ఇంటికే పోషకాహారం
అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ కార్యక్రమాల కింద ప్రతి నెలా ప్రభుత్వం పోషకాహారం అందిస్తోంది.. కేంద్రాలు దూరంగా ఉండటంతో కొందరు, ఆరోగ్య సమస్యల కారణంగా ఇంకొందరు, ఇలా ఎక్కువ మంది రావడం లేదు.
జులై 1 నుంచి అమలు
ఎటపాక (రంపచోడవరం), న్యూస్టుడే
కరోనా సమయంలో సరకులు ఇంటింటికీ అందిస్తున్న అంగన్వాడీ సిబ్బంది
అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ కార్యక్రమాల కింద ప్రతి నెలా ప్రభుత్వం పోషకాహారం అందిస్తోంది.. కేంద్రాలు దూరంగా ఉండటంతో కొందరు, ఆరోగ్య సమస్యల కారణంగా ఇంకొందరు, ఇలా ఎక్కువ మంది రావడం లేదు. ఈ నేపథ్యంలో పోషకాహారాన్ని కేంద్రంలోనే తీసుకుంటారా, ఇంటికి తీసుకెళ్తారా, సరకులు ఇంటికి ఇవ్వమంటారా అని గత నెలలో లబ్దిదారుల నుంచి అభిప్రాయం సేకరించారు. అధిక శాతం మంది ఇంటికే అందించాలని చెప్పడంతో మళ్లీ లబ్ధిదారులకు సరకులు ఇంటికే ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా 3,214 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో చిన్నారులు 78,061మంది, టేక్ హోం రేషన్ లబ్ధిదారులైన గర్భిణులు 12,549, బాలింతలు 50,183మంది ఉండగా వారందరికీ జులై ఒకటి నుంచి ఇంటికే పోషకాహారం అందించేందుకు అధికారులు అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
జిల్లాలో కొవిడ్ సమయంలో రెండేళ్ల పాటు టేక్ హోం రేషన్ (టీహెచ్ఆర్) పేరుతో సరకులు లబ్ధిదారుల ఇళ్లకే అందించారు. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో అంగన్వాడీ కేంద్రాలను మళ్లీ తెరిచారు. ప్రభుత్వం గతేడాది జూన్ ఒకటి నుంచి కేంద్రాల్లోనే లబ్ధిదారులకు వేడిగా భోజనం వండి పెట్టాలని ఆదేశించింది. ఆ మేరకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందించారు. పూర్తిస్థాయిలో లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడంతో కొంత వెసులుబాటు కల్పించారు. నెలలు నిండటం, ఆరోగ్య సమస్యలు చిన్నారుల సంరక్షణ వంటి కారణాలతో ఇంటికి తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పించారు. మెజార్టీ సభ్యులు ఇంటికే సరకులు ఇవ్వాలని సూచించడంతో నెలలో రెండు విడతలుగా వీటిని అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే మూడేళ్ల నుంచి ఏడేళ్ల లోపు చిన్నారులకు పోషకాహారం ఇంటికే ఇస్తున్నారు.
వినాయకపురంలో భోజనం చేస్తున్న గర్భిణులు
తీరనున్న ఇబ్బందులు..
ఇంటికే సరకులు అందజేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలింతలు, గర్భిణులు కేంద్రాలకు వచ్చేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ముఖ్యంగా వర్షాకాలంలో కేంద్రాలకు వచ్చే సమయంలో వర్షానికి తడిస్తే అనారోగ్యానికి గురవుతామని ఆందోళన చెందేవారు. పట్టణం, పల్లెల్లో అనేక చోట్ల ఇరకు ఇళ్లలో కేంద్రాలు నిర్వహించడంతో సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడేవారు. శస్త్రచికిత్స చేయించుకున్న బాలింతలు కేంద్రాలకు నడిచి వెళ్లేందుకు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు తాము పడిన ఇబ్బందులు తొలగుతాయని వారు పేర్కొంటున్నారు.
ఇకపై రాగుల పిండి
అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పోషకాహారం జులై 1నుంచి సరకుల రూపంలో లబ్దిదారుల ఇంటికే ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచించారు. ప్రతి నెలా ఒకటి నుంచి అయిదో తేదీ మధ్యలో మొదటి విడతగా బియ్యం కందిపప్పు, నూనె, కోడిగుడ్లు, పాలు, రాగిపిండి, అటుకులు, బెల్లం, చిక్కీలు, ఎండు ఖర్జూరం అందిస్తాం. రెండో విడతగా 16, 17 తేదీల్లో కోడిగుడ్లు, పాలు ఇస్తారు. కేంద్రాల్లో అందిస్తున్న జొన్న పిండి స్థానంలో రాగిపిండి పంపిణీ చేస్తాం. -సూర్యలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ
నెలకు అందించే సరకులివే..
బియ్యం 3 కేజీలు, కందిపప్పు కేజీ, నూనె 500 గ్రాములు, గుడ్లు 25, పాలు అయిదు లీటర్లు, రాగిపిండి రెండు కేజీలు, అటుకులు కేజీ, ఖర్జూరం 250 గ్రాములు, చిక్కీలు 250 గ్రాములు, బెల్లం 250 గ్రాములు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.