పెద్దపులి దాడిలో దున్నపోతు హతం
చింతూరు అటవీ డివిజన్ లక్కవరం రేంజ్ పరిధిలోని సుకుమామిడి సమీప పొలాల్లో పెద్దపులి సంచారం గిరిజనులను కలవరానికి గురిచేసింది.
పులి పాదముద్రలు
మోతుగూడెం, న్యూన్టుడే: చింతూరు అటవీ డివిజన్ లక్కవరం రేంజ్ పరిధిలోని సుకుమామిడి సమీప పొలాల్లో పెద్దపులి సంచారం గిరిజనులను కలవరానికి గురిచేసింది. సుకుమామిడి పెద్దవాగు సమీపంలో మోతుగూడెం గ్రామ రైతు వి.నాగేశ్వరరావుకు చెందిన దున్నపోతుపై పెద్దపులి దాడిచేసి హతమార్చింది. వివరాల్లోకి వెళ్తే. మేత కోసం సమీప అటవీ ప్రాంతానికి వెళ్లిన దున్నపోతు సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో యజమాని అటవీ ప్రాంతంలో వెతకగా పెద్దపులి చంపినట్లు గుర్తించి, లక్కవరం రేంజ్ అటవీ క్షేత్రాధికారి వెంకట నానాజీకి ఫిర్యాదు చేశారు. ఆయన చింతూరు డీఎఫ్వో పుష్ప సౌజన్యకు సమాచారం ఇవ్వగా, ఆమె హుటాహుటిన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ పాద ముద్రలను గుర్తించి దాడి చేసింది పెద్ద పులేనని తేల్చారు. దాని కదలికలు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పెద్ద పులి సంచరించిందని తెలియటంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో డీఎఫ్వో సమీప గిరిజన గ్రామాల్లోని గిరిజనులతో సమావేశమై వారిని అప్రమత్తం చేశారు.
అప్రమత్తంగా ఉండాలి
మోతుగూడెం, న్యూస్టుడే: లక్కవరం రేంజ్లోని అభయారణ్యంలో పెద్ద పులి సంచారిస్తోందని, సమీప ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎఫ్వో జె.పుష్ప సౌజన్య హెచ్చరించారు. పశువుల యజమానులు తమ పశువులను గ్రామ సమీప పొలాల్లో మేపుకోవాలని సూచించారు. మనుషులపై కూడా దాడి చేసే అవకాశాలున్నాయన్నారు. దాని సంచారం ఎటు అని అంచనా వేయడం కష్టమన్నారు. గ్రామాల్లో టముకు ప్రచారంతో ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. పులి సంచారంపై ఎటువంటి సమాచారం మీకు తెలిసిన తక్షణమే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బోరు’మనిపించావ్ జగన్
[ 23-04-2024]
తెదేపా హయాంలో అమలుచేసిన ఎన్టీఆర్ జలసిరి పథకానికి వైకాపా ప్రభుత్వం పేరు మార్చి వైఎస్ఆర్ జలకళ అని పెట్టింది. దీనికింద ఉమ్మడి జిల్లాలో 20 వేల బోర్లు తీస్తామని ప్రకటించారు. నియోజకవర్గానికి ఒక రిగ్గు కేటాయిస్తున్నామంటూ సీఎం జగన్ హడావుడి చేశారు. -
పదోతరగతి ఫలితాల్లో జిల్లాల ర్యాంకులు కిందికి!
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి. -
జోరందుకున్న నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. -
వైకాపా పాలనలో ఆదివాసీలకు అన్యాయం
[ 23-04-2024]
గిరిజన ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పించేందుకు నిండుగా అవకాశాలున్నా వైకాపా ప్రభుత్వం నిర్వాకంతో అది అందని ద్రాక్షలా మారింది. -
రోడ్డు లేక ఇబ్బందులు
[ 23-04-2024]
అనంతగిరి మండలంలోని మారుముల చీడివలస, పాటిపల్లి, పట్టం, బందకొండ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు సోమవారం నిరసన చేపట్టారు. -
ఓటర్లను చైతన్యపర్చండి
[ 23-04-2024]
పోలింగ్లో అధికసంఖ్యలో ఓటర్లు పాల్గొనేలా చైతన్యపర్చాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత.. భారతదేశ అంధుల క్రికెట్ జట్టు ఆల్రౌండర్ వలసినైని రవణిని కోరారు. -
కోలాహలంగా అభ్యర్థుల నామినేషన్లు
[ 23-04-2024]
పాయకరావుపేట కూటమి అభ్యర్థిగా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సోమవారం నామినేషన్ వేశారు. -
ప్రణాళికాలోపంతో గందరగోళం
[ 23-04-2024]
నక్కపల్లిలో సోమవారం జరిగిన ప్రధాన పార్టీల నామినేషన్ల ప్రక్రియలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. -
పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోండి ఇలా..
[ 23-04-2024]
పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో ఎన్నికల కమిషన్ కొత్త విధానానికి నాంది పలికింది. ఎ -
కూటమి జోరుతో వైకాపా నేతల్లో భయం
[ 23-04-2024]
వైకాపాకు వెన్నులో వణుకుపుట్టేలా తెదేపా కార్యకర్తలు పనిచేయాలని తెదేపా ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు కోరారు. -
జనసేనలో చేరికలు
[ 23-04-2024]
ఎలమంచిలి 8వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ సాయిప్రసన్న భర్త ఓగిబోయిన చిరంజీవి సోమవారం జనసేనలో చేరారు. -
గిరిజనులు చింత తీరేనా?
[ 23-04-2024]
అల్లూరి జిల్లాలో ఈ ఏడాది చింతపండు దిగుబడులు గిరిజన రైతులను పూర్తిగా నిరాశపరిచాయి. -
గిరి విద్యార్థుల జయకేతనం
[ 23-04-2024]
పది ఫలితాల్లో గిరి విద్యార్థులు రాణించారు. ఫలితాలపై పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ ఆనందం వ్యక్తం చేశారు. -
ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు
[ 23-04-2024]
నిషేధిత మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఆరుగురు కీలక సభ్యులు విశాఖ రేంజి డీఐజీ విశాల్ గున్ని, అల్లూరి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఎదుట లొంగిపోయారు. -
బూడి ఆస్తులు రూ.7.39 కోట్లు, అప్పులు రూ.2.54 కోట్లు
[ 23-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ వైకాపా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుతోపాటుగా ఇతని భార్య రమణమ్మకు రూ.7.39 కోట్లు ఆస్తులు ఉండగా, అప్పులు రూ. 2.54 కోట్లు ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి