1.69 లక్షల మందికి రూ.126 కోట్ల లబ్ధి
రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం ద్వారా జిల్లాలోని 1.69 లక్షల మంది రైతులకు రూ.126.94 కోట్ల లబ్ధి చేకూరిందని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు.
‘రైతు భరోసా- పీఎం కిసాన్’ సాయం అందజేత
గురువారం పాడేరు కాఫీ హౌస్లో రైతులకు నమూనా చెక్కు అందజేస్తున్న కలెక్టర్ సుమిత్కుమార్, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ తదితరులు
పాడేరు పట్టణం, న్యూస్టుడే: రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం ద్వారా జిల్లాలోని 1.69 లక్షల మంది రైతులకు రూ.126.94 కోట్ల లబ్ధి చేకూరిందని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. పత్తికొండ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారాన్ని గురువారం స్థానిక కాఫీ హౌస్లో ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ, అధికారులు, రైతులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో 4,500 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీకి సిద్ధం చేశామని పేర్కొన్నారు. 15 వేల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరిస్తున్నామని చెప్పారు. 10 వేల ఎకరాల్లో ఉద్యాన తోటల పెంపకానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వ్యవసాయ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించినప్పుడు పి.ఎం.కిసాన్ సాయం అందడం లేదని పలువురు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. రైతులు ఈ-కేవైసీ చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం రైతులను రాజులను చేస్తోందన్నారు. గిరిజన రైతులకు సకాలంలో విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు. అనంతరం రైతులకు నమూనా చెక్కు పంపిణీ చేశారు. జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్.నంద్, పాడేరు ఎంపీపీ రత్నకుమారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సూరిబాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యురాలు సరస్వతి, పలువురు జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...