ఎండకు ఎండుతూ.. గుండెలు మండుతూ..
మండుటెండల్లో బతుకు బండినిలాగే ఉపాధి కూలీల వేతనాలకు కోతపడింది. ఒకపూట పనిచేస్తే అందే కూలీ డబ్బే ఇప్పుడు రెండుపూటలా చేస్తే తప్ప అందే పరిస్థితి కనిపించడం లేదు.
ఉపాధి హామీ కూలీల వెతలు
ఈనాడు, పాడేరు- న్యూస్టుడే, అచ్యుతాపురం
పూడిక పనులు చేస్తున్న ఉపాధి కూలీలు
మండుటెండల్లో బతుకు బండినిలాగే ఉపాధి కూలీల వేతనాలకు కోతపడింది. ఒకపూట పనిచేస్తే అందే కూలీ డబ్బే ఇప్పుడు రెండుపూటలా చేస్తే తప్ప అందే పరిస్థితి కనిపించడం లేదు. భానుడి భగభగల్లో అల్లాడుతూ పలుగు, పారా పట్టుకొని పనులు చేస్తున్నా కడుపునిండే పరిస్థితులు కనిపించడం లేదు.
ఉమ్మడి విశాఖలో రోజుకు 2.50 లక్షల మంది కూలీలు పనిచేయగా ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఇది లక్షన్నరకు పరిమితమైంది. ఇప్పటివరకు ఒక పూట పని చేస్తే సరిపోయేది. రెండు పూటలూ పనిచేయాలని నిబంధన తీసుకురావడంతో మండుటెండల్లో కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 11 గంటలోగా ఒక ఫొటో, సాయంత్రం 5 గంటల్లోగా మరో ఫొటో తీసి యాప్లో ఆఫ్లోడ్ చేసే విధంగా నిబంధనలు సవరించారు. దీని వల్ల మండుటెండల్లో పనిచేయలేక ఇబ్బంది పడుతున్నారు.
వేసవి అలవెన్స్ల్లో కోత....
* గతంలో వేసవి అలవెన్స్లు అందించేవారు. మార్చి నుంచి జూన్ వరకు అందించే ఈ అలవెన్స్లను గత ఏడాది నుంచి నిలిపివేశారు. మార్చిలో 30 శాతం, ఏప్రిల్ 40, మే నెలలో 50, జూన్లో 20 శాతం కూలీలకు అదనంగా అందించేవారు. వీటినీ ఎత్తేశారు.
* గతంలో 10 మంది కలిసి పనిచేసినా ఉపాధి వేతనాలు అందించేలా ఉన్న నిబంధనలు ఇప్పుడు 50 మంది తప్పనిసరిగా ఉండేలా మార్చారు.
* 100 రోజులు పని పూర్తి చేసిన కూలీలకు అందించే పలుగు, పారలు ఇవ్వడంలేదు. పనిచేస్తున్న చోట టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో కూలీలు సొమ్మసిల్లిపడిపోయినా సేదతీరే అవకాశం లేకుండాపోతోంది.
దాహం తీరే దారేది?
గతంలో దాహం తీర్చుకోవడానికి కొంత నగదును అందించేవారు. ఇప్పుడు దీనిని పూర్తిగా తొలగించారు. 5 కిలోమీటర్ల దాటి ప్రయాణం చేస్తే చెల్లించాల్సిన రవాణా ఛార్జీలను సైతం ఈ ఏడాది నుంచి మొండిచెయ్యి చూపించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపాధి కూలీలకు ఎక్కడా కనీస వేతనం రూ.257 అందుతున్న సందర్భాలు లేవు.
కన్నీరు పెట్టిస్తున్నారు..!
ఉపాధి కూలీల కష్టాలను ఎవరూ పట్టించుకోవడంలేదు. గతంలో ఒక పూట పనిచేస్తే వచ్చే డబ్బులు ఇప్పుడు రెండుపూటలు చేసినా రావడంలేదు. మండుతున్న ఎండల్లో పనులు చేయలేక, కుటుంబాలను ఆకలితో ఉంచలేక ఉపాధి పనులు చేస్తున్నాం. కష్టపడే వారిని ఆదుకోవాల్సిన వారే కన్నీరు పెట్టిస్తున్నాయి. పనిప్రదేశంలో గతంలో కల్పించిన సౌకర్యాలు ఇప్పుడు లేకపోవడం అన్యాయం.
పీలా లక్ష్మి, ఉపాధి కూలీ, హరిపాలెం
200 రోజుల పని కల్పించాలి : ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహస్య అజెండాతో పనిచేస్తున్నాయి. వేసవి అలవెన్స్లు ఎత్తేశారు. ఉపాధి పనులు ఏడాదికి 200 రోజులు నిర్వహిస్తే అందరికీ ప్రయోజనం ఉంటుంది. కొలతలతో సంబంధం లేకుండా రోజుకు రూ.600 కూలీ గిట్టుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
రొంగలి రాము,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు
వేసవి అలవెన్స్లు ఇవ్వాలి : గతంలో ఉపాధి కూలీలకు పరికరాలతోపాటు నీటికి, వేసవి కాలంలో ప్రత్యేక అలవెన్స్లు ఇచ్చేవారు. రెండేళ్లగా వీటిని పూర్తిగా తొలగించారు. రోజులో రెండుపూటలా పనిచేయాలని నింబధన తీసుకొచ్చారు. ఎండలు మండుతున్న టెంట్లు వేయడం, తాగునీరు అందివ్వడం వంటి కనీస అవసరాలను తీర్చడంలేదు.
పోలేటి సముద్రాలు, పెదపాడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నేనున్నానన్నావు.. నట్టేట్లో ముంచావు!
[ 24-04-2024]
విలీన మండలాల్లో కూనవరం, వరరామచంద్రాపురం దాదాపు 90 శాతం ముంపు బారిన పడుతున్నాయి. ఇక్కడ గత తెదేపా ప్రభుత్వమే పూర్తిచేసి పునరావాస కాలనీలను నిర్మించింది. -
ఎంటీఎస్ ఉపాధ్యాయులకు తొలగింపు ఉత్తర్వులు
[ 24-04-2024]
ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) ప్రాతిపదికన పనిచేస్తున్న డీఎస్సీ-98, 2008 ఉపాధ్యాయులను తొలగిస్తూ జిల్లా నోడల్ విద్యాశాఖాధికారి చంద్రకళ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మహిళపై ప్రియుడి దాడి
[ 24-04-2024]
మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లువ్వాసింగి పంచాయతీ వలసమామిడి గ్రామానికి చెందిన సారే సత్యవతి భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మసాడి విశ్వేశ్వరరావుతో సహజీవనం చేస్తోంది. -
ఏకతాటిపైకి నేతలు.. తెదేపాలో నూతనోత్సాహం
[ 24-04-2024]
రంపచోడవరం నియోజవర్గంలో తెదేపా నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
రక్షణ మంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు
[ 24-04-2024]
అనకాపల్లిలో బుధవారం నిర్వహించనున్న పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ విజయీభవ ర్యాలీకి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ విచ్చేస్తున్నారు. -
మాడుగులను అగ్రగామిగా నిలుపుతా
[ 24-04-2024]
మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. -
చేతకాక చేతులెత్తేశారు...
[ 24-04-2024]
పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు ఎన్నో హామీ లిచ్చిన జగన్ ఆ తర్వాత వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో