ఆయుర్వేదం..ఆరోగ్యప్రదం
ఆయుర్వేద చిట్కాలతో ఎండ నుంచి ఉపశమనం పొందొచ్చని హైదరాబాద్లోని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల సహాయ ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా శ్రీనివాస్ చెబుతున్నారు.
ఆయుర్వేద చిట్కాలతో ఎండ నుంచి ఉపశమనం పొందొచ్చని హైదరాబాద్లోని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల సహాయ ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా శ్రీనివాస్ చెబుతున్నారు.
* వేసవి కారణంగా అవసరమైన పోషకాలు శరీరం నుంచి బయటకు పోతుంటాయి. దీంతో నీరసం ఆవహిస్తోంది. నివారణకు మజ్జిగలో ఉప్పు కలిపి పుదీనా, కొత్తిమీర ఆకులను వేసుకొని తాగితే కోల్పోయిన పోషకాలు తిరిగి భర్తీ అవుతాయి. వడదెబ్బ బారిన పడకుండా చూసుకోవచ్చు. ఈ కాలంలో జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతుంటాయి. ఎసిడిటీ ఉంటే లవంగ ముక్కని చప్పరించడంతో ఇబ్బంది తగ్గుతుంది.
* చెమట, వేడి వల్ల కొందరిలో చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తుంటాయి. గాలి ఆడని ప్రాంతాల్లో చర్మం నల్లగా మారుతుంది. తురిమిన దోసకాయను మెడ, ముఖం, కళ్లపై రాసుకుంటే చల్లగా ఉండటమే కాకుండా మొటిమలు, నల్లమచ్చలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది.
* అధిక మసాలాలు, మాంసాహారం తీసుకుంటే ఉబ్బరం, కడుపులో మంట, అల్సర్ల లాంటి సమస్యలు వేధిస్తాయి. రోజూ కొన్ని తులసి ఆకులు తీసుకొని నమిలి మింగితే ఈ సమస్య తగ్గుతుంది.
* అధిక వేడి వల్ల చాలామందికి మూత్రం రాదు. ఒకవేళ వచ్చినా.. ముదురు పసుపుపచ్చ రంగులో ఉంటుంది. మంటగా అనిపిస్తుంది. గ్లాసు నీళ్లలో కొంచెం ధనియాల పొడి వేసి కాచిన తర్వాత చల్లార్చి తాగాలి. మంట తగ్గుతుంది.
* సబ్జా గింజలు నీటిలో కలిపి తీసుకుంటే శరీరం ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉంటాయి.
* చందనాది వటి, చందనాసవం, ఉశీరాసవం చూర్ణాల్లో ఏదైనా ఒక దానిని గ్లాసు నీళ్లల్లో చెంచా కలుపుకొని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉంటాయి. ఎండదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది. మిశ్రి(కండశ్కర) నీళ్లలో కలిపి తాగినా శరీరానికి చలువ చేస్తుంది. షడంగ పానీయ చూర్ణంతో కషాయం తయారు చేసుకొని తాగడం వల్ల అనారోగ్య ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
రెండో రోజు నామినేషన్ల సందడి
[ 20-04-2024]
నామినేషన్ల స్వీకరణ రెండో రోజు అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ తెలిపారు. -
అనంత బాబు అరాచకాలకు ముగింపు పలుకుదాం
[ 20-04-2024]
ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకాలతో మన్యం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వైకాపాను ఓడించి ఆయన ఆట కట్టించడమే తమ లక్ష్యమని రంపచోడవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి స్పష్టంచేశారు. -
కన్నాయిగూడెం ఎంపీటీసీ సభ్యుడి హత్య
[ 20-04-2024]
కన్నాయిగూడెం మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఇందుకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం వివరాలు వెల్లడించారు. -
సిద్ధం..ప్రయాణానికి యుద్ధం
[ 20-04-2024]
‘ఎక్కడైనా సీఎం వస్తున్నాడంటే వరాలు జల్లులు కురిపిస్తారని ఆనందపడతారు. జగన్ వస్తే మాత్రం అమ్మో అంటున్నారు. ఈ సీఎం వస్తే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే.. కరెంటు తీగలు తొలగించాల్సిందే. -
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 20-04-2024]
కశింకోట మండలం తాళ్లపాలెం డా.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
చంద్రబాబు ఆశీస్సులున్నాయి: ఈశ్వరి
[ 20-04-2024]
తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శుక్రవారం కొయ్యూరు మండలంలో పర్యటించారు. తన అనుచరులను కలిసి నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. -
ఎండ తీవ్రతతో ద్విచక్రవాహనం దగ్ధం
[ 20-04-2024]
అధిక ఉష్ణోగ్రతతో ఓ ద్విచక్రవాహనం దగ్ధమైన ఘటన శుక్రవారం పాడేరు పట్టణంలో చోటుచేసుకుంది. పాడేరు ప్రధాన రహదారి సినిమాహాల్ కూడలి వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. -
ఏజెన్సీలో వేసవి తాపం
[ 20-04-2024]
మైదాన ప్రాంతాలకు దీటుగా ఈ సారి ఏజెన్సీ ప్రాంతంలోనూ వేసవి తాపం గట్టిగానే చూపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా ఏజెన్సీలో ప్రధాన కేంద్రాలైన పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
సైకో పాలనతో ప్రజలకు తీవ్రనష్టం
[ 20-04-2024]
అరకులోయ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్లు దాఖలు చేసే ముందు ఆయన స్వగ్రామం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ లకేయిపుట్టులో గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నిర్వాసితులను ముంచిన జగన్
[ 20-04-2024]
జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జిల్లాలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడేరు పట్టణంలో పర్యటించి అనేక హామీలు గుప్పించారు. -
పోక్సో కేసులో ప్రిన్సిపల్కు ఐదేళ్ల జైలు
[ 20-04-2024]
ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రిన్సిపల్ నాగసాయి నరసింహమూర్తికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది.