మైదాన ప్రాంత ఐటీడీఏలు ఏర్పాటు చేయాలి
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో మైదాన ప్రాంత సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐటీడీఏ) ఏర్పాటు చేయాలని ట్రైబల్ రైటర్స్ ఫోరం ఛైర్మన్ డాక్టర్ ఆర్.ఎస్.వరహాల దొర డిమాండు చేశారు.
ట్రైబల్ రైటర్స్ ఫోరం డిమాండ్
ట్రైబల్ రైటర్స్ ఫోరం ప్రతినిధులు, నాయకుల సంఘీభావం
రావికమతం, న్యూస్టుడే: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో మైదాన ప్రాంత సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐటీడీఏ) ఏర్పాటు చేయాలని ట్రైబల్ రైటర్స్ ఫోరం ఛైర్మన్ డాక్టర్ ఆర్.ఎస్.వరహాల దొర డిమాండు చేశారు. అనకాపల్లి జిల్లా ట్రైబల్ రైటర్స్ ఫోరం సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు రొబ్బా లోవరాజు అధ్యక్షతన బుధవారం రావికమతంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరహాల దొర మాట్లాడుతూ బోయ, వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చడానికి అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు. 52 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 50 శాతం గిరిజనులుండే గిరిజన గ్రామాల్ని షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆదివాసీ చట్టాలపై అవగాహన చేసుకొని గిరిజనులు అందరికీ తెలియజేయాలని చెప్పారు. రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.పూర్ణారావు మాట్లాడుతూ గిరిజనులకు బలమైన సంఘం ఉండాలన్న ఉద్దేశంతో 2007లో ఫోరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
జిల్లా నూతన కార్యవర్గ ఏర్పాటు
ఫోరం నూతన కమిటీని వరహాల దొర ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సంఘం అధ్యక్షుడిగా అల్లం ఎరకన్నదొర, ఉపాధ్యక్షులుగా వడ్డి దేముడు, తగ్గి దుర్గమ్మ, ప్రధాన కార్యదర్శిగా గోగం వరహాల దొర, సహాయ కార్యదర్శిగా కంటముఖి బాబ్జి, కోశాధికారిగా రొబ్బా సతీష్లను ఎన్నుకున్నారు. జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల ఎస్టీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు, యువకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు