నిద్రపోతున్ననిఘా!
రాష్ట్రంలో విశాఖ రైల్వేస్టేషన్కు ఎంతో ప్రత్యేకత ఉంది. రోజూ లక్ష మందికి పైగా ప్రయాణికులు వస్తారు. నిత్యం 120 ప్రయాణికుల రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
ఈనాడు, విశాఖపట్నం, రైల్వేస్టేషన్, న్యూస్టుడే: రాష్ట్రంలో విశాఖ రైల్వేస్టేషన్కు ఎంతో ప్రత్యేకత ఉంది. రోజూ లక్ష మందికి పైగా ప్రయాణికులు వస్తారు. నిత్యం 120 ప్రయాణికుల రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న చోట సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయడం లేదు. స్టేషన్కు నలువైపులా సరిపడినన్ని ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఉన్న వాటి వల్ల ప్రయోజనం కూడా కనిపించడం లేదు. ఫలితంగా స్టేషన్లో దొంగతనాలు, కిడ్నాప్లకు పాల్పడే వ్యక్తులను గుర్తించడం పోలీసులకు సవాల్గా మారుతోంది.
సీసీ కెమెరాల పర్యవేక్షణ గదిలో పరిశీలిస్తున్న అధికారులు
దృశ్యాల్లో స్పష్టత లేక: మూడు నెలల కిందట నర్సీపట్నం యువకులు ఇద్దరు భువనేశ్వర్ వెళ్లేందుకు స్టేషన్కు వచ్చారు. ఒకరు ప్లాట్ఫాం మీద నిరీక్షించగా మరొకరు టికెట్ తీసుకునేందుకు వెళ్లారు. టికెట్ తీసుకొని వచ్చేసరికి... ప్లాట్ఫాంపై ఉండాల్సిన వ్యక్తి కనిపించలేదు. స్టేషన్లో వెతికినా ఆచూకీ లభించలేదు. జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ప్లాట్ఫాంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అవి సక్రమంగా పనిచేయకపోవడంతో దృశ్యాల్లో స్పష్టత లేకుండా పోయింది. తాజాగా గురువారం ఏడాదిన్నర బాలుడు కిడ్నాప్నకు గురైన తరువాత కూడా ఇదే తరహా సమస్య ఎదురయింది. ప్లాట్ఫాం 8లో 34వ స్తంభం వద్ద ఆ చిన్నారి కిడ్నాప్నకు గురయ్యాడు. దానికి సమీపంలో 35వ స్తంభం వద్ద కెమెరా ఉన్నప్పటికీ దృశ్యాల్లో స్పష్టత లేదు. దీంతో ఈ కేసును వెంటనే ఛేదించడంలో విఫలమయ్యారు.
పరిమిత సంఖ్యలోనే: విశాఖపట్నం స్టేషన్లో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల నిఘా చాలా అవసరం. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాల్లో సరకులు, గంజాయి, మత్తుపదార్థాలను తరలిస్తున్నారు. పెద్ద సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ఏ రైలు నుంచి ఎవరు వస్తున్నారు, ఎక్కడ దిగి ఎలా వెళ్తున్నారు ఇతర అనుమానితులను గుర్తించడంలో కెమెరాల పాత్ర కీలకం. అయినా పరిమిత సంఖ్యలోనే ఇవి ఉన్నాయి. దాదాపు 200లకుపైగా సీసీ కెమెరాలు అవసరం. 47 ఏర్పాటు చేయగా..అందులో 19 పని చేయడం లేదని సమాచారం. వీటిలో కొన్ని కెమెరాల గడువు పూర్తయిపోయింది. ఇంకొన్ని కెమెరాల్లోని దృశ్యాలు నమోదు కావడం లేదు. కొన్నింటికి శాటిలైట్ సిగ్నల్ నాట్ వర్కింగ్ అని చూపిస్తున్నాయి. వీటి సిగ్నలింగ్ వ్యవస్థను టెలికం విభాగం పర్యవేక్షించాల్సినప్పటికీ పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. కేవలం ప్రధాన ద్వారాలు, ప్రవేశ మార్గాలు, మెట్లు, ఎక్స్లేటర్లు వద్ద ఉన్నవే పనిచేస్తున్నాయి.
ఆదాయంపైనే దృష్టి: స్టేషన్లో నిఘా కెమెరాల వ్యవస్థ సక్రమంగా లేదని జీఆర్పీ నుంచి పలుమార్లు రైల్వే అధికారులకు తెలిపినా ప్రయోజనం కనిపించలేదు. లేదు. ఇంటెలిజెన్స్ అధికారులు ఇక్కడి లోపాలను గుర్తించారు. ఎక్కడెక్కడ ఏ కెమెరాలు.. ఏవిధంగా ఏర్పాటు చేయాలో కూడా తెలిపారు. రైల్వే అధికారులు ఆదాయం వచ్చే అంశాల మీద దృష్టిసారిస్తున్నారు తప్ప ఇటువంటి వాటి విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కెమెరాలు రైల్వే అధికారులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా...స్టేషన్ ఆధునికీకరణ పేరుతో పట్టించుకోకపోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు