దేవుడి భూముల్లో దర్జాగా పాగా
ఆ భూములు ఆ ఊరి రాములోరి సొత్తు.. ఏళ్ల తరబడి అన్నదాతలు వాటిలో సాగుచేసుకుంటూ శిస్తులు చెల్లించేవారు.. కొన్నేళ్లు తర్వాత ఒకరిద్దరు రైతులు ఆ భూములు తమవేనంటూ పట్టాల్లో పేర్లు చేర్చుకున్నారు.
ముత్యాలనాయుడి ఇలాకాలో ఆలయ భూములు అన్యాక్రాంతం
అధికారం అండతో గుప్పిట్లో పెట్టుకున్న స్థిరాస్తి వ్యాపారి
ఈనాడు డిజిటల్, అనకాపల్లి
దేవాదాయశాఖ భూమిలో స్థిరాస్తి వ్యాపారి వేసిన తోట
ఆ భూములు ఆ ఊరి రాములోరి సొత్తు.. ఏళ్ల తరబడి అన్నదాతలు వాటిలో సాగుచేసుకుంటూ శిస్తులు చెల్లించేవారు.. కొన్నేళ్లు తర్వాత ఒకరిద్దరు రైతులు ఆ భూములు తమవేనంటూ పట్టాల్లో పేర్లు చేర్చుకున్నారు.. వాటిని వేరేవారికి అమ్మేసుకున్నారు.. ఇప్పుడు వారి నుంచి ఓ స్థిరాస్తి వ్యాపారి కొనుగోలు చేశారు. ఇవన్నీ గుట్టుచప్పుడు కాకుండానే జరిగిపోయాయి. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సొంతూరు తారువాని ఆనుకుని ఉన్న మారేపల్లి రెవెన్యూ పరిధిలో జరిగిన ఈ భూ బాగోతం గతేడాదే వెలుగులోకి వచ్చింది. దేవుడి భూములను కారుచౌకగా కొని లేఅవుట్ వేసి దారి కోసం మరో గుడి పేరుతో కొండను పేల్చి రోడ్డును నిర్మించేశారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉండాల్సిన విలువైన భూములు పరుల చేతిలోకి వెళ్లినట్లు సంబంధింత అధికారులు కూడా గుర్తించారు. అయితే స్థిరాస్తి వ్యాపారికి అధికార పార్టీ నేతల అండదండలుండడంతో ఆ భూముల స్వాధీనం దిశగా అడుగులు వేయలేకపోతున్నారు. ఏడాదిగా కాగితాలతోనే కాలయాపన చేస్తున్నారు.
దేవరాపల్లి మండలం మారేపల్లి రెవెన్యూ సర్వే నంబరు 115లో 23.15 ఎకరాలు ఆ ఊరి శ్రీరామస్వామి వారి గుడి పేరున ఉంది. శారదా నదికి ఆనుకుని ఉన్న ఈ భూమి కాలక్రమంలో చేతులు మారుతూ రియల్ఎస్టేట్ వ్యాపారుల గుప్పిటలోకి వచ్చింది. అడంగల్లో గుడి పేరిట ఈ భూములు నమోదై ఉన్నా.. కొందరి రైతుల పేర్లను చేర్చి ఈ భూ బాగోతం నడిపించారు. గతంలో ఈ భూముల హక్కుల విషయమై కోర్టులకు ఎక్కినా న్యాయస్థానం కూడా అవి దేవుడి భూములుగానే పేర్కొంది. అయినా స్థిరాస్తి వ్యాపారి పట్టువదల కుండా ఈ భూములను తమవారి పేరిట పాసుపస్తుకాలు పొందడానికి ప్రయత్నించగా తహసీల్దారు తిరస్కరించారు. ఆ భూములపై వచ్చిన ఫిర్యాదు మేరకు అవి దేవాదాయ భూములో కాదో తేల్చి చెప్పాలని గతేడాది ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్కు తహసీల్దారు లేఖ రాశారు. వారు కూడా ఈ భూములను పరిశీలించి అవి దేవాదాయ భూములేనని నిర్ధారించి వాటిపై ఎవరికీ హక్కులు కల్పించొద్దని సూచించారు. అయితే స్థిరాస్తి వ్యాపారికి అధికార పార్టీ నేతల ఆశీస్సులుండడంతో ఆయన చేతిలో ఉన్న దేవాదాయ భూములను స్వాధీనం చేసుకోవడానికి మాత్రం చొరవ చూపలేకపోతున్నారు. ఈ భూముల వ్యవహారంపై ఏడాది కాలంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దాసరి వెంకన్న అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రూ.కోట్ల విలువైన 23.15 ఎకరాల భూములను 22 (ఎ) (1 సి)లో చేర్చి రిజిస్ట్రేషన్లు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నా అధికారులు అదిగో.. ఇదిగో అంటూ తాత్సారం చేస్తూ వస్తున్నారు.
మారేపల్లిలో చేతులు మారిపోయిన 23.15 ఎకరాల భూమి ఈ గుడికి చెందిందే..
దేవాదాయ శాఖవేనని గుర్తించినా..
మారేపల్లిలోని స్థిరాస్తి వ్యాపారి చేతిలో ఉన్న 23.15 ఎకరాలకు తోడు మరో రెండు సర్వే నంబర్లలో కలిపి సుమారు 40 ఎకరాలు భూమి దేవాదాయ శాఖ చెందినవేనని గుర్తించారు. ఈ అడ్డగోలు భూ వ్యవహారంపై ఫిర్యాదులు అందిన మేరకు విచారణ జరిపి నివేదికను దేవాదాయ కమిషనరేట్కు పంపించారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఉత్తర్వుల కోసం జిల్లా అధికారులు ఎదురుచూస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ రియల్టర్ భూములను వదులుకోవడానికి ససేమిరా అంటున్నారు. అధికార పార్టీ నేతల అండతో ఆ భూములను అగ్రి ఫామ్గా అభివృద్ధి చేశారు.. మొక్కలు పెంచి.. వాటిని చూపించి బేరాలు పెడుతున్నారు. ఈ భూములు ఎప్పటికైనా దేవాదాయశాఖ చేతుల్లోకి వెళ్లిపోతాయని తెలిసినా ఆ భూమిని ప్లాట్లగా అమ్మకాలు చేయడానికి సిద్ధపడుతుండడం విశేషం. ఈ విషయమై జిల్లా దేవాదాయ శాఖ అధికారి రాజారావు వద్ద ప్రస్తావించగా మారేపల్లి సర్వే నంబరు 115లో భూములు దేవాదాయశాఖకు చెందినవేనని స్పష్టం చేశారు. 22ఏ (1సి)లో చేర్చడానికి ప్రతిపాదిస్తూ ఉన్నతాధికారులకు దస్త్రం పంపించామన్నారు. వారి నుంచి అనుమతి వచ్చాక మిగతా చర్యలు చేపడతామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నేనున్నానన్నావు.. నట్టేట్లో ముంచావు!
[ 24-04-2024]
విలీన మండలాల్లో కూనవరం, వరరామచంద్రాపురం దాదాపు 90 శాతం ముంపు బారిన పడుతున్నాయి. ఇక్కడ గత తెదేపా ప్రభుత్వమే పూర్తిచేసి పునరావాస కాలనీలను నిర్మించింది. -
ఎంటీఎస్ ఉపాధ్యాయులకు తొలగింపు ఉత్తర్వులు
[ 24-04-2024]
ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) ప్రాతిపదికన పనిచేస్తున్న డీఎస్సీ-98, 2008 ఉపాధ్యాయులను తొలగిస్తూ జిల్లా నోడల్ విద్యాశాఖాధికారి చంద్రకళ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మహిళపై ప్రియుడి దాడి
[ 24-04-2024]
మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లువ్వాసింగి పంచాయతీ వలసమామిడి గ్రామానికి చెందిన సారే సత్యవతి భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మసాడి విశ్వేశ్వరరావుతో సహజీవనం చేస్తోంది. -
ఏకతాటిపైకి నేతలు.. తెదేపాలో నూతనోత్సాహం
[ 24-04-2024]
రంపచోడవరం నియోజవర్గంలో తెదేపా నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
రక్షణ మంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు
[ 24-04-2024]
అనకాపల్లిలో బుధవారం నిర్వహించనున్న పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ విజయీభవ ర్యాలీకి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ విచ్చేస్తున్నారు. -
మాడుగులను అగ్రగామిగా నిలుపుతా
[ 24-04-2024]
మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. -
చేతకాక చేతులెత్తేశారు...
[ 24-04-2024]
పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు ఎన్నో హామీ లిచ్చిన జగన్ ఆ తర్వాత వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు