logo

తురబాల గెడ్డవద్ద రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదంలో కొడుకు కళ్లముందే తండ్రి దుర్మరణం చెందిన ఘటన కొయ్యూరు మండలం తురబాల గెడ్డ సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

Updated : 30 May 2023 06:56 IST

కొడుకు కళ్లముందే తండ్రి దుర్మరణం

సత్యరాజ్‌ (పాతచిత్రం), తీవ్రంగా గాయపడిన జోగా అప్పలనర్స

కొయ్యూరు, నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో కొడుకు కళ్లముందే తండ్రి దుర్మరణం చెందిన ఘటన కొయ్యూరు మండలం తురబాల గెడ్డ సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్సై రాజారావు కథనం ప్రకారం.. నర్సీపట్నానికి చెందిన మర్తుర్తి సత్యరాజ్‌ (55) అల్యూమినియం ఫ్రేమ్‌లతో ఇళ్లకు అద్దాల కిటికీలు అమర్చే పనులు చేస్తుంటాడు. చింతపల్లిలో ఓ భవన పనుల కోసం సోమవారం ఉదయం సామగ్రి తీసుకుని తన కుమారుడు వంశీని వెంట పెట్టుకుని వ్యాన్‌లో బయలుదేరాడు. తురబాల గెడ్డ సమీపానికి వచ్చేసరికి ఒడిశా నుంచి ఎదురుగా వస్తున్న మరో వ్యాన్‌ బలంగా ఢీ కొట్టింది. డ్రైవర్‌ పక్కన కూర్చున్న సత్యరాజ్‌ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. వీరు తీసుకువెళుతున్న ఓ అద్దం పగిలి సత్యరాజ్‌ నుదుటి భాగానికి గుచ్చుకోవడంతో స్థానికులు తొలగించినట్టు సమాచారం. అతని కుమారుడు వంశీ (24)కి స్వల్ప గాయాలయ్యాయి. కళ్ల ముందే కన్నతండ్రి కన్నుమూయడంతో వంశీ కన్నీరుమున్నీరయ్యాడు. ఈ యువకుడు బి.టెక్‌ చదువుకున్నాడు. డ్రైవర్‌ రొంగలి గోవింద్‌కు కాలు విరిగింది. గొలుగొండ మండలం రావణాపల్లి గ్రామానికి చెందిన జోగా అప్పలనర్స (45) సంతల్లో కాయగూరలు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. కాయగూరలు తీసుకుని వ్యాన్‌లో ఎక్కిన ఈమె తలకి బలమైన గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో విశాఖపట్నం తీసుకెళ్లారు. సత్యరాజ్‌ మృతదేహాన్ని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని