అకాల వర్షం.. ఆఖరిలో కష్టం
మిరప సాగుచేస్తున్న రైతులకు చివరిదశలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. అకాల వర్షాలతో వీరంతా నానా అవస్థలు పడుతున్నారు.
మిరప కాయలపై బరకం కప్పుతున్న రైతుల్ఠు
ఎటపాక, న్యూస్టుడే: మిరప సాగుచేస్తున్న రైతులకు చివరిదశలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. అకాల వర్షాలతో వీరంతా నానా అవస్థలు పడుతున్నారు. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో మిరప కాయలు తడవకుండా కాపాడుకునేందుకు అన్నదాతలు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది సాగు ప్రారంభం నుంచి రైతులు ఎన్నో కష్టాలు పడ్డారు. తొలుత గోదావరి వరదలు, ఆ తర్వాత భారీ వర్షాలకు రెండు నెలల పాటు సాగు నిలిచిపోయింది. ఆ తర్వాత అంతంత మాత్రంగా చేస్తున్న సాగును తుపానులు దెబ్బతీశాయి. తెగుళ్లతో దిగుబడి తగ్గిపోయింది. దిగుబడిని తగ్గించాయి. గన్నవరం, నందిగామ, మురుమూరు, గౌరిదేవిపేట, గన్నేరుకొయ్యలపాడు, నెల్లిపాక గ్రామాల్లో కల్లాల్లో వందల క్వింటాళ్లలో మిరప కాయలు ఉన్నాయి. ప్రస్తుతం చివరి దశలో కోతలు కోస్తున్నారు. ఇప్పటివరకు అమ్మిన కాయలు పెట్టుబడికి, అప్పులకు, కౌలు చెల్లించేందుకే సరిపోయాయని.. ఇప్పుడు కల్లాల్లో ఉన్న కాయలు అమ్మితేనే పైసా కనిపిస్తుందని.. ఇలాంటి తరుణంలో అకాల వర్షాలతో ఆందోళన తప్పడం లేదని రైతులు చెబుతున్నారు. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి. పంటను కళ్లల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నామని చెబుతున్నారు. వర్షాల కారణంగా మిరప కాయలు నాణ్యత కోల్పోయి కనీస ధర పలకడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఈదురుగాలుల బీభత్సం
వరిగెలపాలెంలో ఎగిరిపోయిన ఇంటి రేకులు
చింతపల్లి గ్రామీణం, జి.మాడుగుల, గూడెంకొత్తవీధి, న్యూస్టుడే: జి.మాడుగుల మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి గెమ్మెలి పంచాయతీ వరిగెలపాలెం గ్రామానికి చెందిన కురిడే లక్ష్మయ్య, పండ్లి బాలరాజు, సెగ్గే లక్ష్మయ్య ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. పిడుగుల శబ్దాలకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గూడెంకొత్తవీధి మండలంలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. గూడెంకొత్తవీధిలోని జీసీసీ పెట్రోల్ బంకు సమీపంలో రెండు చెట్లు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు ఆ చెట్లను తొలగించారు. విద్యుత్తు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. లంబసింగి, తాజంగి, రాజుపాకలు తదితర గ్రామాల్లో ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. గాలుల ప్రభావానికి తాజంగి పంచాయతీ బలబద్రం గ్రామానికి చెందిన రైతు వనుం శ్యాంసుందర్ రేకుల ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. మొండి గోడలు మాత్రమే మిగిలాయి. ఇదే పంచాయతీలోని రేగుబయలు గ్రామంలో పాంగి రామకృష్ణకు చెందిన ఆరు మేకలు, ఒక లేగదూడ పిడుగుపాటుకు మృతి చెందాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!