సచివాలయ ఉద్యోగిని హత్య!
అచ్యుతాపురంలో గిరిజన మహిళ హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడే హత్య చేశాడని పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
విగత జీవిగా మహాలక్ష్మి, మరుగుదొడ్డిలో శ్రీనివాసకుమార్
అచ్యుతాపురం, రాంబిల్లి, ఎలమంచిలి - న్యూస్టుడే: అచ్యుతాపురంలో గిరిజన మహిళ హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడే హత్య చేశాడని పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. విశాఖ జీవీఎంసీ పరిధిలో గల కూర్మన్నపాలేనికి చెందిన గిరిజన యువతి మహాలక్ష్మి (27) అచ్యుతాపురంలోని ఓ లాడ్జిలో సోమవారం మృతిచెందింది. ఇదే గదిలోని మరుగుదొడ్డిలో భర్త మాడే శ్రీనివాసకుమార్ గాయాలతో కనిపించారు. వీరు ఇద్దరూ ఉంటున్న గది నుంచి కేకలు వినిపించడంతో లాడ్జి సిబ్బంది చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు తీయించి చూడగా యువతి రక్తపు మడుగులో విగత జీవిగా పడిఉంది. పోలీసులు రావడంతో గాయాలతో ఉన్న శ్రీనివాసకుమార్ మరుగుదొడ్డిలోకి వెళ్లాడు. దాంతో తలుపు పగులగొట్టి బయటకు తీసుకొచ్చిన పోలీసులు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.
విశాఖ ఉక్కు ఉద్యోగి సాంబ, కల్యాణి దంపతుల ఏకైక కుమార్తె మహాలక్ష్మి చదువుల్లో ముందుండేది. వ్యవసాయ బీఎస్సీ పూర్తిచేసి రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెం సచివాలయం పరిధిలో రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ సహాయకురాలిగా పనిచేస్తోంది. గాజువాక కళాశాలలో ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే ఈమెకు సీనియర్ అయిన శ్రీనివాసకుమార్తో పరిచయమై ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో రహస్యంగా రిజిస్ట్ర్టార్ కార్యాలయంలో పెళ్లి చేసుకొంది. సోమవారం ఎలమంచిలిలో వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆమె హాజరైంది. తర్వాత అచ్యుతాపురం వచ్చింది. రోజూ మాట్లాడినట్లే భోజన సమయంలో తల్లి కళ్యాణితో మాట్లాడింది. తల్లికి చెప్పకుండానే మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో లాడ్జీకి వచ్చింది. శ్రీనివాసకుమార్ ఉదయం 10.38 నిమిషాలకు రెసిడెన్సీలోని 303 గదిలోకి ఒక్కడే వచ్చిన్నట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. కొద్ది సమయం మాట్లాడుకున్న ఇద్దరు తరవాత పెద్దపెద్ద కేకలు వేసుకున్నారు. వీరు ఉన్న గది నుంచి పెద్దపెద్ద శబ్దాలు రావడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది గమనించి తలుపులు తియ్యమన్నా దుస్తులు మార్చుకుంటున్నామని వచ్చేస్తామని చెప్పి సిబ్బందిని ఆయన నమ్మించాడు. సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చిన తరవాత తలుపులు తీసి మరుగుదొడ్డిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. సీఐ మురళీరావు, ఎస్సై సన్యాసినాయుడు దర్యాప్తు చేస్తున్నారు.
దర్యాప్తు చేస్తున్న సీఐ మురళీరావు, ఎస్సై సన్యాసినాయుడు
గతంలోనే ఫిర్యాదు చేసినా..
బీసీ వర్గానికి చెందిన శ్రీనివాసకుమార్ తల్లి, ఆడపడుచులు పలుమార్లు తక్కువ కులం పేరుతో తమ కుమార్తెను వేధించేవారని, వీటిని భరించలేక ఇంటికి వచ్చేసిందని మహాలక్ష్మి తల్లిదండ్రులు సాంబ, కళ్యాణి ‘న్యూస్టుడే’తో చెప్పారు. చివరికి విడాకులు తీసుకోవడానికి కోర్టును ఆశ్రయించినా ఆయన కోర్టుకు వచ్చేవాడు కాదన్నారు. రాంబిల్లి మండలంలో విధులు నిర్వహించడానికి వెళ్లే సమయంలో ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి చంపడానికి ప్రయత్నించాడని, ఇంటికి వచ్చి చంపుతానని పలుమార్లు బెదిరించాడని ఆరోపించారు. కులంపేరుతో దూషించడం, వేధింపులు, చంపుతానని బెదిరించడంపై కూర్మన్నపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. పోలీసులు పట్టించుకొని ఉంటే మహాలక్ష్మి బతికే ఉండేదని వాపోయారు.
అనుమానంతోనే..: శ్రీనివాసకుమార్కి మహాలక్ష్మిపై అనుమానం పెంచుకున్నాడని, స్నేహితులతో సరదాగా మాట్లాడినా తట్టుకోలేని విధంగా ప్రవర్తించే వాడని ఆమెతో పనిచేసే ఉద్యోగులు, అధికారులు తెలిపారు. ఆమె చాలా తెలివైందని ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదని పలువురు చెప్పారు. రెండేళ్లుగా రైతులకు సేవలు అందిస్తున్న మహలక్ష్మి మృతితో కొప్పుగొండుపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
సున్నిత ప్రాంతాల్లో ఎన్నికలెలా?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అత్యంత సున్నిత, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ప్రాథమికంగా గుర్తించారు. -
దాహార్తి తీర్చండి...
[ 29-03-2024]
తాగునీటి కొరత, విద్యుత్తు లోవోల్టేజితో ఇబ్బంది పడుతున్నామని మండలంలోని జడ్డంగి పంచాయతీ చైతన్యనగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. -
పోలవరం ముంపు గ్రామాలకు నిర్వాసితులు
[ 29-03-2024]
పునరావాస కాలనీల నుంచి పోలవరం ముంపు గ్రామాలకు గిరిజన నిర్వాసితులు ఒక్కొక్కరిగా వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు నేపథ్యంలో దేవీపట్నం మండలంలోని గిరిజన నిర్వాసితులకు పోతవరం నుంచి ఫజుల్లాబాద్ వరకూ ప్రభుత్వం పునరావాస కాలనీలు ఏర్పాటు చేసింది. -
నాలుగేళ్లు నిద్ర.. పది రోజుల్లో పరుగులు
[ 29-03-2024]
మన్యంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం హడావుడిగా నిర్మాణాలు ప్రారంభించి పది రోజుల్లో పూర్తిచేస్తున్న వైనం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. -
వైకాపాను చిత్తుగా ఓడించాలి: శిరీషాదేవి
[ 29-03-2024]
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు వైకాపాను ఓడించాలని రంపచోడవరం తెదేపా అభ్యర్థినిగా ప్రకటించిన మిరియాల శిరీషాదేవి పిలుపునిచ్చారు. -
చంద్రబాబుపై పూర్తి విశ్వాసం: దొన్నుదొర
[ 29-03-2024]
తెదేపా- భాజపా- జనసేన కూటమి అభ్యర్థిగా అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో తాను పోటీచేసి విజయం సాధిస్తానని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి సియ్యారి దొన్నుదొర అన్నారు -
అవకాశం వచ్చింది.. త్వరపడితే మంచిది
[ 29-03-2024]
బాలికల విద్యకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచే కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. -
భవిత బాగుకు కూటమి గెలవాలి
[ 29-03-2024]
పట్టణంలోని రింగు రోడ్డు, ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో గురువారం కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ప్రచారం నిర్వహించారు. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం