పునరావాసానికి ఇంకెన్నేళ్లు...!
పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న కాలనీ నిర్మాణం నత్తతో పోటీ పడుతుంది. ఏళ్లు గడిచిపోతున్నా నిర్మాణాలు పూర్తి కావడం లేదు.
కూనవరం, న్యూస్టుడే
పూర్తైన గృహాలు
పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న కాలనీ నిర్మాణం నత్తతో పోటీ పడుతుంది. ఏళ్లు గడిచిపోతున్నా నిర్మాణాలు పూర్తి కావడం లేదు. ప్రచార ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వాలు నిర్వాసితుల సమస్యపై మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కూనవరం మండలం భైరవపట్నంలో పోలవరం నిర్వాసితుల కోసం ఒక కాలనీ నిర్మాణాన్ని ఆరేళ్ల క్రితం చేపట్టారు. ఇక్కడకు వీఆర్పురం మండలం జీడిగుప్పకు చెందిన 159 మంది నిర్వాసిత కుటుంబాలను తరలించాల్సి ఉంది. వీరి కోసం 159 ఇళ్లను కట్టి అప్పగించే బాధ్యతను అప్పటి ప్రభుత్వం ర.భ శాఖ అధికారులకు అప్పగించింది. 2018నాటికే దాదాపు 50 శాతం పనులు పూర్తిచేసిన గుత్తేదారు ఆ తరువాత పనులు ఆపివేశారు. అప్పటి నుంచి పనులు మందకొడిగానే సాగుతున్నాయి. సింగిల్ హౌస్ల నిర్మాణాలు మొత్తం పూర్తికాగా... జాయింట్ హౌస్లు మాత్రం చివరి దశలో ఉన్నాయి. కాలనీలో నిర్మించాల్సిన ప్రభుత్వ భవనాలు పునాదులు దాటడం లేదు. కాలనీకి వెళ్లే మార్గం రాళ్లు, గుంతలతో నిండి ఉంది. వరదలతో ఈ కాలనీ కేటాయించిన గ్రామం జీడిగుప్ప ఇప్పటికే అతలాకుతలం అవుతోంది. ఇక్కడి వారిని హుటాహుటిన తరలించాలని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో పనుల్లో వేగం కనిపించడం లేదు. గతేడాది గోదావరి వరదలు వరుసగా మూడు నెలల పాటు గ్రామాలను ముంచెత్తాయి. దీంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో నెల రోజుల్లో వర్షాకాలం వస్తోంది. మరోసారి వరదలు ఎదుర్కోవాలనే తలంపు వీరిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అధికారులు వేగంగా పునరావాస కాలనీ నిర్మాణాలను పూర్తిచేసి తమను తరలించాలని నిర్వాసితులు కోరుతున్నారు.
పునాదుల్లోనే మగ్గుతున్న ప్రభుత్వ భవన నిర్మాణం
కాలనీ ఇంకా అప్పగించలేదు
కూనవరం మండలం భైరవపట్నంలో ర.భ శాఖ ఆధ్వర్యంలో కాలనీ నిర్మిస్తున్నారు. ఇది ఇంకా పూర్తికాలేదు. వారు పూర్తిచేసి అప్పగించిన వెంటనే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నిర్వాసితులను ఆ కాలనీకి తరలిస్తాం. వేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే గుత్తేదారుకు ఆదేశాలు అందాయి.
శ్రీధర్, తహసీల్దార్, వీఆర్పురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
రెండో రోజు నామినేషన్ల సందడి
[ 20-04-2024]
నామినేషన్ల స్వీకరణ రెండో రోజు అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ తెలిపారు. -
అనంత బాబు అరాచకాలకు ముగింపు పలుకుదాం
[ 20-04-2024]
ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకాలతో మన్యం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వైకాపాను ఓడించి ఆయన ఆట కట్టించడమే తమ లక్ష్యమని రంపచోడవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి స్పష్టంచేశారు. -
కన్నాయిగూడెం ఎంపీటీసీ సభ్యుడి హత్య
[ 20-04-2024]
కన్నాయిగూడెం మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఇందుకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం వివరాలు వెల్లడించారు. -
సిద్ధం..ప్రయాణానికి యుద్ధం
[ 20-04-2024]
‘ఎక్కడైనా సీఎం వస్తున్నాడంటే వరాలు జల్లులు కురిపిస్తారని ఆనందపడతారు. జగన్ వస్తే మాత్రం అమ్మో అంటున్నారు. ఈ సీఎం వస్తే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే.. కరెంటు తీగలు తొలగించాల్సిందే. -
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 20-04-2024]
కశింకోట మండలం తాళ్లపాలెం డా.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
చంద్రబాబు ఆశీస్సులున్నాయి: ఈశ్వరి
[ 20-04-2024]
తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శుక్రవారం కొయ్యూరు మండలంలో పర్యటించారు. తన అనుచరులను కలిసి నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. -
ఎండ తీవ్రతతో ద్విచక్రవాహనం దగ్ధం
[ 20-04-2024]
అధిక ఉష్ణోగ్రతతో ఓ ద్విచక్రవాహనం దగ్ధమైన ఘటన శుక్రవారం పాడేరు పట్టణంలో చోటుచేసుకుంది. పాడేరు ప్రధాన రహదారి సినిమాహాల్ కూడలి వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. -
ఏజెన్సీలో వేసవి తాపం
[ 20-04-2024]
మైదాన ప్రాంతాలకు దీటుగా ఈ సారి ఏజెన్సీ ప్రాంతంలోనూ వేసవి తాపం గట్టిగానే చూపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా ఏజెన్సీలో ప్రధాన కేంద్రాలైన పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
సైకో పాలనతో ప్రజలకు తీవ్రనష్టం
[ 20-04-2024]
అరకులోయ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్లు దాఖలు చేసే ముందు ఆయన స్వగ్రామం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ లకేయిపుట్టులో గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నిర్వాసితులను ముంచిన జగన్
[ 20-04-2024]
జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జిల్లాలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడేరు పట్టణంలో పర్యటించి అనేక హామీలు గుప్పించారు. -
పోక్సో కేసులో ప్రిన్సిపల్కు ఐదేళ్ల జైలు
[ 20-04-2024]
ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రిన్సిపల్ నాగసాయి నరసింహమూర్తికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం