అడ్డదారుల్లో ఆగని తరలింపు
తాజాగా ఏపీగురుకుల కళాశాలల వసతిగృహాలకు కాయగూరలను సరఫరా చేసే లక్ష్మణ్ అనే గూడెంకొత్తవీధికి చెందిన గుత్తేదారు తమ వాహనాల్లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు.
గంజాయి నిర్మూలన మాటల్లోనే
నిత్యం వెలుగుచూస్తున్న దందా
చింతపల్లి, సీలేరు, న్యూస్టుడే
తాజాగా ఏపీగురుకుల కళాశాలల వసతిగృహాలకు కాయగూరలను సరఫరా చేసే లక్ష్మణ్ అనే గూడెంకొత్తవీధికి చెందిన గుత్తేదారు తమ వాహనాల్లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు.
* ఈ ఏడాది ఏప్రిల్ 5న బీటెక్ చదువుతున్న ఎం.సాయి సురేంద్ర 24 కేజీల గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.
* మోతుగూడెం పోలీస్స్టేషన్ ఎస్సైగా పనిచేస్తున్న వాసంశెట్టి సత్తిబాబు గంజాయి రవాణాదారులకు సహకరించినట్లు నెల్లూరులో సెబ్ అధికారులు గుర్తించారు. ఈ సమాచారంతో ఆయన పరారయ్యారు. ఇటీవల పోలీసులకు ఆయన లొంగిపోయారు.
* ఏప్రిల్ 13న ఒడిశాలోని చిత్రకొండ నుంచి గంజాయి తరలిస్తున్న ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు కటకటాల్లోకి తరలించారు.
* చింతపల్లిలో మందుల దుకాణం నడిపే ఒకరు గతంలో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆర్ఎంపీ ముసుగులో ఈయన మారుమూల గ్రామాలకు వెళ్లి అక్కడ వైద్యం పేరుతో గిరిజనులను మచ్చిక చేసుకుని గంజాయి వ్యాపారం చేసేవారు. విషయం తెలిసి ఒక రోజు పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు.
* కొన్ని దశాబ్దాలుగా నర్సీపట్నం నుంచి సీలేరు వెళుతున్న ఒక ప్రైవేటు బస్సులో ఇటీవల ఏటిగైరంపేట వద్ద పోలీసుల తనిఖీల్లో గంజాయి చిక్కింది. ఈ వ్యవహారంలో బస్సు డ్రైవర్, కండక్టర్ల పాత్ర ఉండటంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.
..ఇలా ఒకట్రెండు కాదు.. నిత్యం ఎక్కడో ఒక చోట.. ఏదో రూపంలో.. ఏదో మార్గంలో మన్యం మీదుగా గంజాయి తరలిపోతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ మూల దొరికినా దాని మూలాలు అల్లూరి జిల్లాతోనే ముడిపడి ఉంటున్నాయి. ఇది పోలీసు యంత్రాంగానికి పెద్ద సవాలుగా మారింది. జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నియంత్రించామని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిజానికి సాగు తగ్గితే సాధారణంగా రవాణా సైతం తగ్గాలి. దీనికి భిన్నంగా రోజూ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడో ఒక చోట గంజాయి చిక్కుతూనే ఉంది. ఒడిశా భూభాగంలో పండించిన గంజాయిని వివిధ రహస్య స్ధావరాలకు తరలించి వాటిని వివిధ మార్గాల ద్వారా మైదానప్రాంతాలకు చేరవేస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికంగా అల్లూరి జిల్లాకు చెందిన యువకులే అధికంగా ఉంటున్నారు. డబ్బుకోసం ఆశపడి స్మగర్ల వలకు వీరు చిక్కుతున్నారు.
ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు (పాతచిత్రం)
ఆపరేషన్ పరివర్తన్లో భాగంగా ..
నిన్నమొన్నటి వరకూ గిరి యువతను మావోయిస్టులకు దూరం చేయడమే ప్రధానంగా పనిచేసిన పోలీసులు ఇప్పుడు గిరిజనుల జీవితాలను నాశనం చేసే గంజాయికి దూరంగా పెట్టాలని నిర్ణయించారు. ఆపరేషన్ పరివర్తన్ పేరుతో మన్యంవ్యాప్తంగా ఉన్న తోటలను ధ్వంసం చేశారు. సుమారు ఆరువేల ఎకరాల్లో లక్షలాది గంజాయి మొక్కలను తొలగించారు. రెండో దశలో గిరిజనులను క్షేత్రస్థాయిలో గంజాయి సాగుకు దూరంగా ఉండాలని ఇందుకు బదులు అధిక ఆదాయాన్నిచ్చే పంటలను పండించాలంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా చాటుమాటుగా కొన్నిచోట్ల గిరిజనులు వ్యాపారులు ఇచ్చే డబ్బులకు ఆశపడి గంజాయిని పండిస్తున్నారన్న తెలుసుకున్న పోలీసులు దూకుడు పెంచారు. అయితే ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో అక్కడికి చొచ్చుకుపోవడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది.
దశల వారీగా..
ఆపరేషన్ పరివర్తన్లో భాగంగా తొలుత గంజాయి తోటలను ధ్వంసం చేశాం. మార్పుకోసం గ్రామాల్లో యువతకు అవగాహన కల్పిస్తున్నాం. వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాం, అవసరమైన శిక్షణ అందిస్తున్నాం. అధిక ఆదాయాన్నిచ్చే పంటలను పండించుకోవాలని సూచిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా వారికి రాయితీపై రాజ్మా, జాప్రా, మినుములు వంటి విత్తనాలు అందిస్తున్నాం. మూడో అస్త్రంగా కేసులు, అరెస్టులు, భూముల జప్తు వంటి కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాం.
గంజాయితో దొరికిన నిందితులు, వారినుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఇతర సామగ్రి
ప్రతాప్ శివకిశోర్, ఏఎస్పీ, చింతపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు.. దోచేశారు చూడు!
[ 18-04-2024]
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. -
రేషన్లో కోత.. ధరల వాత
[ 18-04-2024]
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. -
నామినేషన్ల పర్వం నేటి నుంచి
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. -
వైభవంగా సీతారామ కల్యాణం
[ 18-04-2024]
శ్రీరామనవమి సందర్భంగా బుధవారం అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కల్యాణంతో శ్రీరామ గిరులు తరించాయి. -
వైకాపా రెబల్గా వంతల రామన్న
[ 18-04-2024]
అరకులోయలో అసెంబ్లీ వైకాపా తిరుగుబాటు అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు వైకాపా నాయకుడు వంతల రామన్న తెలిపారు. అరకులోయలో బుధవారం తన మద్దతుదారులు, వైకాపా నాయకులతో సమావేశం నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 18-04-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
[ 18-04-2024]
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. -
జానకి రాముల కల్యాణం.. జగమంతా సంబరం
[ 18-04-2024]
మాడుగుల గవర వీధిలో కొలువైన వైభోగ సీతారాముల కల్యాణోత్సవం బుధవారం రాత్రి ఆలయం ప్రాంగణంలో కనులపండువగా జరిగింది. -
కూటమికి మద్దతుగా వేల కి.మీ. బైకుపై ప్రచారం
[ 18-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి విజయాన్ని కాంక్షిస్తూ పల్నాడు జిల్లాకు చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని ప్రత్తిపాటి నాగ బాలాజీ బైక్పై రాష్ట్రమంతా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. -
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ
[ 18-04-2024]
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. -
మద్యంతో పోలీసులకు చిక్కిన సూపర్వైజర్
[ 18-04-2024]
మద్యం దుకాణాల్లో పని చేస్తున్న వైకాపా మద్దతుదారుడే నాయకులకు, కార్యకర్తలకు మద్యం సీసాలు అందిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. -
ఎండలతో పర్యటక ప్రాంతాలు వెలవెల
[ 18-04-2024]
పర్యటక ప్రాంతం మారేడుమిల్లిలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. వారం రోజులుగా సుమారు 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవడం గమనార్హం. -
బైకు అదుపుతప్పి ఆర్మీ ఉద్యోగి దుర్మరణం
[ 18-04-2024]
బైకు అదుపుతప్పి కల్వర్టు వద్ద కాలువలో పడిన ఘటనలో ఆర్మీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. చీడికాడ మండలం పెదగోగాడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. -
అసౌకర్యాల అరకులోయ
[ 18-04-2024]
ఆంధ్రాఊటీ అరకులోయ పరిస్థితి.. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న మాదిరిగా ఉంది. ఈ పట్టణంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో సుమారు 10 వేల మంది జనాభా ఉన్నారు. -
నీటి పథకం మోటారుకు మరమ్మతులు
[ 18-04-2024]
మారేడుమిల్లిలోని పంపు హౌస్లో మోటార్కు మరమ్మతులు చేపట్టి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. సత్యసాయి రక్షిత తాగునీటి పథకం ద్వారా నిర్మించిన మినీ ట్యాంక్లకు నీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు ఎదురయ్యాయి. -
ఆదివాసీ హక్కులను రక్షించే వారినే బలపర్చండి
[ 18-04-2024]
మండలంలోని గసభ పంచాయతీ మొర్రిగుడలో ఇండియా కూటమిని గెలిపించాలని సీపీఎం నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. -
బెల్లం పులుపు ధ్వంసం
[ 18-04-2024]
పెదబొడ్డేపల్లి సమీపంలోని తోటల్లో నిల్వ ఉంచిన బెల్లం పులపును నర్సీపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది ధ్వంసం చేశారు. -
‘రాజీనామా చేయాలని వాలంటీర్లపై ఒత్తిడి’
[ 18-04-2024]
మండలంలో పనిచేస్తున్న వాలంటీర్లు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొస్తున్నారని సీపీఎం మండల కార్యదర్శి నాగులు బుధవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..