ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు కృషి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ పిలుపునిచ్చారు.
మొక్కలు నాటుతున్న ఎంపీ మాధవి, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీఓ అభిషేక్, అటవీ శాఖాధికారి వినోద్బాబు,
రాష్ట్ర ట్రైకార్ ఛైర్మన్ బుల్లిబాబు తదితరులు
పాడేరు పట్టణం, న్యూస్టుడే: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక మోదకొండమ్మ పాదాలు, కిండంగి మామిడి తోటల పరిసరాల్లో ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో వి.అభిషేక్, అటవీ, పంచాయతీ, రెవెన్యూ, ఐటీడీఏ, గిరిజన సంక్షేమ, సచివాలయ శాఖల అధికారులు, సిబ్బందితో కలసి చెత్త, వ్యర్థాలు తొలగించారు. ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు మన్యంలోనూ ప్లాస్టిక్ వినియోగం పెరిగిందని, పర్యాటకులకు కూడా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, తడి, పొడి చెత్తలను వేరుచేసి తద్వారా సంపద సృష్టించాలని సూచించారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం చెత్త బుట్టలు పంపిణీ చేశారు. జిల్లా అటవీశాఖ అధికారి వినోద్బాబు, జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు, డివిజనల్ పంచాయతీ అధికారి వి.ఎస్.కుమార్, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు కొండలరావు, తహసీల్దారు త్రినాథరావునాయుడు, ఎంపీపీ రత్నకుమారి, మాజీ ఎంపీపీ ఎస్.వి.రమణ పాల్గొన్నారు.
* అనంతరం కుమ్మరిపుట్టు గురుకుల సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఆవరణలో కలెక్టర్ సుమిత్కుమార్, ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీఓ అభిషేక్, అటవీ శాఖాధికారి వినోద్బాబు, ట్రైకార్ ఛైర్మన్ బుల్లిబాబుతో కలిసి మొక్కలు నాటారు. ముఖ్యఅతిథులు మాట్లాడుతూ అవకాశం ఉన్న ప్రతిచోటా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
సున్నిత ప్రాంతాల్లో ఎన్నికలెలా?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అత్యంత సున్నిత, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ప్రాథమికంగా గుర్తించారు. -
దాహార్తి తీర్చండి...
[ 29-03-2024]
తాగునీటి కొరత, విద్యుత్తు లోవోల్టేజితో ఇబ్బంది పడుతున్నామని మండలంలోని జడ్డంగి పంచాయతీ చైతన్యనగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. -
పోలవరం ముంపు గ్రామాలకు నిర్వాసితులు
[ 29-03-2024]
పునరావాస కాలనీల నుంచి పోలవరం ముంపు గ్రామాలకు గిరిజన నిర్వాసితులు ఒక్కొక్కరిగా వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు నేపథ్యంలో దేవీపట్నం మండలంలోని గిరిజన నిర్వాసితులకు పోతవరం నుంచి ఫజుల్లాబాద్ వరకూ ప్రభుత్వం పునరావాస కాలనీలు ఏర్పాటు చేసింది. -
నాలుగేళ్లు నిద్ర.. పది రోజుల్లో పరుగులు
[ 29-03-2024]
మన్యంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం హడావుడిగా నిర్మాణాలు ప్రారంభించి పది రోజుల్లో పూర్తిచేస్తున్న వైనం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. -
వైకాపాను చిత్తుగా ఓడించాలి: శిరీషాదేవి
[ 29-03-2024]
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు వైకాపాను ఓడించాలని రంపచోడవరం తెదేపా అభ్యర్థినిగా ప్రకటించిన మిరియాల శిరీషాదేవి పిలుపునిచ్చారు. -
చంద్రబాబుపై పూర్తి విశ్వాసం: దొన్నుదొర
[ 29-03-2024]
తెదేపా- భాజపా- జనసేన కూటమి అభ్యర్థిగా అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో తాను పోటీచేసి విజయం సాధిస్తానని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి సియ్యారి దొన్నుదొర అన్నారు -
అవకాశం వచ్చింది.. త్వరపడితే మంచిది
[ 29-03-2024]
బాలికల విద్యకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచే కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. -
భవిత బాగుకు కూటమి గెలవాలి
[ 29-03-2024]
పట్టణంలోని రింగు రోడ్డు, ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో గురువారం కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ప్రచారం నిర్వహించారు. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్