ప్రతి ఫిర్యాదూ పరిష్కరించాల్సిందే: కలెక్టర్
స్పందనలో అందిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించాల్సిందేనని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ అందిన ప్రతి ఫిర్యాదుకు విచారణాధికారిని నియమించాలన్నారు.
వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ సుమిత్కుమార్, పీఓ వి.అభిషేక్, జేజీ శివ శ్రీనివాసు తదితరులు
పాడేరు పట్టణం, న్యూస్టుడే: స్పందనలో అందిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించాల్సిందేనని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ అందిన ప్రతి ఫిర్యాదుకు విచారణాధికారిని నియమించాలన్నారు. విచారణ అనంతరం చేపట్టిన పరిష్కార వివరాలను ఫిర్యాదుదారునికి తెలియజేయాలని సూచించారు. ప్రతి అధికారి, సిబ్బంది తప్పనిసరిగా ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాలన్నారు. స్పందనలో 139 ఫిర్యాదులు అందాయి. అరకులోయ మండలం కొత్తభల్లుగుడ పంచాయతీ రవ్వలగూడ గ్రామానికి చెందిన దురియా రామచందర్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కోల్పోతున్న భూమికి పరిహారం ఇప్పించాలని కోరారు. కొయ్యూరు మండలం కొండగోకరి పంచాయతీ రత్నంపేటలో సీఆర్టీగా పనిచేస్తూ మృతి చెందిన రాజబాబు స్థానంలో తనకు ఏదైనా పాఠశాలలో అవకాశం కల్పించాలని అతడి భార్య ఎర్రమ్మ వినతిపత్రం అందజేశారు. పాడేరుకు చెందిన కె.మధు తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ ఒంటిపాక గ్రామానికి చెందిన జి.మల్లేశ్వరరావు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. పాడేరు మండలం గబ్బంగి పంచాయతీ గబ్బంగి గ్రామానికి చెందిన తమర్బ భవాని, వెంకటరమణ అటవీ హక్కు పత్రాలు అందజేయాలని విన్నవించారు. ఐటీడీఏ పీఓ వి.అభిషేక్, సంయుక్త కలెక్టర్ శివ శ్రీనివాసు, అసిస్టెంట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాత్సవ, డీఆర్ఓ అంబేడ్కర్, జిల్లా, డివిజన్స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె