్లో ఆటో దిగి నడచి వెళ్తుండగా కారులో వెళ్తున్న నన్ను చూసి ఆయన తన కారులో ఎక్కించుకొన్నారు. అప్పుడు ఆ లేఖను అందించాను. కోరిన వెంటనే అనుమతులు కూడా ఇప్పించారు.
శీతంశెట్టి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బోరు’మనిపించావ్ జగన్
[ 23-04-2024]
తెదేపా హయాంలో అమలుచేసిన ఎన్టీఆర్ జలసిరి పథకానికి వైకాపా ప్రభుత్వం పేరు మార్చి వైఎస్ఆర్ జలకళ అని పెట్టింది. దీనికింద ఉమ్మడి జిల్లాలో 20 వేల బోర్లు తీస్తామని ప్రకటించారు. నియోజకవర్గానికి ఒక రిగ్గు కేటాయిస్తున్నామంటూ సీఎం జగన్ హడావుడి చేశారు. -
పదోతరగతి ఫలితాల్లో జిల్లాల ర్యాంకులు కిందికి!
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి. -
జోరందుకున్న నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. -
వైకాపా పాలనలో ఆదివాసీలకు అన్యాయం
[ 23-04-2024]
గిరిజన ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పించేందుకు నిండుగా అవకాశాలున్నా వైకాపా ప్రభుత్వం నిర్వాకంతో అది అందని ద్రాక్షలా మారింది. -
రోడ్డు లేక ఇబ్బందులు
[ 23-04-2024]
అనంతగిరి మండలంలోని మారుముల చీడివలస, పాటిపల్లి, పట్టం, బందకొండ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు సోమవారం నిరసన చేపట్టారు. -
ఓటర్లను చైతన్యపర్చండి
[ 23-04-2024]
పోలింగ్లో అధికసంఖ్యలో ఓటర్లు పాల్గొనేలా చైతన్యపర్చాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత.. భారతదేశ అంధుల క్రికెట్ జట్టు ఆల్రౌండర్ వలసినైని రవణిని కోరారు. -
కోలాహలంగా అభ్యర్థుల నామినేషన్లు
[ 23-04-2024]
పాయకరావుపేట కూటమి అభ్యర్థిగా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సోమవారం నామినేషన్ వేశారు. -
ప్రణాళికాలోపంతో గందరగోళం
[ 23-04-2024]
నక్కపల్లిలో సోమవారం జరిగిన ప్రధాన పార్టీల నామినేషన్ల ప్రక్రియలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. -
పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోండి ఇలా..
[ 23-04-2024]
పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో ఎన్నికల కమిషన్ కొత్త విధానానికి నాంది పలికింది. ఎ -
కూటమి జోరుతో వైకాపా నేతల్లో భయం
[ 23-04-2024]
వైకాపాకు వెన్నులో వణుకుపుట్టేలా తెదేపా కార్యకర్తలు పనిచేయాలని తెదేపా ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు కోరారు. -
జనసేనలో చేరికలు
[ 23-04-2024]
ఎలమంచిలి 8వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ సాయిప్రసన్న భర్త ఓగిబోయిన చిరంజీవి సోమవారం జనసేనలో చేరారు. -
గిరిజనులు చింత తీరేనా?
[ 23-04-2024]
అల్లూరి జిల్లాలో ఈ ఏడాది చింతపండు దిగుబడులు గిరిజన రైతులను పూర్తిగా నిరాశపరిచాయి. -
గిరి విద్యార్థుల జయకేతనం
[ 23-04-2024]
పది ఫలితాల్లో గిరి విద్యార్థులు రాణించారు. ఫలితాలపై పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ ఆనందం వ్యక్తం చేశారు. -
ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు
[ 23-04-2024]
నిషేధిత మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఆరుగురు కీలక సభ్యులు విశాఖ రేంజి డీఐజీ విశాల్ గున్ని, అల్లూరి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఎదుట లొంగిపోయారు. -
బూడి ఆస్తులు రూ.7.39 కోట్లు, అప్పులు రూ.2.54 కోట్లు
[ 23-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ వైకాపా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుతోపాటుగా ఇతని భార్య రమణమ్మకు రూ.7.39 కోట్లు ఆస్తులు ఉండగా, అప్పులు రూ. 2.54 కోట్లు ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా