డిపోలకు తాళాలు నదుల్లో తవ్వకాలు!
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలకు అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచడం కోసం ఏర్పాటు చేసిన డిపోలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి.
రెచ్చిపోతున్న ఇసుక అక్రమార్కులు
అధికారం అండగా జలవనరులకు తూట్లు
ఈనాడు డిజిటల్ అనకాపల్లి, నక్కపల్లి, న్యూస్టుడే
శారదా నదిలో పొక్లెయిన్తో ఇసుక తవ్వకాలు (పాత చిత్రం)
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలకు అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచడం కోసం ఏర్పాటు చేసిన డిపోలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. మొదట్లో అయిదుచోట్ల ఇసుక డిపోలు తెరిచారు. వాటిలో అనకాపల్లి, చోడవరం, అచ్యుతాపురం డిపోలు ఇప్పటికే మూతపడ్డాయి. తాజాగా నక్కపల్లి డిపోలో కూడా రెండు వారాలుగా ఇసుక దొరకడం లేదు. నర్సీపట్నం డిపోలో నిల్వలు అడుగంటి పోయాయి. ఇక్కడికి ఏరోజు వచ్చిన ఇసుక ఆరోజే ఖాళీ అయిపోతోంది. డిపోల్లో ఇసుక లభ్యం కాకపోవడంతో స్థానిక నదులు, గెడ్డలపైనే అందరూ వాలిపోతున్నారు. ప్రభుత్వ నిర్మాణాల పేరిట గుల్ల చేసేస్తున్నారు. రాత్రి పగలు తేడాలేకుండా పొక్లెయిన్లు పెట్టి మరీ ఇసుక తవ్వి తరలించుకుపోతున్నారు. వాటిని ఎక్కడైనా అడ్డుకుంటే అధికార పార్టీ నేతలతో ఫోన్లు చేయించి పట్టుకుపోతున్నారు. శారదా, పెద్దేరు, వరహా నదులకు గుండె కోత మిగుల్చుతున్నారు. మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఇటీవలే శారదా నదిలో ఇసుక తవ్వకాల గురించి ‘మా ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక అందించాం.. మరి మీరు అందినకాడికి అమ్మేసుకుంటున్నారంటూ’ సెల్ఫీదిగి ఆరోపించారు. ‘ప్రభుత్వ నిర్మాణాలు, జగనన్న కాలనీల కోసం నదులు, గెడ్డల నుంచి తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను స్థానిక అధికారులు అడ్డుకోవద్దని చెప్పండి. వారి దగ్గర కూపన్ ఉందా లేదా పరిశీలించి రవాణాకు అనుమతించండి. వారు చెప్పిన చోటకు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తే వారిపై చర్యలు తీసుకోండి.’ అంటూ ఇటీవల జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సంయుక్త కలెక్టరుకు చేసిన ఆదేశాలిచ్చారు. అంతే కానీ జిల్లాలో గాడి తప్పిన ఇసుక డిపోల నిర్వహణ గురించి ఊసెత్తలేదు.
అచ్యుతాపురం వద్ద మూతపడిన ఇసుక డిపో
వాటాలు.. కోటాలు..
మాడుగుల నియోజకవర్గంలోని శారదా, పెద్దేరు, బొడ్డేరు నదుల పొడవునా ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పేరుకే ప్రభుత్వ నిర్మాణాలు.. తవ్విన ఇసుకలో మెజార్టీ భాగం విజయనగరం, విశాఖ జిల్లాలకు తరలించేస్తున్నారు. అధికార పార్టీ సర్పంచులు, చోట నాయకులే దందా నడిపిస్తున్నారు. ఒకటి రెండు చోట్ల ఏకంగా గ్రామవసరాల పేరుతో వేలం పాటలు వేసి మరీ ఇసుక వ్యాపారం నిర్వహించారు. తర్వాత పంపకాల్లో తేడాలొచ్చి వేలం పాటలు రద్దుచేసుని గుట్టుగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్ నుంచి సుమారు రూ. వెయ్యి పోలీసులు, రెవెన్యూ వారికి ముట్టచెప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇసుక మేట్ల పేరిట వ్యాపారం..: గతంలో శారదా నది ఒడ్డున కొంతమంది దళితులకు సాగు కోసం భూములిచ్చారు. కాలక్రమంలో వరదల కారణంగా ఆ భూముల్లో ఇసుక మేటలు వేశాయి. ఇప్పుడు ఆ భూముల్లో ఇసుక వ్యాపారానికి అధికార పార్టీ నేతలు తెరలేపారు. రైతుకు ఎకరాకు ఇంతని చేతిలో పెట్టి పొక్లెయిన్లు పెట్టి తవ్వేసి అమ్మేసుకుంటున్నారు. కలిగొట్ల వద్ద వంతెనకు సమీపంలోనే తవ్వకాలు చేపడుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. బోయిల కింతాడ, తమర్బ, తెనుగుపూడిలో ఎక్కువగా తవ్వకాలు జరుగుతున్నాయి. వీటిలో కొంతే ప్రభుత్వ నిర్మాణాలకు వెళ్తోంది.మిగతా అంతా దళారులకు అప్పగించేస్తున్నారు. ఈ వ్యాపారంలో ఉన్నదంతా అధికార పార్టీ వారే కావడంతో తవ్వకాలు అడ్డుకోవడానికి ఎవరూ సాహసించడం లేదు.
ఇసుక లేక నక్కపల్లి డిపో వద్ద అడ్డంగా పెట్టిన యంత్రం
కూపన్లున్నా ఫలితం సున్నా
నక్కపల్లి డిపోలో ఇసుక నిండుకుని నెల రోజులు కావస్తోంది. నిర్మాణ భవనాల యజమానులు నిల్వల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. గోదావరి రేవుల నుంచి ఇక్కడకు ఇసుకను భారీ లారీల్లో తెచ్చి నిల్వ చేసేవారు. ప్రస్తుతం వేసవి కావడంతో ఉన్నంతలో కాస్త నిర్మాణాలు జోరుగా చేపడుతున్నారు. ఇందులో జగనన్న కాలనీతోపాటు, సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకుంటున్నవారు ఉన్నారు. మూడు వారాల కిందట ఇక్కడ సరకు అయిపోవడంతో రాజమహేంద్రవరం నుంచి వస్తుందని వారాల తరబడి నిర్వాహకులు, కొనుగోలుదారులు ఎదురు చూస్తున్నారు. నక్కపల్లి, ఎస్.రాయవరం, పాయకరావుపేట, కోటవురట్ల, ఎలమంచిలి మండలాలకు చెందిన వారు ఇక్కడి నుంచి తీసుకువెళ్తుంటారు. చాలామందికి కూపన్లు జారీ చేసినా, ఇసుక లేకపోవడంతో కూపన్లు రద్దయిపోతున్నాయి. దీంతో ఇంజినీరింగ్ అధికారులు వీటి జారీని ఆపేశారు. ఇసుక వచ్చిన తర్వాతే ఇస్తామని అంటున్నారు.
డిపోల నిర్వహణపై సమీక్షిస్తా..
- జాహ్నవి, సంయుక్త కలెక్టర్, అనకాపల్లి
ఇసుక డిపోలు ఎందుకు మూతపడ్డాయో ముందుగా సమీక్షించి వాటి నిర్వహణపై ఆలోచన చేస్తాం. ప్రభుత్వ నిర్మాణాలు, కాలనీలకు కాకుండా వ్యాపార అవసరాల కోసం నది ఇసుకను తరలిస్తే వారిపై చర్యలుంటాయి. జిల్లా పరిషత్తు సమావేశంలో మంత్రి కూడా అదే చెప్పారు. ఇసుక డిమాండ్, లభ్యతపై సంబంధిత అధికారులతో చర్చించి అక్రమ తవ్వకాలను నిరోధానికి చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM