భారీ వర్షాలు.. నేలకూలిన చెట్లు
వారం రోజులుగా కాస్తున్న ఎండలకు ఇబ్బందులు పడిన ఏజెన్సీ వాసులు ఆదివారం మధ్యాహ్నం పడిన వర్షంతో ఊరట చెందారు.
ఐటీడీఏ సి-క్వార్టర్స్ వద్ద ఇంటిపై పడిన చెట్టు
రంపచోడవరం, న్యూస్టుడే: వారం రోజులుగా కాస్తున్న ఎండలకు ఇబ్బందులు పడిన ఏజెన్సీ వాసులు ఆదివారం మధ్యాహ్నం పడిన వర్షంతో ఊరట చెందారు. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో స్థానిక ఐటీడీఏ సి-క్వార్టర్స్, సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో చెట్లు పడిపోయాయి. మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సిబ్బంది చెట్టుకొమ్మలు తొలగించి సరఫరా పునరుద్ధరించారు.
చినరేలంగిపాడులో విద్యుత్తు తీగలపై పడిన తాటిచెట్టు
రాజవొమ్మంగి, న్యూస్టుడే: రాజవొమ్మంగిలో ఉరుములు, మెరుపుల తో వడగళ్ల వర్షం కురిసింది. చినరేలంగిపాడు, రాజవొమ్మంగిలో పలుచోట్ల తాటిచెట్లు, ఇతర చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలపై పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మామిడి కాయలు నేలరాలాయి. లాగరాయిలో వడగళ్ల వాన కురిసింది. శరభవరం, కొండపల్లి, సూరంపాలెం, దూసరపాము, వట్టిగెడ్డ, సింగంపల్లి, తంటికొండ, బడదనాంపల్లి, చినలరేలంగిపాడు, రాజుపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. సిబ్బంది సరఫరా పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యారు.
అడ్డతీగల: అడ్డతీగలలో ఈదురు గాలులు, వర్షానికి పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలపై పడ్డాయి. సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ట్రాన్స్కో సిబ్బంది మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యారు.
పిడుగు పడి ఇద్దరికి గాయాలు
సీలేరు: జీకేవీధి మండలం ద]ుప్పిలవాడ పంచాయతీ పెద్ద అగ్రహారం వద్ద ఆదివారం పిడుగుపడి ఇద్దరికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన కిముడు లక్ష్మి, మణి ఇంటి వద్ద ఉండగా మునగచెట్టుపై పిడుగు పడింది. వీరిద్దరూ అస్వస్థతకు గురయ్యారు. వారిని సీలేరు పీహెచ్సీకి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
సున్నిత ప్రాంతాల్లో ఎన్నికలెలా?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అత్యంత సున్నిత, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ప్రాథమికంగా గుర్తించారు. -
దాహార్తి తీర్చండి...
[ 29-03-2024]
తాగునీటి కొరత, విద్యుత్తు లోవోల్టేజితో ఇబ్బంది పడుతున్నామని మండలంలోని జడ్డంగి పంచాయతీ చైతన్యనగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. -
పోలవరం ముంపు గ్రామాలకు నిర్వాసితులు
[ 29-03-2024]
పునరావాస కాలనీల నుంచి పోలవరం ముంపు గ్రామాలకు గిరిజన నిర్వాసితులు ఒక్కొక్కరిగా వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు నేపథ్యంలో దేవీపట్నం మండలంలోని గిరిజన నిర్వాసితులకు పోతవరం నుంచి ఫజుల్లాబాద్ వరకూ ప్రభుత్వం పునరావాస కాలనీలు ఏర్పాటు చేసింది. -
నాలుగేళ్లు నిద్ర.. పది రోజుల్లో పరుగులు
[ 29-03-2024]
మన్యంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం హడావుడిగా నిర్మాణాలు ప్రారంభించి పది రోజుల్లో పూర్తిచేస్తున్న వైనం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. -
వైకాపాను చిత్తుగా ఓడించాలి: శిరీషాదేవి
[ 29-03-2024]
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు వైకాపాను ఓడించాలని రంపచోడవరం తెదేపా అభ్యర్థినిగా ప్రకటించిన మిరియాల శిరీషాదేవి పిలుపునిచ్చారు. -
చంద్రబాబుపై పూర్తి విశ్వాసం: దొన్నుదొర
[ 29-03-2024]
తెదేపా- భాజపా- జనసేన కూటమి అభ్యర్థిగా అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో తాను పోటీచేసి విజయం సాధిస్తానని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి సియ్యారి దొన్నుదొర అన్నారు -
అవకాశం వచ్చింది.. త్వరపడితే మంచిది
[ 29-03-2024]
బాలికల విద్యకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచే కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. -
భవిత బాగుకు కూటమి గెలవాలి
[ 29-03-2024]
పట్టణంలోని రింగు రోడ్డు, ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో గురువారం కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ప్రచారం నిర్వహించారు. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత