logo

ఘాట్‌రోడ్డులో బస్సు, లారీ ఢీ

రంపుల ఘాట్‌రోడ్డు మలుపులో సోమవారం చింతపల్లి నుంచి రంపుల మీదుగా నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్‌లారీ ఢీకొంది.

Published : 06 Jun 2023 05:46 IST

రంపుల మలుపులో ఢీకొన్న వాహనాలు

కొయ్యూరు, న్యూస్‌టుడే: రంపుల ఘాట్‌రోడ్డు మలుపులో సోమవారం చింతపల్లి నుంచి రంపుల మీదుగా నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్‌లారీ ఢీకొంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. దీనిపై కొద్దిసేపు ఇరువురు డ్రైవర్లు గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో అటూఇటూ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. కొయ్యూరు పోలీసులు ట్రాఫిక్‌ని నియంత్రించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: పాడేరు మండలం మోదకొండమ్మ అమ్మవారి పాదాలు సమీపంలోని మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి ఒక వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. పాడేరుకు చెందిన నాగలక్ష్మణ్‌ సోమవారం మైదాన ప్రాంతం నుంచి ద్విచక్రవాహనంపై పాడేరు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రుడిని అంబులెన్సులో పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సిబ్బంది రామ్‌చందరరావు, తిరుపతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని