జగన్ను ఇంటికి పంపే రోజు దగ్గర్లోనే..
అక్రమ కేసులు పెట్టి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అరెస్టు చేయించిన జగన్మోహన్రెడ్డిని ప్రజలు ఇంటికి పంపే రోజులు దగ్గరపడ్డాయని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు
పాడేరులో దీక్షా శిబిరంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, నారాయణ తదితరులు
పాడేరు పట్టణం, న్యూస్టుడే: అక్రమ కేసులు పెట్టి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అరెస్టు చేయించిన జగన్మోహన్రెడ్డిని ప్రజలు ఇంటికి పంపే రోజులు దగ్గరపడ్డాయని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పాడేరులో చేపడుతున్న రిలే దీక్షలు గురువారం తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. చంద్రబాబును విడుదల చేసే వరకు ఉద్యమిస్తామన్నారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. శాసనసభలో తెదేపా ఎమ్మెల్యేలపై సభాపతి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబును ఎన్నికల వరకు జైల్లో ఉంచాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు రాజమండ్రి నారాయణ, రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు చిట్టిబాబు, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి సింహాచలం, నేతలు రమేష్నాయుడు, సురేష్కుమార్, శివకుమార్, జ్యోతికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఓటమి భయంతోనే అరెస్టు
హుకుంపేట, న్యూస్టుడే: రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబును సీఎం జగన్ అక్రమంగా అరెస్టు చేయించారని అరకు పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు, అండిభ సర్పంచు సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ అండిభ గెడ్డలో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ కేసులో చంద్రబాబునాయుడి పేరు లేకపోయినా ఆయన్ను అన్యాయంగా అరెస్టు చేయించారన్నారు. రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని చెప్పారు. నిజాయతీకి నిలువెత్తు రూపమైన చంద్రబాబుకు అవినీతి మరక అంటించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తెదేపా ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎన్ఎస్ఫ్ సభ్యులు శివ, రాము, విశ్వనాథం, రవి తదితరులు పాల్గొన్నారు.
అరాచక పాలనకు త్వరలోనే ముగింపు
చింతపల్లి గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన త్వరలోనే ముగియనుందని తెదేపా అరకు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి జ్ఞానేశ్వరి అన్నారు. చింతపల్లిలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. తెదేపాకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. జనసేన, తెదేపా పొత్తుతో వైకాపా కొట్టుకుపోతుందన్నారు. త్వరలో బాబు బయటకు వస్తారని, న్యాయం గెలుస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ పార్టీలకు అతీతంగా పలువురు బయటకు వచ్చి తమ గళం వినిపిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు చల్లంగి లక్ష్మణరావు, శ్రీధర్, రాము, సోమేష్, హరి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు
అరకులోయ, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న కక్ష సాధింపు చర్యలు ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు తీసుకొస్తున్నాయని తెదేపా ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దొన్నుదొర అన్నారు. అరకులోయలో జరుగుతున్న రిలే దీక్ష శిబిరంలో గురువారం తెదేపా ఎస్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఒక పార్టీని అణిచి వేయాలన్న ధోరణి తగదన్నారు. గతంలో వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్ర చేసిన సందర్భంలో అప్పటి తెదేపా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారేనా అని ప్రశ్నించారు. ప్రజలంతా వైకాపా ప్రభుత్వ తీరును గమనిస్తున్నారని చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడిపై కేసులు ఎత్తేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. మాజీ మంత్రి కిడారి శ్రావణ్కుమార్, నాయకులు సివేరి అబ్రహం, బాబూరావు, అమ్మన్న, ఇచ్ఛావతి, బూర్జ లక్ష్మి, నిర్మల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబుపై వైకాపా కక్ష
అరకులోయ, న్యూస్టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు క్షేమంగా ఉండాలని కోరుతూ అరకులోయలోని మసీదులో తెదేపా నాయకులు గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న చంద్రబాబునాయుడిపై వైకాపా ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీని అణచివేయాలని చూస్తే ఉప్పెనలా మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కులకు భంగం కలిగేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో ఓటుతోనే ప్రజల మనసులు గెలుచుకోవాలి తప్ప.. భయభ్రాంతులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. తెదేపా నాయకులు రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిదో రోజుకు చేరిన నిరాహార దీక్షలు
రంపచోడవరం, ఎటపాక, న్యూస్టుడే: తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై పెట్టిన కేసులను నిరసిస్తూ రంపచోడవరంలో తెదేపా శ్రేణులు చేస్తున్న రిలేనిరాహార దీక్షలు గురువారం 9వ రోజుకు చేరాయి. మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరితో పాటు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూరమేష్ తదితర నాయకులు దీక్షలో కూర్చున్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. పార్టీ నాయకులు అడబాల బాపిరాజు, వై.నిరంజనీదేవి, గురుకు శేషుకుమార్, సాదల సత్య, మఠం భాస్కర్, అనంతమోహన్ తదితరులు పాల్గొన్నారు. తొలుత తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు ఆధ్వర్యంలో విలీన మండలాల తెలుగు యువత నాయకులు. ఎటపాక నుంచి దీక్షకు ర్యాలీగా తరలివెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోలుకోలేని దెబ్బ
[ 06-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పాడేరు- అరకు మార్గంలో బర్మన్గుడ గ్రామానికి చెందిన ఒలిబిరి భీమన్న అనే గిరిజన రైతు ఎకరం వరి పంట చేతికి వచ్చే సమయంలో వరి పనలు పూర్తిగా నీటమునగడంతో నష్టపోయానని వాపోయారు. -
బోట్ల వెలికితీతకు సన్నాహాలు
[ 06-12-2023]
చేపలరేవు జీరో జెట్టీలో మునిగిన బోట్లను వెలికి తీసేందుకు మత్స్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు విశాఖ పోర్టు అథారిటీ(వీపీఎ) అధికారులకు లేఖ రాసింది. -
తెదేపా బలోపేతానికి కృషి
[ 06-12-2023]
అరకులోయ శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దొన్నుదొర అన్నారు. -
చంద్రన్నతోనే పేదలకు న్యాయం
[ 06-12-2023]
తెదేపాతోనే రాష్ట్రంలోని పేదలకు న్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. మండలంలోని తాళ్లగొమ్మూరులో మంగళవారం పర్యటించిన ఆమె సీపీఎం, వైకాపాల నుంచి తెదేపాలో చేరిన పలువురికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. -
వైకాపాను గద్దె దించడమే లక్ష్యం: భాజపా
[ 06-12-2023]
సీఎం జగన్మోహన్రెడ్డి ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాలతో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుంటున్నారని భాజపా మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ మండిపడ్డారు. -
విజయసాయి బంధువులకు రూ.వందల కోట్లలో టీడీఆర్
[ 06-12-2023]
టీడీఆర్ (ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్) పత్రాల జారీ కోసమే దసపల్లా భూముల్లో మాస్టర్ ప్లాన్ రహదారి-2041ని అభివృద్ధి చేయడానికి జీవీఎంసీ రహదారి అభివృద్ధి ప్రణాళిక (ఆర్డీపీ) నోటిఫికేషన్ జారీ చేసిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపించారు. -
డ్వాక్రా సొమ్ము పక్కదారి
[ 06-12-2023]
డ్వాక్రా మహిళల ఖాతాలకు వెళ్లాల్సిన పొదుపు సొమ్ము కొంత మంది సిబ్బంది తమ సొంత ఖాతాల్లోకి మళ్లించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
సూపర్వైజర్ శ్రీధర్ అనుమానాస్పద మృతి
[ 06-12-2023]
శరగడం శ్రీధర్ (24) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పాడేరు నుంచి మైదాన ప్రాంతంలోని స్వగ్రామానికి శ్రీధర్ మంగళవారం ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. -
మహాసభలకు భారీగా తరలింపు
[ 06-12-2023]
విజయవాడలో జరనున్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల రాష్ట్ర మహాసభలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివెళ్లాలని సంఘం నేతలు నిర్ణయించారు. -
రానున్న 24 గంటలూ అధికారులంతా అప్రమత్తం
[ 06-12-2023]
మిగ్జాం తుఫాను ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారంతా అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీఓ వి.అభిషేక్ ఆదేశించారు. -
మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలి
[ 06-12-2023]
మిగ్జాం తుపాను తీవ్రత ఇంకా తగ్గని నేపథ్యంలో తీరప్రాంతాల్లో మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక ఉప కలెక్టర్ మహేష్ సూచించారు. -
‘ఇప్పటికైనా కళ్లు తెరవండి జగన్మోహన్రెడ్డి’
[ 06-12-2023]
‘అమరావతే ఏపీ రాజధాని అని కేంద్రం మరోసారి స్పష్టంగా చెప్పింది. ఇప్పటికైనా మీ కళ్లు తెరవండి జగన్మోహన్రెడ్డి గారు..’ అంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ట్విటర్ ద్వారా స్పందించారు. -
‘ఉపేంద్రగాడి అడ్డా’ సందేశాత్మక సినిమా
[ 06-12-2023]
ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మించిన ‘ఉపేంద్ర గాడి అడ్డా’ చిత్రం సక్సెస్ మీట్ కార్యక్రమం మంగళవారం డాబాగార్డెన్స్ అల్లూరిసీతారామరాజు విజ్ఞానకేంద్రంలో నిర్వహించారు.


తాజా వార్తలు (Latest News)
-
BJP: అసెంబ్లీలకి ఎన్నికైన.. 10 మంది భాజపా ఎంపీల రాజీనామా
-
Automobile Sales: రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. నవంబర్లో 28.54 లక్షల అమ్మకాలు
-
AP High Court: ‘ఇసుక కేసు’లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
-
Pranab Mukherjee: వారి రాజకీయ చతురత రాహుల్ గాంధీకి అబ్బలేదు: డైరీలో రాసుకున్న ప్రణబ్ ముఖర్జీ
-
Telangana secretariat: రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటా: కోదండరామ్
-
New sim card Rule: జనవరి 1 నుంచి సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్