‘సింహాద్రి’ భూముల్లోకి వారసుడొచ్చాడు!
పంచదార కర్మాగారం ఏర్పాటుకు భూములిచ్చిన రైతులు, వారి వారసులకు ఉపాధి అవకాశాలు చూపుతామన్నారు.
130 ఎకరాల విలువ రూ.32.5 కోట్లు
కర్మాగారం పేరు మార్చి తన పేరిట పట్టాలు
సమగ్ర భూసర్వేతో వెలుగులోకి..
రోలుగుంట (చోడవరం), న్యూస్టుడే: పంచదార కర్మాగారం ఏర్పాటుకు భూములిచ్చిన రైతులు, వారి వారసులకు ఉపాధి అవకాశాలు చూపుతామన్నారు. కర్మాగారం పేరుతో రిజిస్ట్రేషన్ అయిన భూములకు హక్కుదారుగా వ్యక్తి పేరును వెబ్ల్యాండ్లో నమోదు చేసి రెవెన్యూ అధికారులు పట్టాలు మంజూరు చేశారు. ఈ వ్యవహారం సమగ్ర భూసర్వేతో వెలుగులోకి రావడంతో భూములిచ్చిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని గోవాడ చక్కెర కర్మాగారానికి అనుబంధంగా రావికమతం, రోలుగుంట మండలాల్లో సుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని పాతికేళ్ల కిందట కొంతమంది ప్రైవేటు రంగ సంస్థలకు చెందిన యాజమాన్యాలు ముందుకొచ్చాయి. అనువైన భూములను పరిశీలించాయి. చిత్తూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త దాలవాయి కృష్ణస్వామినాయుడు ఆదికేశవులు (డీకే ఆదికేశవులనాయుడు) రోలుగుంట మండలం కొంతలం, కంచుగుమ్మల రెవెన్యూ పరిధిలో సుమారు 140 మంది రైతులకు చెందిన వేర్వేరు సర్వే నంబర్లలోని 130 ఎకరాలను 1996లో కొనుగోలు చేశారు. ఎకరాకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు చెల్లించడంతోపాటు భూములిచ్చిన రైతు కుటుంబానికి ఫ్యాక్టరీలో ఉపాధి కల్పిస్తామన్నారు. ‘సింహాద్రి సుగర్స్, కొత్తకోట’ పేరుతో భూములను రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ భూములను నాటి నుంచి సంబంధిత రైతులే సాగు చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా.. ఫ్యాక్టరీ ఏర్పాటు కాకపోవడంతో భూములను తిరిగి అప్పగించాలని చోడవరం మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుతో కలిసి రైతులు పలుమార్లు ఆదికేశవులనాయుడిని కోరారు. ఆయన మరణానంతరం కుమారుడు శ్రీనివాసు ఈ ప్రాంత నాయకుల ద్వారా 2018 సెప్టెంబరులో నాటి ఆర్డీఓ, తహసీల్దార్లను కలిసి ‘సింహాద్రి సుగర్స్’ పేరుతో ఉన్న భూములను తన పేరున ఆన్లైన్ చేయించున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల మంజూరు కోరుతూ దరఖాస్తు చేయగా.. ఈ ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ అధికారులు డిజిటల్ సంతకం చేసి ఆమోదించారు. ప్రస్తుతం ఈ భూముల విలువ ఎకరా రూ.25 లక్షల చొప్పున 130 ఎకరాలు రూ.32.5 కోట్ల వరకు ఉంది. ఈ భూముల్లో 13 ఎకరాలు కంచుగుమ్మల, 14 ఎకరాలు భోగాపురం రైతులకు చెందినవి కాగా.. మిగతావి కొంతలం గ్రామానికి రైతులకు చెందినదే ఉన్నాయి.
ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తేనే..
ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటుతో రోలుగుంట, రావికమతం, మాకవరపాలెం, నర్సీపట్నం మండలాల్లోని చెరకు రైతులకు ప్రయోజనం ఉంటుందని భూములిచ్చాం. ఆ భూములను ఇతర అవసరాలకు వినియోగిస్తామంటే అంగీకరించం.
సుంకర కృష్ణారావు, రైతు, కొంతలం
సాగుదారులుగా రైతుల పేర్లు
ఫ్యాక్టరీ ఏర్పాటుకు కొనుగోలు చేసిన భూములు సమగ్ర సర్వేలో ఏళ్ల తరబడి రైతుల అనుభవంలోనే ఉన్నాయని తేలింది. భూ పట్టాలు ఫ్యాక్టరీ యజమాని పేరుతో ఉన్నప్పటికీ సాగులో ఈ ప్రాంతాలకు చెందిన రైతులే ఉన్నారు. రీ-సర్వేలో వారి పేర్లనే నమోదు చేశాం.
వరహాలు, తహసీల్దార్, రోలుగుంట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోలుకోలేని దెబ్బ
[ 06-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పాడేరు- అరకు మార్గంలో బర్మన్గుడ గ్రామానికి చెందిన ఒలిబిరి భీమన్న అనే గిరిజన రైతు ఎకరం వరి పంట చేతికి వచ్చే సమయంలో వరి పనలు పూర్తిగా నీటమునగడంతో నష్టపోయానని వాపోయారు. -
బోట్ల వెలికితీతకు సన్నాహాలు
[ 06-12-2023]
చేపలరేవు జీరో జెట్టీలో మునిగిన బోట్లను వెలికి తీసేందుకు మత్స్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు విశాఖ పోర్టు అథారిటీ(వీపీఎ) అధికారులకు లేఖ రాసింది. -
తెదేపా బలోపేతానికి కృషి
[ 06-12-2023]
అరకులోయ శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దొన్నుదొర అన్నారు. -
చంద్రన్నతోనే పేదలకు న్యాయం
[ 06-12-2023]
తెదేపాతోనే రాష్ట్రంలోని పేదలకు న్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. మండలంలోని తాళ్లగొమ్మూరులో మంగళవారం పర్యటించిన ఆమె సీపీఎం, వైకాపాల నుంచి తెదేపాలో చేరిన పలువురికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. -
వైకాపాను గద్దె దించడమే లక్ష్యం: భాజపా
[ 06-12-2023]
సీఎం జగన్మోహన్రెడ్డి ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాలతో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుంటున్నారని భాజపా మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ మండిపడ్డారు. -
విజయసాయి బంధువులకు రూ.వందల కోట్లలో టీడీఆర్
[ 06-12-2023]
టీడీఆర్ (ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్) పత్రాల జారీ కోసమే దసపల్లా భూముల్లో మాస్టర్ ప్లాన్ రహదారి-2041ని అభివృద్ధి చేయడానికి జీవీఎంసీ రహదారి అభివృద్ధి ప్రణాళిక (ఆర్డీపీ) నోటిఫికేషన్ జారీ చేసిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపించారు. -
డ్వాక్రా సొమ్ము పక్కదారి
[ 06-12-2023]
డ్వాక్రా మహిళల ఖాతాలకు వెళ్లాల్సిన పొదుపు సొమ్ము కొంత మంది సిబ్బంది తమ సొంత ఖాతాల్లోకి మళ్లించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
సూపర్వైజర్ శ్రీధర్ అనుమానాస్పద మృతి
[ 06-12-2023]
శరగడం శ్రీధర్ (24) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పాడేరు నుంచి మైదాన ప్రాంతంలోని స్వగ్రామానికి శ్రీధర్ మంగళవారం ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. -
మహాసభలకు భారీగా తరలింపు
[ 06-12-2023]
విజయవాడలో జరనున్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల రాష్ట్ర మహాసభలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివెళ్లాలని సంఘం నేతలు నిర్ణయించారు. -
రానున్న 24 గంటలూ అధికారులంతా అప్రమత్తం
[ 06-12-2023]
మిగ్జాం తుఫాను ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారంతా అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీఓ వి.అభిషేక్ ఆదేశించారు. -
మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలి
[ 06-12-2023]
మిగ్జాం తుపాను తీవ్రత ఇంకా తగ్గని నేపథ్యంలో తీరప్రాంతాల్లో మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక ఉప కలెక్టర్ మహేష్ సూచించారు. -
‘ఇప్పటికైనా కళ్లు తెరవండి జగన్మోహన్రెడ్డి’
[ 06-12-2023]
‘అమరావతే ఏపీ రాజధాని అని కేంద్రం మరోసారి స్పష్టంగా చెప్పింది. ఇప్పటికైనా మీ కళ్లు తెరవండి జగన్మోహన్రెడ్డి గారు..’ అంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ట్విటర్ ద్వారా స్పందించారు. -
‘ఉపేంద్రగాడి అడ్డా’ సందేశాత్మక సినిమా
[ 06-12-2023]
ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మించిన ‘ఉపేంద్ర గాడి అడ్డా’ చిత్రం సక్సెస్ మీట్ కార్యక్రమం మంగళవారం డాబాగార్డెన్స్ అల్లూరిసీతారామరాజు విజ్ఞానకేంద్రంలో నిర్వహించారు.


తాజా వార్తలు (Latest News)
-
TDP-Janasena: చంద్రబాబుతో పవన్కల్యాణ్ భేటీ
-
Instagram: త్వరలో ఫేస్బుక్, ఇన్స్టాలో క్రాస్ చాటింగ్ బంద్!
-
Benjamin Netanyahu: అప్పుడు మీరంతా ఎందుకు మౌనంగా ఉన్నారు?.. మానవ హక్కుల సంస్థలపై నెతన్యాహు ఆగ్రహం
-
Raja Singh: కాంగ్రెస్వి మోసపూరిత హామీలు: భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్
-
Deepak Chahar: ఆయన్ను సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాం: దీపక్ చాహర్
-
నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: గవర్నర్ను కలిసిన కాంగ్రెస్ బృందం