అలజడి లేకపోయినా అడవుల జల్లెడ
ఈనెల 21 నుంచి 27 వరకు నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను విజయవంతం చేయాలంటూ ఏవోబీ ఎస్జడ్సీ కార్యదర్శి గణేష్ ఇటీవల ఒక లేఖలో పిలుపునిచ్చారు.
చింతపల్లి/గ్రామీణం, న్యూస్టుడే: ఈనెల 21 నుంచి 27 వరకు నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను విజయవంతం చేయాలంటూ ఏవోబీ ఎస్జడ్సీ కార్యదర్శి గణేష్ ఇటీవల ఒక లేఖలో పిలుపునిచ్చారు. దీంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. గురువారం రాళ్లగెడ్డ పోలీసు అవుట్ పోస్టును సందర్శించారు. అవుట్పోస్టు నుంచి అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో చుట్టు పక్కల గ్రామాలను పరిశీలించారు. బలపం, కోరుకొండ, కుడుముల తదితర గ్రామాలపై డ్రోన్ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఐ రమేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో మావోయిస్టుల హింసాత్మక ఘటనలు బాగా తగ్గినట్టు పోలీసు అధికారులే చెబుతున్నారు. రంపచోడవరం పరిధిలోని చింతూరు, కుంట తదితర ప్రాంతాల్లో కొంతమేర మావోయిస్టు కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంది. అయినా ముందు జాగ్రత్త చర్యగా పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ముద్రపడిన బలపం పంచాయతీపై దృష్టి పెట్టారు. ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.
ఎటపాకలో అప్రమత్తం
ఎటపాక, న్యూస్టుడే: మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఎటపాకలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటపాక నుంచి చింతూరు, కూనవరం మండలాలకు వెళ్లే రహదారిలో బండిరేవు, తోటపల్లి, గన్నవరం, నందిగామ గ్రామాల సమీపంలో మావోయిస్టు పోస్టర్లు, బ్యానర్లు వెలిసిన సంగతి తెలిసిందే. వాటిని పోలీసులు వెంటనే తొలగించారు. అప్పటి నుంచి ఎటపాక సీఐ గజేంద్రకుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ పార్థసారథి నేతృత్వంలో అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్ఘఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావటంతో భద్రాచలం-చింతూరు, కూనవరం, చర్ల రహదారుల సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా వాహనాలు తనిఖీలు నిర్వహిస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల రహదారుల మధ]్య వాహన రాకపోకలను రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు నియంత్రిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగని వానలు.. ఉప్పొంగిన వాగులు
[ 07-12-2023]
మిగ్జాం తుపాను తీరం దాటినా అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. చేతికందాల్సిన వేల ఎకరాల పంట ఈ తుపాను ధాటికి గంగపాలైంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలతో రెండు జిల్లాల వాసులు చిగురుటాకుల్లా వణికిపోయారు. -
నష్టాలపై నివేదికలు రూపొందించండి
[ 07-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావంతో జిల్లాలో దెబ్బతిన్న ఇళ్లు, వ్యవసాయ, ఉద్యాన పంటలు, పశువులు, నీటి పారుదల వ్యవస్థలపై నివేదికలు రూపొందించాలని కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశించారు. -
అరకు ఘాట్రోడ్డులో రాకపోకలు బంద్
[ 07-12-2023]
అనంతగిరి ఘాట్రోడ్డులో బుధవారం వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మిగ్జాం తుపాను కారణంగా మంగళవారం రహదారిపై పడిన కొండచరియలను తొలగిస్తుండగా బుధవారం అనంతగిరి- బొర్రా జంక్షన్ మధ్య బొడగుడ సమీపంలో మరో కొండచరియ జారి రహదారిపై పడింది. -
పేరుకే ప్రారంభం.. ఏదీ ఉపయోగం?
[ 07-12-2023]
ఆంధ్రాఊటీ అరకులోయను సందర్శించే పర్యటకులు విడిది చేసేందుకు పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో అరకులోయకు సమీపంలోని కొత్తవలస ఉద్యానంలో సుమారు రూ. 25 లక్షలు వెచ్చించి కాటేజీలు నిర్మించారు. -
మూన్నాళ్ల ముచ్చట
[ 07-12-2023]
నాడు-నేడు పనుల్లో నాణ్యత డొల్ల కనిపిస్తోంది. అనంతగిరి మండలంలోని వివిధ పాఠశాలలకు నాడు- నేడులో భాగంగా వేసిన రంగులు కొద్దిరోజులకే పోతున్నాయి. భవనాలు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. -
దొంగతనాలపై అప్రమత్తం: సీఐ
[ 07-12-2023]
దొంగతనాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం సీఐ వాసా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. దేవీపట్నం మండలం కొండమొదలు ఆర్అండ్ఆర్ పునరావాస కాలనీలో పోలవరం నిర్వాసితులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
మిగ్జాం బీభత్సం.. రైతన్న కలవరం
[ 07-12-2023]
తుపాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా రంపచోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జి వంతల రాజేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లిపాక గ్రామంలో బుధవారం పర్యటించిన ఆమె నీటి మునిగిన వరి, మిర్చి, పత్తి పొలాలను పరిశీలించారు. -
నేడు పవన్కల్యాణ్ బహిరంగ సభ
[ 07-12-2023]
ఎంవీపీకాలనీ ఆళ్వార్దాస్ మైదానంలో గురువారం జనసేన ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతుందని.. జనసేన అధ్యక్షులు పవన్కల్యాణ్ సభలో పాల్గొని ప్రసంగిస్తారని జనసేన జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు వెల్లడించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 07-12-2023]
జాతీయ రహదారి కశింకోట సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయిని మృతిచెందగా మరో ఉపాధ్యాయిని తీవ్రంగా గాయపడింది. ఎస్సై జె.నాగేశ్వరరావు కథనం ప్రకారం.. -
గెడ్డలో ముగ్గురి గల్లంతు
[ 07-12-2023]
ఉప్పొంగి ప్రవహిస్తున్న గెడ్డను దాటేందుకు ప్రయత్నించి ముగ్గురు గిరిజనులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం గుర్తించారు. ఎంపీడీఓ శ్రీహర్షిత్, స్థానికులు అందించిన వివరాల ప్రకారం... -
నిలువ నీడలేని అంబులెన్స్!
[ 07-12-2023]
మన్యంలోని గిరిజన గ్రామాల్లోని ప్రజలకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తినా, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (పీహెచ్సీ) తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయా పీహెచ్సీలకు ప్రభుత్వం అంబులెన్సులు సమకూర్చింది. -
నష్టపోయిన పంటలకు పరిహారం అందిస్తాం
[ 07-12-2023]
ఏజెన్సీలో వరి సాగుచేసిన రైతులు తుపాను వల్ల ఎంత నష్టపోయింది అంచనా వేస్తున్నామని సబ్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. బుధవారం ఆయన రంప గ్రామంలో రైతులు సాగుచేసిన వరి పొలాలను పరిశీలించారు.


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం
-
రేషన్కార్డుల జారీపై ఆశలు.. మళ్లీ దరఖాస్తు చేస్తున్న పేదలు
-
Bhimavaram: భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు
-
నిజామాబాద్ బబ్లూను.. నిన్ను లేపేస్తా: డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కిన మందుబాబు వీరంగం