భవిత కేంద్రం.. భయం భయం
విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులకు విద్యనందించే నక్కపల్లిలోని భవిత కేంద్రం శిథిలావస్థకు చేరుతోంది. భవనం బయట, లోపల ఎక్కడికక్కడే పెచ్చులూడుతూ, బీటలు వారుతోంది.
నక్కపల్లిలోని భవిత కేంద్రం
నక్కపల్లి, న్యూస్టుడే: విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులకు విద్యనందించే నక్కపల్లిలోని భవిత కేంద్రం శిథిలావస్థకు చేరుతోంది. భవనం బయట, లోపల ఎక్కడికక్కడే పెచ్చులూడుతూ, బీటలు వారుతోంది. ఇక్కడకు వివిధ గ్రామాల నుంచి సుమారు 20 మంది వరకు వస్తున్నారు. వీరికి బ్రెయిలీ లిపి నేర్పించడం, బుద్ధి మాంద్యం ఉన్నవారికి జీవన నైపుణ్యాలు, ఒకేషన్లో శిక్షణ, విద్య తదితర వాటిని నేర్పిస్తారు. ఫిజియో థెరపీ చేస్తుంటారు. భవనంలో రెండు గదులు, వరండా, హాలు ఉంది. వీటిని ఇక్కడకు వచ్చే చిన్నారులకు ఉపయోగించడంతోపాటు, అవసరమైన సామగ్రి పరికరాలు భద్రపరుస్తారు. కాగా ఈ భవనం క్రమేపీ దెబ్బతింటోంది. కేంద్రంలోకి వెళ్లే మెట్ల మార్గం బీటలు వారింది. లోపల గదుల గోడలన్నీ పగుళ్లిచ్చాయి. పిల్లర్ల వద్ద ఖాళీ వచ్చింది. ముఖ్యంగా ద్వార బంధాలు విడిపోతున్నాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు రావడంలేదు. త్వరలోనే సెలవులు ముగిసి తిరిగి వీరంతా రానున్నారు. భవనం పరిస్థితి చూసి చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళనలు చెందుతున్నారు. పెచ్చులూడితే ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో. కనీసం వీటికి మరమ్మతులు చేయించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
శ్లాబు వద్ద పరిస్థితి
ద్వార బంధం వద్ద ఏర్పడిన పగుళ్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుల కన్ను పడితే.. జగద్రక్షకుడి ఆస్తులు గోవిందా..
[ 17-04-2024]
మనకు ఏ కష్టమొచ్చినా ముందు దేవుడినే తలుచుకుంటాం. భగవంతుడా మమ్మల్ని కష్టం నుంచి గట్టెక్కించు నీ దగ్గరకి వచ్చి మొక్కు తీర్చుకుంటామని కోరుకోవడం చూస్తుంటాం -
ఘాట్రోడ్లకు జగన్ పోటు
[ 17-04-2024]
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రధానమైన రెండు ఘాట్రోడ్లు ప్రమాదకరంగా మారాయి. పాడేరు, అరకులోయ ఘాటీలు అధ్వానంగా తయారయ్యాయి. వీటి నిర్వహణను వైకాపా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు
[ 17-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఎం.విజయసునీత పేర్కొన్నారు. -
సివిల్స్లో మనోళ్ల మెరుపులు
[ 17-04-2024]
పట్టుదల, ఆత్మ విశ్వాసంతో చదివితే దేన్నైనా సాధించవచ్చని నిరూపించాడు గిరి యువకుడు. హుకుంపేట మండలం అండిభ గ్రామానికి చెందిన చిట్టపులి నరేంద్ర పడాల్ సివిల్స్లో 545వ ర్యాంక్ సాధించారు. -
వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం
[ 17-04-2024]
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించాలని అరకు ఎంపీ ఎన్డీయే అభ్యర్థిని కొత్తపల్లి గీత పిలుపునిచ్చారు. -
లోయలో పడిన ఆటో.. డ్రైవర్ దుర్మరణం
[ 17-04-2024]
వివాహానికి హాజరై స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా లోయలోకి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీ చింతగున్నల గ్రామానికి చెందిన పాంగి కృష్ణబాబు(22). -
నామినేషన్ల స్వీకరణ రేపటి నుంచి
[ 17-04-2024]
ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 18న జారీ అవుతుందని, ఆ రోజు నుంచి 24వ తేదీ వరకు సెలవు రోజులు మినహా నామినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్, పాడేరు రిటర్నింగ్ అధికారి భావన తెలిపారు. -
ఈవీఎంలకు పటిష్ఠ భద్రత
[ 17-04-2024]
రాబోయే ఎన్నికల్లో వినియోగించనున్న ఈవీఎంలను పటిష్ఠ భద్రత మధ్య ఉంచినట్లు అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అభిషేక్ పేర్కొన్నారు. -
రాములోరి సారె ఊరేగింపు
[ 17-04-2024]
వేంపాడులో మంగళవారం రాములవారి సారె ఊరేగింపు భక్తిశ్రద్ధలతో సాగింది. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఏటా ఇక్కడ సారె ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. -
224 మందికి 120 గుడ్లు
[ 17-04-2024]
పాఠశాల విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేమితో చిన్నారులకు రుచికరమైన భోజనం అందని పరిస్థితులు కొనసాగుతున్నాయి. -
యువశక్తి హోరు.. తెదేపా శ్రేణుల్లో జోరు
[ 17-04-2024]
తెలుగుదేశం పార్టీ పాలనలో ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తీసుకువస్తే, వైకాపా పాలకులు వాటిని తరిమేసి గంజాయికి అడ్డాగా మార్చేశారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. -
ఆసరా ఇంకెప్పుడిస్తారు?
[ 17-04-2024]
నా అక్కా చెల్లెమ్మలకు మంచి చేసే ఉద్దేశంతో రుణమాఫీ ప్రకటిస్తున్నా.. స్వయం సహాయక సంఘాల ద్వారా మీరు తీసుకున్న మొత్తంలో ఎంత బకాయి ఉంటే దాన్ని మీకు తిరిగి చెల్లిస్తాన’ని ఆనాడు ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. -
పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కైవసం
[ 17-04-2024]
పట్టణానికి చెందిన విద్యార్థులు పవర్లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపారు. ఇటీవల జేఎన్టీయూ విజయనగరంలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలో కళాశాల్లో ఇంజినీరింగ్ చదువుతున్న లలితేశ్వరరావు... -
చినమల్లవరంలో 43 ఎకరాల జీడితోటలు దగ్ధం
[ 17-04-2024]
ఆర్.కొత్తూరు పంచాయతీ చినమల్లవరం గ్రామంలో 8 మంది రైతులకు చెందిన సుమారు 43 ఎకరాల జీడిమామిడి తోటలు మంగళవారం అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. -
పాడేరులో పాట్లెన్నో..
[ 17-04-2024]
జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో సమస్యలు తాండవం చేస్తున్నాయి. డివిజన్ కేంద్రంగా ఉన్న ఇది రెండేళ్ల క్రితం జిల్లా కేంద్రంగా అవతరించింది. ఇక్కడ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. -
వుషూ రిఫరీగా ప్రియాంక
[ 17-04-2024]
రాష్ట్రస్థాయి వుషూ రిఫరీగా వేపాడ ప్రియాంక ఎంపికైనట్లు శాప్ కోచ్ కె.అబ్బు తెలిపారు. విశాఖలో ఈ ఎంపిక జరిగిందని చెప్పారు. -
రాజవొమ్మంగిలో భానుడి ప్రతాపం
[ 17-04-2024]
మన్యంలో భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాజవొమ్మంగిలో మంగళవారం 39 డిగ్రీల ఉష్ణోగత్రలు నమోదవడంతో ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో భాజపా తుడిచిపెట్టుకుపోతుంది: అఖిలేష్ యాదవ్
-
వలసలు, పస్తులు లేని వికసిత ఏపీ మనందరి బాధ్యత: పవన్
-
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
-
యంగ్ ఇండియాది విరాట్ కోహ్లీ మనస్తత్వం: రఘురామ్ రాజన్
-
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
-
రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు