ఎనిమిదేళ్ల క్రితం పనులు..ఇప్పుడు తనిఖీలు!
గత ప్రభుత్వం చేపట్టిన పనులపై విజిలెన్స్ తనిఖీలు, నివేదికల పేరుతో పంచాయతీరాజ్ ఇంజినీర్ల మెడపై సర్కారు కత్తి వేలాడదీస్తోంది.
రూ-అర్బన్ పనుల పరిశీలనకు ప్రత్యేక బృందాలు
అరకులోయ ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు
ఈనాడు డిజిటల్, పాడేరు, న్యూస్టుడే అరకులోయ: గత ప్రభుత్వం చేపట్టిన పనులపై విజిలెన్స్ తనిఖీలు, నివేదికల పేరుతో పంచాయతీరాజ్ ఇంజినీర్ల మెడపై సర్కారు కత్తి వేలాడదీస్తోంది. సిమెంట్ రోడ్ల నిర్మాణం, ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి ఇంజినీర్లపై చర్యలకు ఉపక్రమిస్తోంది. తాజాగా నేషనల్ రూరల్ అర్బన్ మిషన్ (రూ-అర్బన్) నిధులతో గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులపై తనిఖీలకు ఆదేశించింది. అరకులోయలో రూ-అర్బన్ పథకంలో చేసిన వివిధ పనులకు సంబంధించి దస్త్రాలను శుక్రవారం నుంచి తనిఖీలు చేస్తున్నారు. జిల్లా పరిషత్తు డిప్యూటీ సీఈవో సత్యనారాయణ ఆధ్వర్యంలోని ఓ బృందం పనుల వివరాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం నాటి పనులపై ఇప్పుడు పరిశీలించడంపై ఇంజినీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తెదేపా హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకులోయలోని పెదలబుడు పంచాయతీని దత్తత తీసుకున్నారు. ఆ పంచాయతీ పరిధిలో 11 శివారు గ్రామాలున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతం కావడంతో రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా ఈ పంచాయతీని తీర్చిదిద్దాలనుకున్నారు. అందులో భాగంగా రూ-అర్బన్ మిషన్లో పనులు చేపట్టారు. సుమారు రూ.52 కోట్ల అంచనాతో 287 పనులు చేశారు. ఇందులో రూ.15 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులు (సీజీఎఫ్) కాగా, రూ.18.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసింది. మరో రూ.18.87 కోట్ల ఉపాధిహామీ నిధులను ఉపయోగించారు. పెదలబుడు పంచాయతీ గంజాయిగుడ వద్ద గిరి గ్రామదర్శినికి రూ.15 లక్షలు వెచ్చించారు.. పద్మాపురం పంచాయతీ రణజిల్లెడ జలపాతానికి వెళ్లే మార్గంలో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. అరకులోయ పట్టణంలో రూ.కోటితో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టారు. వీటితో పాటు సుమారు రూ.8 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించారు.. ముందుగా ఈ పనుల వివరాలన్నింటిని మండల పరిషత్తు నుంచి తెప్పించుకుని పరిశీలిస్తున్నారు..ఏ పనికి ఎంత నిధులు వెచ్చించారు.. ఎంత మేర చెల్లింపులు జరిగాయి.. ఎవరి పేరున ఎం.బుక్ నమోదు చేశారు.. అప్పట్లో నాణ్యత తనిఖీలు ఏమైనా చేశారా.. వాటిలో ఎక్కడైనా లోపాలు గుర్తించారా.. పనుల నిర్వహణకు సంబంధించి దస్త్రాలన్నింటిని తమ ముందు పెట్టుకుని జల్లెడ పడుతున్నారు. జడ్పీ నుంచి లీగల్ విభాగం సిబ్బంది ఈ తనిఖీలో పాల్గొంటున్నారు. ఇవి పూర్తయిన తర్వాత దస్త్రాల్లో ఉన్న పనులు క్షేత్రస్థాయిలో ఉన్నాయా లేవా.. వాటి నాణ్యత ఇప్పుడు ఎలా ఉంది.. జరిగిన పని కంటే ఎక్కువ మొత్తంలో ఏమైనా చెల్లింపులు జరిగాయా.. పనుల్లేకుండా బిల్లులేమైనా చేసుకున్నారా అనే అంశాలను లోతుగా పరిశీలించడానికి ప్రత్యేక సాంకేతిక బృందాలను పంపించబోతున్నారు. నెల రోజులకు పైగా ఈ తనిఖీలు జరగనున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు