ఖాతాలకు చేరని ఖనిజ నిధి
జిల్లా ఖనిజాభివృద్ధి నిధి (డీఎంఎఫ్) రూపంలో లీజుదారుల నుంచి సొమ్ములైతే వసూలు చేస్తున్నారు.. వాటితో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు మాత్రం కనబడడం లేదు.
జిల్లాల్లో వనరుల ఆధారంగా డీఎంఎఫ్ వాటాలు
రెండేళ్లుగా సొమ్ముల్లేక నిలిచిన అభివృద్ధి పనులు
ఈనాడు డిజిటల్, పాడేరు
ఓ మైనింగ్ ప్రాంతం
ఇటీవలే జిల్లాల వారీగా ఈ శాఖను విభజించి సహాయ సంచాలకుల స్థానంలో జిల్లా గనులశాఖ అధికారి పేరిట కొత్త కార్యాలయాలు తెరిచారు. వాటి పేరున పీడీ ఖాతాలు తెరిచి డీఎంఎఫ్ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు.
జిల్లాల వారీగా కొత్త ఖాతాలు తెరవకపోవడంతో ఆ సొమ్మును వాటాలు వేసుకోలేకపోయారు. కొన్నినెలల తర్వాత సమానంగా కాకుండా ఏ జిల్లాలో లీజులు ఎక్కువగా ఉంటాయో వాటి ఆధారంగా డీఎంఎఫ్ పంపకాలు చేసుకోవాలని ఆదేశించారు.
జిల్లా ఖనిజాభివృద్ధి నిధి (డీఎంఎఫ్) రూపంలో లీజుదారుల నుంచి సొమ్ములైతే వసూలు చేస్తున్నారు.. వాటితో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు మాత్రం కనబడడం లేదు. జిల్లాల పునర్విభజనకు ముందు నుంచి ఈ నిధులు అందుబాటులో లేకుండా పోయాయి. నిన్నమొన్నటి వరకు గనులు భూగర్భశాఖ ఉమ్మడిగా కొనసాగడంతో ఈ నిధులను జిల్లా ఖాతాకు సర్దుబాటు చేయకుండా డైరెక్టరేట్లోనే అట్టిపెట్టుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో గనులు, క్వారీలను అధికారికంగా లీజులకు తీసుకున్న నిర్వాహకులు సీనరేజి ఛార్జిల్లో 30 శాతం డీఎంఎఫ్గా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 2019-20 నుంచి గతేడాది జూన్ వరకు సుమారు రూ.55.69 కోట్లు నిధులు జిల్లాకు అందుబాటులోకి వచ్చాయి. కొవిడ్ కాలంలో ఖర్చుల కోసమని రూ.6.69 కోట్లు ప్రభుత్వం వాడుకుంది. మిగతా రూ.49.6 కోట్లు ఉమ్మడి జిల్లా ఖాతాలోనే ఉండిపోయాయి. 2022 జూన్ 14 తర్వాత నుంచి వసూళ్లు చేసిన డీఎంఎఫ్ నిధులు సుమారు రూ.9.28 కోట్లు డైరెక్టరేట్ ఖాతాలో పెట్టుకున్నారు. వీటి పంపకాలపై తలోరకంగా ఆదేశాలివ్వడంతో అధికారులు అయోమయానికి గురవ్వాల్సి వచ్చింది. మొదట మూడు జిల్లాలకు సమానంగా రూ.16 కోట్లు చొప్పున పంచుకోవాలని సూచించారు.
మూడేళ్ల క్రితం కశింకోట వద్ద డీఎంఎఫ్ నిధులతో వంతెన నిర్మాణానికి వేసిన శిలాఫలకం
ఆ లెక్కన చూస్తే అనకాపల్లి జిల్లాకు భారీగా డీఎంఎఫ్ సొమ్ము అందుబాటులోకి రానుంది. విశాఖ, అల్లూరి జిల్లాలకు ఈ నిధులు తక్కువ మొత్తంలోనే సమకూరనున్నాయి. కొత్త జిల్లాల వారీగా ఖాతాలు తెరిచినా ఖాజానా కార్యాలయాలతో వాటిని అనుసంధానించడంలో జాప్యం జరుగుతోంది. దీనివల్ల నిధులు కాగితాల్లో కనిపిస్తున్నా ఖర్చుపెట్టడానికి వీల్లేకుండా పోతుంది.
వినియోగంపై ఆంక్షలు
గనుల తవ్వకాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమయ్యే 10 నుంచి 25 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఈ నిధులను వినియోగించుకోవచ్చు. తాగునీరు, విద్య, వైద్య సేవలకు ఎక్కువగా ఉపయోగించాలి. తర్వాత ప్రాధాన్యాంశంగా రోడ్లు, ఇతర పనులు చేపట్టొచ్చు. గత ప్రభుత్వ హయాంలో ఈ నిధులను జిల్లా అధికారులు బాగానే ఉపయోగించుకున్నారు. వైకాపా సర్కారు వచ్చాక డీఎంఎఫ్ నిధుల వినియోగానికి అవరోధాలు ఎదురవుతున్నాయి. ఖాతాల్లో కనిపించే నిధులు చేతికి చిక్కడం లేదు. ఉన్న సొమ్ముల వినియోగంపై ఆంక్షలు పెట్టడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కశింకోట వద్ద శారదా నదిపై కాలిబాట వంతెనకు మూడేళ్ల క్రితం ఈ నిధులతోనే శంకుస్థాపన చేశారు. పునాదుల స్థాయిలోనే ఈ పనులు నిలిచిపోయాయి..అల్లూరి జిల్లాలోనూ డీఎంఎఫ్ నిధులతో చేపట్టిన పనుల్లో కదలిక లేకుండా పోయింది.
త్వరలో ఖాతాల్లో జమ..: గతేడాదికి సంబంధించి సుమారు రూ.6 కోట్లు అనకాపల్లి జిల్లాకు అందుబాటులో వచ్చాయి. ఇటీవలే జిల్లాల వారీగా కొత్త ఖాతాలు తెరిపించాం. ఖజానా కార్యాలయంలో ఖాతాల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయితే ఆ నిధులు కనిపిస్తాయి. అంతకుముందు ఉమ్మడి జిల్లా ఖాతాలో ఉండిపోయిన నిధులను జూన్ మొదటి వారంలో దామాషా ప్రకారం మూడు జిల్లాలకు సర్దుబాటు చేస్తారు. వాటిని కలెక్టర్ ఆదేశాల మేరకు ఖర్చుచేయడానికి వీలుంటుంది.
సుబ్బారాయుడు, జిల్లా గనులశాఖ అధికారి, అనకాపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నేనున్నానన్నావు.. నట్టేట్లో ముంచావు!
[ 24-04-2024]
విలీన మండలాల్లో కూనవరం, వరరామచంద్రాపురం దాదాపు 90 శాతం ముంపు బారిన పడుతున్నాయి. ఇక్కడ గత తెదేపా ప్రభుత్వమే పూర్తిచేసి పునరావాస కాలనీలను నిర్మించింది. -
ఎంటీఎస్ ఉపాధ్యాయులకు తొలగింపు ఉత్తర్వులు
[ 24-04-2024]
ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) ప్రాతిపదికన పనిచేస్తున్న డీఎస్సీ-98, 2008 ఉపాధ్యాయులను తొలగిస్తూ జిల్లా నోడల్ విద్యాశాఖాధికారి చంద్రకళ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మహిళపై ప్రియుడి దాడి
[ 24-04-2024]
మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లువ్వాసింగి పంచాయతీ వలసమామిడి గ్రామానికి చెందిన సారే సత్యవతి భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మసాడి విశ్వేశ్వరరావుతో సహజీవనం చేస్తోంది. -
ఏకతాటిపైకి నేతలు.. తెదేపాలో నూతనోత్సాహం
[ 24-04-2024]
రంపచోడవరం నియోజవర్గంలో తెదేపా నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
రక్షణ మంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు
[ 24-04-2024]
అనకాపల్లిలో బుధవారం నిర్వహించనున్న పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ విజయీభవ ర్యాలీకి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ విచ్చేస్తున్నారు. -
మాడుగులను అగ్రగామిగా నిలుపుతా
[ 24-04-2024]
మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. -
చేతకాక చేతులెత్తేశారు...
[ 24-04-2024]
పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు ఎన్నో హామీ లిచ్చిన జగన్ ఆ తర్వాత వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు.