గిరిజన విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు
జిల్లా పరిషత్ 1-7 స్థాయీ కమిటీ సమావేశాల్లో ఇద్దరు అధికారులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
విద్యాశాఖ అధికారిపై జడ్పీటీసీ సభ్యుల తీవ్ర ఆగ్రహం
వాడీవేడిగా జడ్పీ స్థాయీ కమిటీ సమావేశం
జడ్పీ స్థాయీ కమిటీ సమావేశంలో ఛైర్పర్సన్ సుభద్ర, సీఈఓ శ్రీరామమూర్తి
విశాఖపట్నం, న్యూస్టుడే: జిల్లా పరిషత్ 1-7 స్థాయీ కమిటీ సమావేశాల్లో ఇద్దరు అధికారులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అధికారుల వ్యాఖ్యలపై జడ్పీటీసీ సభ్యులు మండిపడ్డారు. చివరికి ఇద్దరు అధికారులు క్షమాపణలు చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగిన స్థాయీ కమిటీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. దేవరాపల్లిలో స్త్రీనిధి నిధుల దుర్వినియోగంపై జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం ప్రశ్నించారు. అనకాపల్లి డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి మాట్లాడుతూ విచారణ చేశామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో సత్యంతో పాటు మిగిలిన జడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి చెప్పినా చర్యలు తీసుకోరా అంటూ మండిపడ్డారు. తన మాటలు మరో విధంగా అర్థం చేసుకోవద్దని, తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని లక్ష్మీపతి వివరణ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు.
- విద్యాశాఖపై జరిగిన చర్చలో అరకు జడ్పీటీసీ సభ్యురాలు రోషిణి మాట్లాడుతూ మన్యం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖ కార్యాలయ పర్యవేక్షకులు చక్రధర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో విద్యార్థులు అలాగే ఉంటారంటూ వ్యాఖ్యానించారు. దీంతో గిరిజన ప్రాంత జడ్పీటీసీ సభ్యులు భగ్గుమన్నారు. విద్యార్థులను గాడిలో పెట్టాల్సింది పోయి తేలిగ్గా మాట్లాడతారా అంటూ నిలదీశారు. చివరకు విద్యాశాఖ అధికారి క్షమాపణ చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.
- జగనన్న ఇళ్ల నిర్మాణాలకు రూ.1.80లక్షలు సరిపోవడం లేదని, ఇసుక, సిమెంటు సరిగ్గా అందడం లేదని పలువురు జడ్పీటీసీ సభ్యులు తెలిపారు. గతంలో కూడా యూనిట్ ధర పెంచాలని తీర్మానం చేసినా ఫలితం లేదన్నారు. మినీ గోకులాలకు బిల్లుల మంజూరులో విశాఖ జిల్లా డ్వామా పీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భీమిలి జడ్పీటీసీ సభ్యుడు వెంకటప్పడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని పలువురు ఆరోపించారు. కొంతమంది సభ్యులు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో ప్రావీణ్యం పెంచాలన్నారు. ఉపాధ్యాయులు టీచింగ్ ప్లాన్ అనుసరించేలా చూడాలన్నారు.
- జడ్పీ ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని, మందుల కొరత లేకుండా చూడాలన్నారు. జగనన్న ఇళ్ల కాలనీల పనులను వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కేటాయించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు, జడ్పీ సీఈఓ శ్రీరామమూర్తి, ఉప కార్యనిర్వాహణ అధికారి డి.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేల్కొంటే ఓటు..లేకుంటే చేటు
[ 02-12-2023]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. ఓటుతో మన భవిష్యత్తుకు మనమే బాటలు వేసుకుంటాం. అంతటి కీలకమైన ఓటు హక్కు విషయంలో నిర్లక్ష్యం చూపితే చివరికి చేటే కలుగుతుంది. -
ఐక్యంగా పనిచేస్తాం
[ 02-12-2023]
రంపచోడవరం నియోజకవర్గంలో తెదేపా, జనసేన కలిసి ఐక్యంగా ముందుకు సాగుతాయని జనసేన నియోజకవర్గ నాయకులు కుండ్ల రాజశేఖరరెడ్డి, రంపచోడవరం మండల అధ్యక్షుడు పాపోలు శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
పింఛను సొమ్ముతో మాయం
[ 02-12-2023]
పింఛను సొమ్ముతో టోకూరు పంచాయతీ కార్యదర్శి రవికుమార్ పరారయ్యాడు. ఎంపీడీఓ శ్రీహర్షిత్ అందించిన వివరాల మేరకు.. సుమారు రూ.7 లక్షలు నవంబరు 30న స్టేట్బ్యాంకు కాశీపట్నం బ్రాంచిలో విత్డ్రా చేశారు. శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా సాయంత్రం వరకు ఆయన ఆచూకీ కనిపించలేదు -
మొక్కల పెంపకం ఇలాగేనా?
[ 02-12-2023]
మొక్కల పెంపకాన్ని అధికారులు అటకెక్కించేస్తున్నారు. జీవవైవిధ్య పరిరక్షణ అమల్లో భాగంగా ప్రభుత్వం ప్రత్యేకంగా మొక్కల పెంపకంతోపాటు వాటి పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
భారీ వర్ష సూచన
[ 02-12-2023]
రానున్న వారం రోజుల్లో జిల్లాలోని పలు మండలాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఎం.సురేష్కుమార్ తెలిపారు. -
వైకాపా విధానాలు నచ్చకే రాజీనామా
[ 02-12-2023]
వైకాపా పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలు సహించలేక ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జడ్పీటీసీ మాజీ సభ్యురాలు కోసూరి బుజ్జి చిన్నాలమ్మ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ అధ్యక్షుడు గణజాల తాతారావు తదితరులు తెలిపారు -
దుమ్ము రేగకుండా చర్యలు
[ 02-12-2023]
గూడెంకొత్తవీధి మండలం చాపరాతిపాలెం నుంచి చింతపల్లి మీదుగా లంబసింగి వరకు ప్రస్తుతం జాతీయ రహదారి (516-ఈ)నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగా రహదారిపై దుమ్ము పేరుకుపోతోంది. -
78మంది పోలీసుల బదిలీ
[ 02-12-2023]
అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి బదిలీలకు అర్హులైన 78 మంది పోలీస్ సిబ్బందిని అనకాపల్లి జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లకు బదిలీ చేసే ప్రక్రియను ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం చేపట్టారు -
పట్టణవాసులు పరవశించేలా
[ 02-12-2023]
నర్సీపట్నం-కృష్ణదేవిపేట మార్గంలోని ఆరిలోవ రిజర్వు అడవిలో 25 హెక్టార్ల విస్తీర్ణంలో నగరవనం ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. -
సీఐ గజేంద్రకుమార్తో ప్రాణహాని
[ 02-12-2023]
చింతూరు సీఐగా గజేంద్రకుమార్ వస్తే తమకు ప్రాణహాని ఉందని 2019లో హత్యకు గురైన శ్యామల స్వప్న తల్లి శ్యామల రాధ ఆరోపించారు. దీనిపై ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశామన్నారు. -
ఇసుకాసురులకు వత్తాసు పలికితే గుణపాఠం
[ 02-12-2023]
ఇసుక అక్రమ రవాణా దందా చేస్తున్న ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్, వైకాపా మండల అధ్యక్షుడు రుత్తల శ్రీనివాసుతోపాటు వారికి వత్తాసు పలుకుతున్న పోలీసులకు గుణపాఠం చెప్పే సమయం వస్తుందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. -
లాడ్జిలో ఉరేసుకుని వృద్ధుడు ఆత్మహత్య
[ 02-12-2023]
పాయకరావుపేటలోని లాడ్జిలో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సత్యనారాయణ కథనం ప్రకారం.. నంద్యాలకు చెందిన రమణ అప్పుడప్పుడు పాయకరావుపేట వచ్చి గణేష్ భవన్ హోటల్లో బస చేసేవారు.


తాజా వార్తలు (Latest News)
-
WPL Auction: డిసెంబర్ 9న డబ్ల్యూపీఎల్ వేలం.. స్లాట్లు 30.. అందుబాటులోకి 165 మంది
-
Whatsapp: వాట్సప్లో యూజర్ నేమ్.. చాట్స్కు సీక్రెట్ కోడ్!
-
Pawan Kalyan: నేను ఏదైనా మాటల్లో చెప్పను.. నిలబడి చూపిస్తా: పవన్ కల్యాణ్
-
Animal: రణ్బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్.. ‘యానిమల్’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే!
-
Dhulipalla Narendra: రాజకీయ లబ్ధి కోసమే జగన్ నీటి చిచ్చు పెట్టారు: ధూళిపాళ్ల నరేంద్ర
-
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి