మిరప విత్తులు.. వ్యాపారుల ఎత్తులు
మార్కెట్లో మిరప విత్తనాలకు రెక్కలొచ్చాయి. నల్లతామర పురుగును తట్టుకొని అధిక దిగుబడులు వస్తాయనే ప్రచారం జరగడంతో కొన్ని కంపెనీల విత్తనాలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు.
ఎటపాక, న్యూస్టుడే
కల్లంలో మిరప కాయల కుప్ప
ముందస్తు విత్తనం కావాలని రైతుల డిమాండ్ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా ఆర్బీకేలకు పది గ్రాముల విత్తనాలు సరఫరా కాలేదు. విత్తనాల కోసం 8-10 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అధికారులు చెబుతున్నారు.
మార్కెట్లో మిరప విత్తనాలకు రెక్కలొచ్చాయి. నల్లతామర పురుగును తట్టుకొని అధిక దిగుబడులు వస్తాయనే ప్రచారం జరగడంతో కొన్ని కంపెనీల విత్తనాలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని వ్యాపారులు ఆసరాగా చేసుకుని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. విత్తన పంపిణీదారులు ఎమ్మార్పీకి మించి సరఫరా చేస్తే... వ్యాపారులు మరికొంత కలిపి అమ్మేస్తున్నారు. పది గ్రాముల విత్తన సంచి గరిష్ఠ ధర రూ.1300 ఉంటే రూ.1800 వసూలు చేస్తున్నారు. బిల్లు మాత్రం రూ.1300కే ఇస్తున్నారు. అదీ తెలిసిన వారెవరైనా ఉన్నా... సిఫార్సులు తెచ్చిన వారెవరైనా ఉంటేనే బిల్లు ఇవ్వడం గమనార్హం.
గతేడాది మిరపకు తెగుళ్లు సోకాయి. అంచనాల కంటే తక్కువగా దిగుబడులొచ్చాయి. ధరలు ఎక్కువగా ఉండటంతో సాగు కలిసొచ్చింది. పత్తి సాగు చేసిన రైతులకు పూర్తిగా నష్టం వచ్చింది. దీంతో వారంతా మిరప వైపు దృష్టి సారించారు. దీని సాగు విస్తీర్ణం 15-25శాతం పెరగొచ్చని అంచనా. దీనికి విత్తనాన్ని సరఫరా చేస్తున్న విత్తనాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం.
ఆర్బీకేల్లో కనిపించని వైనం : బీ ఆర్బీకేల్లో అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నట్లు పాలకులు, అధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
* అల్లూరి సీˆతారామరాజు జిల్లాలో 197 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. అందులో రంపచోడవరం నియోజకవర్గంలోని చింతూరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలోనే 82 ఉన్నాయి. వాటి పరిధిలో 4500 ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు. దీనికోసం సుమారుగా 550 కేజీల విత్తనం అవసరం ఉంది. ఓ కంపెనీకి చెందిన విత్తనమే 400 కేజీలు కావాలని రైతులు డిమాండ్ చేస్తుండటం గమనార్హం.
మన్యంలో ఇదీ పరిస్థితి....
జిల్లాలో అధిక విసీˆ్తర్ణంలో సాగు చేస్తున్న పంటల్లో మిరప ఒకటి. చింతూరు డివిజన్లోని ఎటపాక, కూనవరం, వరరామచంద్రపురం, చింతూరు మండలాల్లో 4500 ఎకరాల విసీˆ్తర్ణంలో మిరప సాగు చేస్తున్నారు. సకాలంలో విత్తు అందుబాటులో లేకపోతే నష్టపోతామని రైతులు ముందస్తుగా కొనుగోలు చేస్తున్నారు.
కౌలుకు రెక్కలు.....
మిరప పంటకు ధర అధికంగా ఉండడంతో కౌలు భూములకు రెక్కలొచ్చాయి. గోదావరి పరివాహకంలో ఉన్న భూములకు ఎకరాకు రూ.40వేలు నుంచి రూ.50వేల వరకు కౌలు ఉంటుంది. సాధారణ ఏరియాలో భూములున్న రైతులు రూ.20వేల నుంచి రూ.40వేల వరకు అడుగుతున్నారు. ఈ ఏడాది దిగుబడి లేకపోయినా ధర అధికంగా పెరగడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
అందుబాటులోకి తేవాలి: సకాలంలో మిరప విత్తనం ఆర్బీకేల్లో అందుబాటులో ఉంటే రైతులకు మేలు కలుగుతుంది. నారుమడి వేసే నాటికి విత్తనం అందుబాటులో రావాలి. అధికారులు చర్యలు తీసుకుంటేనే రైతులకు ప్రయోజనం. ఇప్పటికే పొలాలు దుక్కులు పూర్తి చేసుకుంటున్నాం. విత్తనం ముందస్తుగా కొనుగోలు చేయకపోతే ఆ సమయానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది.
మడకం నర్సింహారావు, రైతు, గౌరిదేవిపేట
జులైలో అందుబాటులోకి..: మిరప విత్తుకోవడానికి సమయం ఉంది. ముందస్తుగా ఆయా కంపెనీల విత్తనాలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి నివేదికలు పంపాం. జులైలో అందుబాటులోకి తెస్తాం. నారుమడికి 45రోజుల సమయం ఉంటుంది. అంతవరకు విత్తనం కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
కాశీవిశ్వనాథ చౌదరి, వ్యవసాయశాఖ ఏడీఏ, రంపచోడవరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
రెండో రోజు నామినేషన్ల సందడి
[ 20-04-2024]
నామినేషన్ల స్వీకరణ రెండో రోజు అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ తెలిపారు. -
అనంత బాబు అరాచకాలకు ముగింపు పలుకుదాం
[ 20-04-2024]
ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకాలతో మన్యం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వైకాపాను ఓడించి ఆయన ఆట కట్టించడమే తమ లక్ష్యమని రంపచోడవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి స్పష్టంచేశారు. -
కన్నాయిగూడెం ఎంపీటీసీ సభ్యుడి హత్య
[ 20-04-2024]
కన్నాయిగూడెం మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఇందుకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం వివరాలు వెల్లడించారు. -
సిద్ధం..ప్రయాణానికి యుద్ధం
[ 20-04-2024]
‘ఎక్కడైనా సీఎం వస్తున్నాడంటే వరాలు జల్లులు కురిపిస్తారని ఆనందపడతారు. జగన్ వస్తే మాత్రం అమ్మో అంటున్నారు. ఈ సీఎం వస్తే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే.. కరెంటు తీగలు తొలగించాల్సిందే. -
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 20-04-2024]
కశింకోట మండలం తాళ్లపాలెం డా.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
చంద్రబాబు ఆశీస్సులున్నాయి: ఈశ్వరి
[ 20-04-2024]
తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శుక్రవారం కొయ్యూరు మండలంలో పర్యటించారు. తన అనుచరులను కలిసి నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. -
ఎండ తీవ్రతతో ద్విచక్రవాహనం దగ్ధం
[ 20-04-2024]
అధిక ఉష్ణోగ్రతతో ఓ ద్విచక్రవాహనం దగ్ధమైన ఘటన శుక్రవారం పాడేరు పట్టణంలో చోటుచేసుకుంది. పాడేరు ప్రధాన రహదారి సినిమాహాల్ కూడలి వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. -
ఏజెన్సీలో వేసవి తాపం
[ 20-04-2024]
మైదాన ప్రాంతాలకు దీటుగా ఈ సారి ఏజెన్సీ ప్రాంతంలోనూ వేసవి తాపం గట్టిగానే చూపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా ఏజెన్సీలో ప్రధాన కేంద్రాలైన పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
సైకో పాలనతో ప్రజలకు తీవ్రనష్టం
[ 20-04-2024]
అరకులోయ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్లు దాఖలు చేసే ముందు ఆయన స్వగ్రామం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ లకేయిపుట్టులో గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నిర్వాసితులను ముంచిన జగన్
[ 20-04-2024]
జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జిల్లాలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడేరు పట్టణంలో పర్యటించి అనేక హామీలు గుప్పించారు. -
పోక్సో కేసులో ప్రిన్సిపల్కు ఐదేళ్ల జైలు
[ 20-04-2024]
ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రిన్సిపల్ నాగసాయి నరసింహమూర్తికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం