logo

గంజాయి విక్రేతల అరెస్టు

అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి ఏలూరు నగరం పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠా సభ్యులు ముగ్గురిని త్రీటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 07 Jun 2023 02:12 IST

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి ఏలూరు నగరం పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠా సభ్యులు ముగ్గురిని త్రీటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6 కిలోల 300 గ్రాముల సరకు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఈ.శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారం మేరకు అనుమానితులపై త్రీటౌన్‌ సీఐ వరప్రసాదరావు ప్రత్యేక నిఘా పెట్టారన్నారు. ఈ క్రమంలో ఏలూరు నగర శివారు హేలాపురి సిటీ వెంచర్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఏలూరు శనివారపుపేట కట్టా సుబ్బారావుతోటకు చెందిన కొనాల రవితేజ, గ్జేవియర్‌నగర్‌కు చెందిన నడుకూరు కల్యాణ్‌, అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం గుడివాడ గ్రామానికి చెందిన కూసంగి వీరబాబు అలియాస్‌ వీరలను మంగళవారం అరెస్టు చేశారన్నారు. కొంతకాలంగా వీరబాబు వద్ద రవితేజ, కల్యాణ్‌ గంజాయిని కొనుగోలు చేసి నగరానికి తీసుకువస్తున్నారన్నారు. కాగా, నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించటంతో జిల్లా జైలుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని