సహకారం.. సరికొత్తగా..
సహకార శాఖను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా సహకార సంఘాల పనితీరు ఒకేలా ఉండాలనే ఉద్దేశంతో కొత్త సంస్కరణలను అమలులోకి తెస్తోంది.
సంఘాలకు కంప్యూటర్లు.. సిబ్బందికి బదిలీలు
ఈనాడు డిజిటల్, పాడేరు, అనకాపల్లి
దేవరాపల్లి సహకార సంఘంలో సిబ్బంది
సహకార శాఖను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా సహకార సంఘాల పనితీరు ఒకేలా ఉండాలనే ఉద్దేశంతో కొత్త సంస్కరణలను అమలులోకి తెస్తోంది. అందులో భాగంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలన్నింటినీ (పీఏసీఎస్) డిజిటలైజేషన్ చేయడం, ఉద్యోగులకు జీతాలు పెంచి బదిలీలు చేయడం.. సంఘాల లావాదేవీలపై అదనపు ఆడిట్లు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఈనెలాఖరు లోగా అన్నీ పూర్తిచేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అయితే తమ సమస్యలను పరిష్కరించాకే బదిలీల ఆలోచన చేయాలని సహకార ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 98 ప్రాథమిక సహకార సంఘాలున్నాయి. వీటిలో సుమారు 300 మంది వరకు పనిచేస్తున్నారు. వీరంతా అరకొర జీతాలతో ఏళ్లతరబడి ఒకేచోట విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది వీరికి హెచ్ఆర్ పాలసీ అమలుచేసి జీతాలు పెంచడంతో పాటు తొలిసారి బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం జీవో నంబర్ 36ను తీసుకొచ్చింది. ఉద్యోగుల జీతభత్యాలు, బదిలీల వ్యవహారంపై జిల్లాస్థాయిలో ఎంపర్మెంట్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. డీసీసీబీ ఛైర్మన్తో పాటు సీఈవో, డీసీవో, త్రీమెన్ కమిటీగా ఉద్యోగ సంఘాలతో సమావేశమై చర్చించి ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలి. జిల్లాలో ఇప్పటివరకు ఆ దిశగా కమిటీ చర్యలు తీసుకోలేదని సహకార ఉద్యోగులు చెబుతున్నారు. పాత జీవో నం.151 ప్రకారం 2014 నుంచి కొత్త జీతాలు అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. జీతభత్యాలు, పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులకు స్పష్టమైన హామీలు వచ్చిన తర్వాతే బదిలీలు చేపట్టాలని కోరుతున్నారు.
పైరవీలు మొదలు..: సహకార సంఘాల సిబ్బందిని ఈ నెలాఖరులోగా బదిలీ చేయాలని నిర్ణయించడంతో అప్పుడే కొంతమంది పైరవీలు మొదలుపెట్టారు. ‘ఫలానా సంఘంలో సీఈవోని కదపొద్దు.. బదిలీ తప్పదంటే దగ్గరలో ఉన్న సంఘానికే వేయండి. లేకుంటే సమస్యలొస్తాయి. ఎవరిని కదిపినా ముందు మాకు సమాచారం ఇవ్వండి. లేకుంటే మీకు మంచిది కాదు’ అంటూ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సంబంధిత అధికారులకు నేరుగా ఫోన్చేసి చెప్పడం గమనార్హం. పీఏసీఎస్లో సీఈవోతో పాటు మరో ఇద్దరు సిబ్బంది పనిచేస్తుంటారు. ఏళ్లకు ఏళ్లు ఒకేచోట పాతుకుపోయి పనిచేయడంతో వీరు స్థానిక నాయకులతో సత్సంబంధాలు నెరపడం, వారికి కావాల్సిన వారికే రుణాల్విడం, రికవరీల్లో చేతివాటం వంటి ఆరోపణలు వీరిపై ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే వేరే సంఘానికి బదిలీపై వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
దస్త్రాల డిజిటలైజేషన్
ప్రాథమిక సహకార సంఘాలు ఇప్పటివరకు మాన్యువల్గానే దస్త్రాలను నిర్వహిస్తున్నారు. రైతులు రుణాలు మంజురు నుంచి రికవరీలు వరకు అన్నీ సర్దుబాట్లుతోనే సరిపెట్టేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది సిబ్బంది అక్రమాలకు పాల్పడడం జరుగుతోంది. ఈ తరహా అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు ఇకపై సహకార సంఘాల లావాదేవీలన్నీ డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కో పీఏసీఎస్కు కంప్యూటర్, ప్రింటర్, డాంగిల్ వంటి ఎనిమిది రకాల పరికరాలను అందిస్తున్నారు. కలెక్టర్ ఛైర్మన్గా, సీఈవో కన్వీనర్, డీసీవో, నాబార్డు డీడీఎం, ఆప్కాబ్, సంఘాల నుంచి ముగ్గురిని సభ్యులుగా జిల్లాస్థాయి పర్యవేక్షణ అమలు కమిటీగా నియమించి పరికరాలను సహకార సంఘాలకు ఇవ్వనున్నారు. రైతు పీఏసీఎస్కు వచ్చి రుణ వాయిదా చెల్లిస్తే నేరుగా రాష్ట్రస్థాయిలో అధికారులు కూడా తెలుసుకునేలా దస్త్రాలన్నింటినీ కంప్యూటరీకరణ చేయబోతున్నారు. ఇవన్నీ జూన్ 30లోగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు డీసీసీబీ సీఈవో డీవీఎస్ వర్మ తెలిపారు.
98 పీఏసీఎస్ల్లో 36 సంఘాలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఈ లాభాల్లో నడిచే సంఘాల సిబ్బందిని నష్టాల్లో ఉన్న పీఏసీఎస్లకు బదిలీ చేస్తే వారి జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలకు గ్యారంటీ ఉండదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ