logo

శిశువులకు మెరుగైన వైద్యసేవలందించండి

నవజాత శిశువులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ వైద్యాధికారులను ఆదేశించారు.

Published : 02 Jun 2023 02:42 IST

నవజాత శిశు సంరక్షణ విభాగాన్ని సందర్శించిన ఐటీడీఏ పీఓ అభిషేక్‌ తదితరులు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: నవజాత శిశువులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో వసతుల లేమిపై మే 10న ‘కన్నయ్యలకు కష్టం’ శీర్షికన ‘ఈనాడు’లో వార్త ప్రచురితమైంది. దీనికి స్పందించి గురువారం ఆ విభాగాన్ని పీవో సందర్శించారు. ఒకే వార్మర్‌లో ఇద్దరు శిశువులను పెట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పాడైపోయిన భవనానికి మరమ్మతులు చేయాలని గుత్తేదారుని ఆదేశించారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ కృష్ణారావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని