ఇంతకీ ఎన్ని అడుగులు..?
జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో రోడ్డు విస్తరణకు సంబంధించి అధికారుల్లో సమన్వయ లోపం కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తోంది. గత వారం రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్థానిక వ్యాపారులను కలవరానికి గురి చేస్తున్నాయి.
జిల్లా కేంద్రం రోడ్డు విస్తరణలో గందరగోళం
ఆక్రమణల తొలగింపులో సమన్వయ లోపం
పాడేరు/పట్టణం, న్యూస్టుడే : జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో రోడ్డు విస్తరణకు సంబంధించి అధికారుల్లో సమన్వయ లోపం కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తోంది. గత వారం రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్థానిక వ్యాపారులను కలవరానికి గురి చేస్తున్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా రెవెన్యూ, ఆర్అండ్బీ, పంచాయతీ అధికారులు సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంది. దీనికి భిన్నంగా స్థానిక పంచాయతీ సర్పంచికి కనీస సమాచారం ఇవ్వకుండానే విస్తరణ పనులు చేపడుతుండడం వివాదాస్పదమైంది. దీనిపై ఆగ్రహించిన సర్పంచి ఉషారాణి జరుగుతున్న తాజా పరిణామాలపై కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద కూల్చేసిన దుకాణాలు
తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానిక గిరిజన సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేసేవారు. పట్టణ ప్రధాన రహదారులు విస్తరించి ప్రమాదాలు చోటుచేసుకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నో పర్యాయాలు రెవెన్యూ, ఇతర ఉన్నతాధికారులను వినతి పత్రాలు అందజేశారు. ఇదే కాకుండా జిల్లా కేంద్రంగా అవతరించడంతో జనసాంద్రత, వాహన రద్దీ పెరిగాయి. దీంతో రోడ్డు విస్తరణ అనివార్యమైన పరిస్థితి. అయినా ఆక్రమణల పేరిట దుకాణాలు తొలగించే ప్రక్రియలో అధికారులు తీసుకున్న చర్యలు పలు విమర్శలకు తావిస్తున్నాయి. పోలీసు బలగాలతో కనీస సమాచారం, సమయం ఇవ్వకుండా ఆక్రమణలు తొలగించడం ఏమిటని దుకాణదారులు అధికారులను నిలదీస్తున్నారు.
దుకాణం ముందు భాగం పోవడంతో వ్యాపారి దిగాలు
రోడ్డుకు ఇరువైపులా ఎంత మేరకు ఆక్రమణలు తొలగిస్తారనే దానిపై అధికారులకే స్పష్టత లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. రోడ్డు సెంటర్ పాయింట్ నుంచి ఇరువైపులా 35 అడుగుల చొప్పున విస్తరిస్తారని కొంత మంది ఉద్యోగులు చెబుతున్నారు. అలా కాకుండా రెవెన్యూ, ఆర్అండ్బీ అధీనంలో ఉన్న ప్రాంతం వరకు తొలగిస్తారని మరో విభాగపు సిబ్బంది వచ్చి సూచిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు రెండు వైపులా కలిసి 80 నుంచి 90, 100 అడుగుల వరకు తొలగిస్తారని స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలా కాకుండా రెవెన్యూ, ఆర్అండ్బీ, అధికారులు సమన్వయంతో పక్కాగా ఇన్ని అడుగులు తొలగిస్తామని స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారుల దుందుడుకు చర్యల కారణంగా రోడ్డున పడ్డామని సుమారు 150 మంది చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి వీరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీపీఐ, ఇతర ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.
ఆ ప్రాజెక్టు పట్టాలెక్కేనా?
పాడేరు అంబేడ్కర్ కూడలి నుంచి అరకులోయ రోడ్డులో ఉన్న తలారిసింగి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. విశాఖపట్నం రోడ్లో ఎంపీడీవో కార్యాలయం వరకు జి.మాడుగుల వెళ్లే రహదారి పి.గొందూరు వరకు విస్తరించాల్సి ఉంది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ విస్తరణకు సంబంధించి రూ.48 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టు సైతం మంజూరైంది. ఆ తర్వాత వైకాపా అధికారంలోకి రావడంతో అప్పటి వరకు ప్రారంభం కాని పనులన్నీ రద్దు చేసింది.
దుకాణాల తొలగింపు అనంతరం ఇలా..
ఇప్పుడే చెప్పలేం
ఎన్ని అడుగులకు విస్తరిస్తారని ఆర్అండ్బీ ఈఈ బాలసుందరాన్ని ‘న్యూస్టుడే’ వివరణ కోరగా ప్రస్తుత పరిస్థితుల్లో తాము స్పష్టత ఇవ్వలేమన్నారు. కలెక్టర్ ఆదేశానుసారం ముందుకెళ్తామని చెబుతున్నారు. మండల తహసీల్దార్ త్రినాథనాయుడు స్పందిస్తూ రోడ్డు విస్తరణకు అవసరమైన మేరకు తొలగిస్తామని, దీనిపై త్వరలో స్పష్టత వస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
రెండో రోజు నామినేషన్ల సందడి
[ 20-04-2024]
నామినేషన్ల స్వీకరణ రెండో రోజు అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ తెలిపారు. -
అనంత బాబు అరాచకాలకు ముగింపు పలుకుదాం
[ 20-04-2024]
ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకాలతో మన్యం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వైకాపాను ఓడించి ఆయన ఆట కట్టించడమే తమ లక్ష్యమని రంపచోడవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి స్పష్టంచేశారు. -
కన్నాయిగూడెం ఎంపీటీసీ సభ్యుడి హత్య
[ 20-04-2024]
కన్నాయిగూడెం మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఇందుకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం వివరాలు వెల్లడించారు. -
సిద్ధం..ప్రయాణానికి యుద్ధం
[ 20-04-2024]
‘ఎక్కడైనా సీఎం వస్తున్నాడంటే వరాలు జల్లులు కురిపిస్తారని ఆనందపడతారు. జగన్ వస్తే మాత్రం అమ్మో అంటున్నారు. ఈ సీఎం వస్తే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే.. కరెంటు తీగలు తొలగించాల్సిందే. -
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 20-04-2024]
కశింకోట మండలం తాళ్లపాలెం డా.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
చంద్రబాబు ఆశీస్సులున్నాయి: ఈశ్వరి
[ 20-04-2024]
తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శుక్రవారం కొయ్యూరు మండలంలో పర్యటించారు. తన అనుచరులను కలిసి నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. -
ఎండ తీవ్రతతో ద్విచక్రవాహనం దగ్ధం
[ 20-04-2024]
అధిక ఉష్ణోగ్రతతో ఓ ద్విచక్రవాహనం దగ్ధమైన ఘటన శుక్రవారం పాడేరు పట్టణంలో చోటుచేసుకుంది. పాడేరు ప్రధాన రహదారి సినిమాహాల్ కూడలి వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. -
ఏజెన్సీలో వేసవి తాపం
[ 20-04-2024]
మైదాన ప్రాంతాలకు దీటుగా ఈ సారి ఏజెన్సీ ప్రాంతంలోనూ వేసవి తాపం గట్టిగానే చూపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా ఏజెన్సీలో ప్రధాన కేంద్రాలైన పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
సైకో పాలనతో ప్రజలకు తీవ్రనష్టం
[ 20-04-2024]
అరకులోయ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్లు దాఖలు చేసే ముందు ఆయన స్వగ్రామం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ లకేయిపుట్టులో గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నిర్వాసితులను ముంచిన జగన్
[ 20-04-2024]
జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జిల్లాలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడేరు పట్టణంలో పర్యటించి అనేక హామీలు గుప్పించారు. -
పోక్సో కేసులో ప్రిన్సిపల్కు ఐదేళ్ల జైలు
[ 20-04-2024]
ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రిన్సిపల్ నాగసాయి నరసింహమూర్తికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది.