బైకు దొంగల ముఠా ఆటకట్టు
ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను పట్టుకుని వారి నుంచి 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు.
20 వాహనాల స్వాధీనం
నిందితులను అరెస్టు చూపిస్తున్న పోలీసులు
చింతపల్లి గ్రామీణం, న్యూస్టుడే: ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను పట్టుకుని వారి నుంచి 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఆయన మాట్లాడుతూ గతనెల 25న ద్విచక్ర వాహనం చోరీకి గురవడంపై ఈనెల 14న కొయ్యూరు ఎస్సై రాజారావుకు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి రోజూ వాహనాల తనిఖీ చేపట్టారని తెలిపారు. ఈ క్రమంలో దొడ్డవరం వద్ద బైక్పై వెళుతున్న మాకవరపాలెం మండలం తామరం గ్రామానికి చెందిన ఆకేటి దుర్గా ప్రసాద్, చింతపల్లి మండలం వంట్లమామిడి గ్రామానికి చెందిన వంతల సోమరాజులను ఆపి ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పారన్నారు. దీనికితోడు వారి బైక్కు నంబరు ప్లేట్ లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నామన్నారు. తరవాత చేపట్టిన విచారణలో ఈ ఇద్దరూ రెండేళ్ల నుంచి విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు గుర్తించామని చెప్పారు. దొంగిలించిన బైకులను చింతపల్లి మండలం అన్నవరానికి చెందిన పాంగి ప్రకాష్, పోతురాజు గుమ్మల గ్రామానికి చెందిన వంతల నాగేంద్ర, నిమ్మపాడు గ్రామానికి చెందిన గెమ్మెల సన్యాసిరావుకు అమ్మేవారన్నారు. వీటిని నిమ్మపాడు గ్రామానికి సమీపంలోనున్న పొదల్లో దాచి ఉంచారని చెప్పారు. సమయం చూసుకుని గంజాయి రవాణాదారులకు అమ్మేసేవారని చెప్పారు. మొత్తం ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గెమ్మెల సన్యాసిరావును ఇప్పటికే వేరే కేసుల్లో అరెస్ట్ చేశామన్నారు. మిగిలిన నలుగురు నిందితులపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించామన్నారు. కొయ్యూరు సీఐ స్వామినాయుడు, ఎస్సై రాజారావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీను, శంకర్, మాణిక్యం, గోవిందులకు అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ రివార్డులను ప్రకటించారు. చింతపల్లి సీఐ రమేష్, ఎస్సై అరుణ్ కిరణ్ పాల్గొన్నారు.
స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగని వానలు.. ఉప్పొంగిన వాగులు
[ 07-12-2023]
మిగ్జాం తుపాను తీరం దాటినా అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. చేతికందాల్సిన వేల ఎకరాల పంట ఈ తుపాను ధాటికి గంగపాలైంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలతో రెండు జిల్లాల వాసులు చిగురుటాకుల్లా వణికిపోయారు. -
నష్టాలపై నివేదికలు రూపొందించండి
[ 07-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావంతో జిల్లాలో దెబ్బతిన్న ఇళ్లు, వ్యవసాయ, ఉద్యాన పంటలు, పశువులు, నీటి పారుదల వ్యవస్థలపై నివేదికలు రూపొందించాలని కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశించారు. -
అరకు ఘాట్రోడ్డులో రాకపోకలు బంద్
[ 07-12-2023]
అనంతగిరి ఘాట్రోడ్డులో బుధవారం వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మిగ్జాం తుపాను కారణంగా మంగళవారం రహదారిపై పడిన కొండచరియలను తొలగిస్తుండగా బుధవారం అనంతగిరి- బొర్రా జంక్షన్ మధ్య బొడగుడ సమీపంలో మరో కొండచరియ జారి రహదారిపై పడింది. -
పేరుకే ప్రారంభం.. ఏదీ ఉపయోగం?
[ 07-12-2023]
ఆంధ్రాఊటీ అరకులోయను సందర్శించే పర్యటకులు విడిది చేసేందుకు పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో అరకులోయకు సమీపంలోని కొత్తవలస ఉద్యానంలో సుమారు రూ. 25 లక్షలు వెచ్చించి కాటేజీలు నిర్మించారు. -
మూన్నాళ్ల ముచ్చట
[ 07-12-2023]
నాడు-నేడు పనుల్లో నాణ్యత డొల్ల కనిపిస్తోంది. అనంతగిరి మండలంలోని వివిధ పాఠశాలలకు నాడు- నేడులో భాగంగా వేసిన రంగులు కొద్దిరోజులకే పోతున్నాయి. భవనాలు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. -
దొంగతనాలపై అప్రమత్తం: సీఐ
[ 07-12-2023]
దొంగతనాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం సీఐ వాసా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. దేవీపట్నం మండలం కొండమొదలు ఆర్అండ్ఆర్ పునరావాస కాలనీలో పోలవరం నిర్వాసితులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
మిగ్జాం బీభత్సం.. రైతన్న కలవరం
[ 07-12-2023]
తుపాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా రంపచోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జి వంతల రాజేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లిపాక గ్రామంలో బుధవారం పర్యటించిన ఆమె నీటి మునిగిన వరి, మిర్చి, పత్తి పొలాలను పరిశీలించారు. -
నేడు పవన్కల్యాణ్ బహిరంగ సభ
[ 07-12-2023]
ఎంవీపీకాలనీ ఆళ్వార్దాస్ మైదానంలో గురువారం జనసేన ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతుందని.. జనసేన అధ్యక్షులు పవన్కల్యాణ్ సభలో పాల్గొని ప్రసంగిస్తారని జనసేన జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు వెల్లడించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 07-12-2023]
జాతీయ రహదారి కశింకోట సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయిని మృతిచెందగా మరో ఉపాధ్యాయిని తీవ్రంగా గాయపడింది. ఎస్సై జె.నాగేశ్వరరావు కథనం ప్రకారం.. -
గెడ్డలో ముగ్గురి గల్లంతు
[ 07-12-2023]
ఉప్పొంగి ప్రవహిస్తున్న గెడ్డను దాటేందుకు ప్రయత్నించి ముగ్గురు గిరిజనులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం గుర్తించారు. ఎంపీడీఓ శ్రీహర్షిత్, స్థానికులు అందించిన వివరాల ప్రకారం... -
నిలువ నీడలేని అంబులెన్స్!
[ 07-12-2023]
మన్యంలోని గిరిజన గ్రామాల్లోని ప్రజలకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తినా, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (పీహెచ్సీ) తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయా పీహెచ్సీలకు ప్రభుత్వం అంబులెన్సులు సమకూర్చింది. -
నష్టపోయిన పంటలకు పరిహారం అందిస్తాం
[ 07-12-2023]
ఏజెన్సీలో వరి సాగుచేసిన రైతులు తుపాను వల్ల ఎంత నష్టపోయింది అంచనా వేస్తున్నామని సబ్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. బుధవారం ఆయన రంప గ్రామంలో రైతులు సాగుచేసిన వరి పొలాలను పరిశీలించారు.