ధరాఘాతం.. ఎగుమతులపై ప్రభావం!
నర్సీపట్నం నుంచి ఈ ఏడాది పసుపు ఎగుమతులు మందగించాయి. ఇక్కడి నుంచి ఏటా రూ. కోట్ల విలువైన పసుపు వివిధ రాష్టాలకు ఎగుమతి అవుతుంటుంది.
విశాఖ మన్యంలో పండే ఛాయ పసుపు
నర్సీపట్నం నుంచి ఈ ఏడాది పసుపు ఎగుమతులు మందగించాయి. ఇక్కడి నుంచి ఏటా రూ. కోట్ల విలువైన పసుపు వివిధ రాష్టాలకు ఎగుమతి అవుతుంటుంది. మంచి ఛాయ కలిగినది కావడంతో మన్యంలో పండించే సరకుకి గిరాకీ ఎక్కువ. ఈ ఏడాది సీజన్ మొదట్లో కేజీకి సుమారు రూ.65 వరకు ధర లభించేది. కొద్దిరోజులుగా రూ.40 నుంచి రూ.50 దాటడంలేదు. మైదాన ప్రాంతాల నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లే చిరు వ్యాపారులు ఇంతకంటే తక్కువగానే చెల్లిస్తున్నట్టు సమాచారం.
న్యూస్టుడే, నర్సీపట్నం అర్బన్, పాడేరు పట్టణం
గతంలో వ్యాపారులు రైతుల వద్దకు వెళ్లి తమకే పసుపు తమకే విక్రయించాలని, తోటి వ్యాపారుల కంటే రూపాయి ఎక్కువే ఇస్తామని చెప్పేవారు. ఈ ఏడాది రైతులు వ్యాపారుల వద్దకు వచ్చి కొనుక్కోమని కోరుతున్న పరిస్థితి ఉంది. దుంప రకం పసుపును తమిళనాడులో ఎక్కువగా వినియోగిస్తుంటారు. కొమ్ము రకాలు కేరళ, మహరాష్ట్ర తదితర రాష్ట్రాలకు సరఫరా అవుతుంది. దుగ్గిరాల ప్రాంతంలోని పసుపుతో పోల్చితే అల్లూరి జిల్లాలో లభ్యమయ్యే పనుపులో కుర్క్మిన్ ఎక్కువగా ఉంటోంది. ఇతర దేశాలకు ఎగుమతులు తగ్గిన ప్రభావం కొనుగోళ్ల పడటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులను ఆదుకోవడానికి మంచి ధర ఇచ్చి జీసీసీ కొనుగోలు చేయాలని వారంతా కోరుతున్నారు. నర్సీపట్నంలో దాదాపు 25 మంది వ్యాపారులు ఉన్నారు. సీజన్లో రోజుకు యాభై టన్నుల వరకు కొనుగోలు చేస్తుంటారు. పసుపు గ్రేడింగ్, ఎగుమతులు, దిగుమతులతో పెదబొడ్డేపల్లిలోని మార్కెట్యార్డు నిత్యం కళకళలాడుతూ ఉంటుంది.
రైతులను ఆదుకోవాలి...
పసుపు రైతులకు ఈ ఏడాది గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది. పెట్టుబడులు, ఆదాయం చూసుకుంటే వారికి నిరాశే మిగులుతోంది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రభుత్వమే కొనుగోలు చేస్తే రైతులకు ఊరట కలుగుతుంది. రైతు బాగుంటేనే కూలీలకు పని ఉంటుంది. వ్యాపారాలు సాగుతాయి. గ్రామాలు తిరిగి రైతుల వద్ద పసుపు కొంటుంటాం. ధరలు పడిపోవడంతో రైతులు కలత చెందుతున్నారు.
చిత్రాడ బోడకొండ, వ్యాపారి, లోతుగెడ్డ, అల్లూరి జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్