రూ. 20 లక్షలతో దుకాణాల ఏర్పాటు
గిరిజన ప్రాంతాల్లో వారపు సంతలే గిరిజనులకు సూపర్మార్కెట్లు. ఇక్కడ దొరకని వస్తువు, సామగ్రి ఉండదు. ప్రతిరోజూ మన్యంలో ఎక్కడో ఒక చోట వారపు సంతలు జరుగుతూనే ఉంటాయి. చింతపల్లిలో ప్రతి బుధవారం సంత జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక మైదాన ప్రాంత మండలాల నుంచి అధిక సంఖ్యలో వ్యాపారులు ఇక్కడకు వస్తుంటారు.
చింతపల్లి సంతలో నిర్మిస్తున్న షెడ్, అటవీ ఉత్పత్తులు
దాచుకునేందుకు గోదాము
చింతపల్లి, న్యూస్టుడే ;- గిరిజన ప్రాంతాల్లో వారపు సంతలే గిరిజనులకు సూపర్మార్కెట్లు. ఇక్కడ దొరకని వస్తువు, సామగ్రి ఉండదు. ప్రతిరోజూ మన్యంలో ఎక్కడో ఒక చోట వారపు సంతలు జరుగుతూనే ఉంటాయి. చింతపల్లిలో ప్రతి బుధవారం సంత జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక మైదాన ప్రాంత మండలాల నుంచి అధిక సంఖ్యలో వ్యాపారులు ఇక్కడకు వస్తుంటారు. ప్రతి వారం రూ. లక్షల్లో వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. గిరిజనులు పండించిన వ్యవసాయోత్పత్తులు, సేకరించిన అటవీ ఉత్పత్తులను వారపు సంతలకు తీసుకొచ్చి వ్యాపారులకు, జీసీసీకి విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో గిట్టుబాటు ధరలు రాక ఒక్కోసారి రైతులు తాము తీసుకువచ్చిన ఉత్పత్తులను తక్కువ ధరకే విక్రయించుకోవాల్సిన పరిస్థితి. ధరలు వచ్చేంత వరకూ ఈ ఉత్పత్తులను దాచుకునే మార్గం ఉండదు. దీంతో రైతులు వ్యాపారులు అడిగిన తక్కువ ధరలకే తాము తీసుకువచ్చిన ఉత్పత్తులను విక్రయించుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఉండేది.
*గిరిజన రైతులు వారపు సంతలకు తీసుకొచ్చిన ఉత్పత్తులు అమ్ముకోవడంతోపాటు అవసరమైతే వాటిని కొద్దిరోజులపాటు నిల్వ చేసుకునేందుకు వీలుగా సంతల్లో విలేజ్ హట్స్ నిర్మించాలని 2009లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరక్రాంతి పథం (ఐకేపీ) ద్వారా రూ. 15 లక్షలను ఇందుకోసం కేటాయించారు. మన్యంవ్యాప్తంగా సుమారు 45 చోట్ల వీటిని నిర్మించాలని భావించారు. ఒక్కో నిర్మాణానికి తొలి విడతగా రూ. 5 లక్షల నిధులు కేటాయించారు. ఆ నిధులతో పునాదులు నిర్మించారు. ఇక అప్పటి నుంచి అవి నిరుపయోగంగానే ఉన్నాయి. మంచి ఆలోచనతోనే వీటిని నిర్మించ తలపెట్టినా అమలుకు నోచుకోకపోవడంతో రైతులు ఎప్పటిలాగానే తాము తీసుకొచ్చిన ఉత్పత్తులను వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ధరలు రాకపోతే రైతులు తాము తీసుకొచ్చిన ఉత్పత్తులను దాచుకునే మార్గం లేదు. దీనిపై గత ఏడాది నవంబరు 18న ‘దాచుకునేందుకు చోటేదీ’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీనిపై గిరిజన వికాస్ స్వచ్ఛంద సంస్థ స్పందించింది. సంస్థ కార్యదర్శి సత్యనారాయణ పంచాయతీ పాలకవర్గంతోపాటు నాబార్డు అధికారులతో చర్చించి చింతపల్లి సంతలో శాశ్వత షెడ్ల నిర్మాణంతోపాటు గిరిజన ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు గోదాము నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం నాబార్డు రూ.15 లక్షల నిధులను కేటాయించింది. పంచాయతీ తరఫున రూ.5 లక్షలు నిధులు ఇచ్చేందుకు సర్పంచి పుష్పలత అంగీకరించారు. దీంతో ఎట్టకేలకు వీటి నిర్మాణాలు పూర్తయ్యాయి. సంతషెడ్లతోపాటు గోదాము నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో వీటిని ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి వినియోగంలోకి వస్తే వారపు సంతలో దుకాణాల ఏర్పాటుతోపాటు ప్రత్యేకంగా గిరిజన ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సంతకు వచ్చే గిరిజనులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటితోపాటు మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు సర్పంచి పుష్పలత, ఈవోపీఆర్డీ శ్రీనివాస్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి