రాక్షస పాలనకు అంతం పలకాలి
రాష్ట్రంలో రాక్షస పాలనకు అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు అన్నారు.
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు
దీక్షా శిబిరంలో ప్రసంగిస్తున్న అయ్యన్నపాత్రుడు
విశాఖపట్నం, న్యూస్టుడే: రాష్ట్రంలో రాక్షస పాలనకు అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎంవీపీ కాలనీలో తూర్పునియోజకవర్గ నాయకులు చేపట్టిన నిరసన దీక్షా శిబిరంలో గురువారం ప్రసంగిస్తూ.. రాష్ట్రంలోని విద్యార్థులకు నైపుణ్యాలను అందించేందుకు తెదేపా హయంలో సీమెన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఏపీఎస్ఎస్డీసీ సంస్థను నెలకొల్పిందన్నారు. దీని ద్వారా ఎంతో మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో ఉన్నత ఉద్యోగాలు సంపాదించారన్నారు. ఇందులో అవినీతి జరిగిందని చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపించారు. ఈ చర్యను రాష్ట్ర ప్రజలు ఆక్షేపిస్తున్నారని, అందుకే అనేక వర్గాల వారి మద్దతు చంద్రబాబుకు ఉందన్నారు. అధికారులు సైతం రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందే చేస్తున్నారు తప్ప, మరొక ఆలోచన చేయట్లేదన్నారు. చంద్రబాబు విడుదలయ్యే వరకు ఉద్యమం ఆగదన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పట్టాభిరామ్, నాయకులు ఒమ్మి సన్యాసిరావు, అప్పలరాజు, బుడుమూరి గోవింద్, రామచంద్రరావు, రమణి, సత్యం, కార్పొరేటర్ మంగవేణి, ఉమారాణి, రాజశేఖర్, వెంకటరమణ, కాళ్ల శంకర్, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబుతో మేము అంటూ పలువురు ముస్లిం మహిళలు ప్లకార్డులు ప్రదర్శించి మద్దతు ప్రకటించారు.
మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు
చంద్రబాబును అరెస్టు చేసి, తెదేపా నాయకులు, కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని సీఎం జగన్ ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. జీవీఎంసీ 93వ వార్డు పరిధి ప్రహ్లాదపురంలో చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కనకమహాలక్ష్మికి న్యాయవాదుల పూజలు
చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని, కేసుల నుంచి క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తూ తెదేపా న్యాయ విభాగానికి చెందిన న్యాయవాదులు కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మోకాళ్లపై కూర్చుని ప్రత్యేక పూజలు చేశారు. 116 కొబ్బరికాయలు కొట్టడంతో పాటు పంచామృతాలతో అభిషేకం జరిపారు. లీగల్ సెల్ అధ్యక్షులు కె.వి.స్వామి మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు లేకుండా వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా చంద్రబాబుపై కేసులు నమోదు చేసిందని ఆరోపించారు. చివరకు న్యాయమే గెలుస్తుందని, త్వరలోనే చంద్రబాబు బయటకొస్తారన్నారు. న్యాయ పోరాటం చేస్తూనే భగవంతున్ని ప్రార్థిస్తున్నామన్నారు. ప్రధాన కార్యదర్శి గిరిధర్, రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ, నాయకులు పార్థసారథి, శోభన్బాబు, జనసేన లీగల్ సెల్ ప్రతినిధులు కళావతి, పలక శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి పట్టణం: అనకాపల్లి సాయిబాబా ఆలయంలో తెదేపా రాష్ట్ర బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మళ్ల సురేంద్ర ఆధ్వర్యంలో పూజలు చేశారు. త్రినాథ్, ప్రసాద్, పిట్లరాజు, పొలిమేర ఆనంద్, ఆకుల నానాజీ పాల్గొన్నారు.
దివ్యాంగుల దీక్షలు
విశాఖపటం: తెదేపా అధినేత చంద్రబాబుపై నమోదు చేసిన కేసులను ఎత్తివేసి, జైలు నుంచి విడుదల చేయాలని తెదేపా కార్యాలయంలో విశాఖ లోక్సభ నియోజకవర్గం తెదేపా విభిన్న ప్రతిభావంతుల విభాగం అధ్యక్షులు ఈసరపు వాసు ఆధ్వర్యంలో దివ్యాంగులు నిరసన తెలిపారు. మేము సైతం బాబు కోసమంటూ సంతకాలు చేసి దీక్షల్లో పాల్గొన్నారు. అనుబంధ విభాగాల బాధ్యులు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని, అటువంటి వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేసి కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి ఎంతోమంది యువతకు ఉపాధి కల్పించిన వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టడం అన్యాయమన్నారు. వాసు మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలంతా జగన్ నిర్ణయాలను తిప్పికొట్టాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి మూర్తియాదవ్, తాతాజీ, శ్రీనివాస్, త్రినాథ్, వెంకటేశ్, ఈశ్వరి, రమాదేవి, భాగ్యలక్ష్మి, సురేశ్, మోహన్రంగా, అప్పలరాజు, లింగబాబు, నర్సింహమూర్తి పాల్గొన్నారు.
జగన్ను సాగనంపేందుకు ఐక్యంగా పనిచేద్దాం
అచ్యుతాపురం, రాంబిల్లి, న్యూస్టుడే: రాష్ట్రంలో నియంత పాలన చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి అందరూ ఐక్యంగా పనిచేయాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్కుమార్ కోరారు. జనసేన, తెదేపా కలిసిపోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో గురువారం విశాఖలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, జడ్పీ మాజీ ఛైర్పర్సన్ లాలం భవానీలను మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు పార్టీలు కలిసి జగన్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలన్నారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు జనపరెడ్డి శ్రీనివాసరావు, జనసేన నాయకులు బైలపూడి రాందాసు, లాలం చందు, కరెడ్ల ప్రకాశ్, రుత్తల పండు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగని వానలు.. ఉప్పొంగిన వాగులు
[ 07-12-2023]
మిగ్జాం తుపాను తీరం దాటినా అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. చేతికందాల్సిన వేల ఎకరాల పంట ఈ తుపాను ధాటికి గంగపాలైంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలతో రెండు జిల్లాల వాసులు చిగురుటాకుల్లా వణికిపోయారు. -
నష్టాలపై నివేదికలు రూపొందించండి
[ 07-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావంతో జిల్లాలో దెబ్బతిన్న ఇళ్లు, వ్యవసాయ, ఉద్యాన పంటలు, పశువులు, నీటి పారుదల వ్యవస్థలపై నివేదికలు రూపొందించాలని కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశించారు. -
అరకు ఘాట్రోడ్డులో రాకపోకలు బంద్
[ 07-12-2023]
అనంతగిరి ఘాట్రోడ్డులో బుధవారం వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మిగ్జాం తుపాను కారణంగా మంగళవారం రహదారిపై పడిన కొండచరియలను తొలగిస్తుండగా బుధవారం అనంతగిరి- బొర్రా జంక్షన్ మధ్య బొడగుడ సమీపంలో మరో కొండచరియ జారి రహదారిపై పడింది. -
పేరుకే ప్రారంభం.. ఏదీ ఉపయోగం?
[ 07-12-2023]
ఆంధ్రాఊటీ అరకులోయను సందర్శించే పర్యటకులు విడిది చేసేందుకు పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో అరకులోయకు సమీపంలోని కొత్తవలస ఉద్యానంలో సుమారు రూ. 25 లక్షలు వెచ్చించి కాటేజీలు నిర్మించారు. -
మూన్నాళ్ల ముచ్చట
[ 07-12-2023]
నాడు-నేడు పనుల్లో నాణ్యత డొల్ల కనిపిస్తోంది. అనంతగిరి మండలంలోని వివిధ పాఠశాలలకు నాడు- నేడులో భాగంగా వేసిన రంగులు కొద్దిరోజులకే పోతున్నాయి. భవనాలు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. -
దొంగతనాలపై అప్రమత్తం: సీఐ
[ 07-12-2023]
దొంగతనాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం సీఐ వాసా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. దేవీపట్నం మండలం కొండమొదలు ఆర్అండ్ఆర్ పునరావాస కాలనీలో పోలవరం నిర్వాసితులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
మిగ్జాం బీభత్సం.. రైతన్న కలవరం
[ 07-12-2023]
తుపాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా రంపచోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జి వంతల రాజేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లిపాక గ్రామంలో బుధవారం పర్యటించిన ఆమె నీటి మునిగిన వరి, మిర్చి, పత్తి పొలాలను పరిశీలించారు. -
నేడు పవన్కల్యాణ్ బహిరంగ సభ
[ 07-12-2023]
ఎంవీపీకాలనీ ఆళ్వార్దాస్ మైదానంలో గురువారం జనసేన ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతుందని.. జనసేన అధ్యక్షులు పవన్కల్యాణ్ సభలో పాల్గొని ప్రసంగిస్తారని జనసేన జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు వెల్లడించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 07-12-2023]
జాతీయ రహదారి కశింకోట సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయిని మృతిచెందగా మరో ఉపాధ్యాయిని తీవ్రంగా గాయపడింది. ఎస్సై జె.నాగేశ్వరరావు కథనం ప్రకారం.. -
గెడ్డలో ముగ్గురి గల్లంతు
[ 07-12-2023]
ఉప్పొంగి ప్రవహిస్తున్న గెడ్డను దాటేందుకు ప్రయత్నించి ముగ్గురు గిరిజనులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం గుర్తించారు. ఎంపీడీఓ శ్రీహర్షిత్, స్థానికులు అందించిన వివరాల ప్రకారం... -
నిలువ నీడలేని అంబులెన్స్!
[ 07-12-2023]
మన్యంలోని గిరిజన గ్రామాల్లోని ప్రజలకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తినా, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (పీహెచ్సీ) తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయా పీహెచ్సీలకు ప్రభుత్వం అంబులెన్సులు సమకూర్చింది. -
నష్టపోయిన పంటలకు పరిహారం అందిస్తాం
[ 07-12-2023]
ఏజెన్సీలో వరి సాగుచేసిన రైతులు తుపాను వల్ల ఎంత నష్టపోయింది అంచనా వేస్తున్నామని సబ్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. బుధవారం ఆయన రంప గ్రామంలో రైతులు సాగుచేసిన వరి పొలాలను పరిశీలించారు.


తాజా వార్తలు (Latest News)
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణం చేయనుంది వీళ్లే..!
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. కాసేపట్లో నగరానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం