ఆదివాసీ హక్కులు హరించే కుట్రలు తిప్పికొట్టాలి
ఆదివాసీ హక్కులు, చట్టాలను హరించే కుట్రలను ఆదివాసీ సమాజం కలిసికట్టుగా తిప్పికొట్టాలని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ ఛైర్మన్, మాజీ ఎంపీ డా. మిడియం బాబూరావు అన్నారు.
మాట్లాడుతున్న బాబూరావు, వేదికపై గిరిజన సంఘం నాయకులు
అరకులోయ పట్టణం, న్యూస్టుడే: ఆదివాసీ హక్కులు, చట్టాలను హరించే కుట్రలను ఆదివాసీ సమాజం కలిసికట్టుగా తిప్పికొట్టాలని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ ఛైర్మన్, మాజీ ఎంపీ డా. మిడియం బాబూరావు అన్నారు. అరకులోయలో గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు గురువారం ఆరంభమయ్యాయి. సంఘం నాయకులు బాలదేవ్, రామకృష్ణ, కౌసల్య అధ్యక్షతన జరుగుతున్న మహాసభలను తొలిరోజు మాజీ ఎంపీ మిడియం బాబూరావు, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ జిల్లాలో చింతపల్లి, అనంతగిరి మండలాల్లో, ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గ్రామంలో అదాని, ప్రైవేటు సంస్థకు హైడ్రోపవర్, తుపాకీ తయారీ ప్రాజెక్టులకు అనుమతులివ్వడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం అటవీ, పర్యావరణ నియమాలు సవరించి ఆదివాసీ ప్రాంత హక్కులైన 5, 6వ షెడ్యూల్డ్ అధికారాలను తొలగించడం ద్వారా రాజ్యాంగం కల్పించిన అటవీ, భూమి, సహజ వనరులు, గ్రామ సభ అధికారాలను తొలగిస్తూ ప్రైవేటు సంస్థలకు ప్రవేశం కల్పించడాన్ని గిరిజన సంఘం తిప్పికొడుతుందన్నారు. ఐటీడీఏలకు నిధుల కోతతో పాలన అస్తవ్యస్తంగా అవుతుందని, తక్షణం నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి గిరిజనుల్ని ఆదుకోవాలన్నారు. 1/70 చట్టం, పీసా, అటవీ హక్కుల చట్టాల అధికారాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించడాన్ని గిరిజన ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతంలో మతోన్మాద భావాలను తిప్పికొట్టి ఆదివాసీలంతా గిరిజన హక్కులు, చట్టాలు కాపాడాలని పిలుపునిచ్చారు. అఖిల భారత గిరిజన సంఘం నాయకులు అప్పలనర్సయ్య, కిల్లో సురేంద్ర, బాలదేవ్, పలు జిల్లాల గిరిజన ప్రతినిధులు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ