logo

పాముకాటుతో బాలుడి మృతి

పాముకాటుకు గురైన ఓ బాలుడు అరకులోయ ప్రాంతీయ వైద్య కేంద్రంలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Published : 28 May 2023 01:54 IST

అరకులోయ: పాముకాటుకు గురైన ఓ బాలుడు అరకులోయ ప్రాంతీయ వైద్య కేంద్రంలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. డుంబ్రిగుడ మండలం రంగిలిసింగి పంచాయతీ కింజేరి వాకపల్లికి చెందిన కిల్లో దొయితెరి(14) శనివారం ఉదయం ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు డుంబ్రిగుడ పీహెచ్‌సీకి తరలించగా మెరుగైన వైద్యం నిమిత్తం అరకులోయ తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని