logo

డబ్బులకు పడిగాపులు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైతు భరోసా పథకం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసింది. వాటిని తీసుకునేందుకు వివిధ మండలాల నుంచి గిరిజన రైతులు జిల్లా కేంద్రం పాడేరులోని బ్యాంకులకు తరలివస్తున్నారు.

Published : 07 Jun 2023 02:12 IST

ఏపీజీవీబీ బ్యాంకుమిత్ర వద్ద గుమిగూడిన ఖాతాదారులు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైతు భరోసా పథకం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసింది. వాటిని తీసుకునేందుకు వివిధ మండలాల నుంచి గిరిజన రైతులు జిల్లా కేంద్రం పాడేరులోని బ్యాంకులకు తరలివస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే బ్యాంకుల్లో క్యూ కడుతున్నారు. ఎండలో గొడుగులు పట్టుకొని డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నారు. పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, జి.మాడుగుల, పాడేరు మండలాల రైతులకు పాడేరు బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. వీరికి బ్యాంకుల్లో డబ్బులు తీసుకునే సదుపాయం కల్పింలేదు. బ్యాంకు మిత్రల ద్వారా డబ్బులు తీసుకోవాల్సి రావడంతో ఆ పరిసరాల్లో గుమిగూడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని