‘నిలదీతలు వాళ్లకు.. నీరాజనాలు మాకు’
తెదేపా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ప్రజలు నీరాజనాలు పలుకుతూ.. అధిక ధరలు, సమస్యలపై వైకాపాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా
మాట్లాడుతున్న మాజీమంత్రి నక్కా ఆనందబాబు
అనంతవరం (కొల్లూరు), న్యూస్టుడే : తెదేపా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ప్రజలు నీరాజనాలు పలుకుతూ.. అధిక ధరలు, సమస్యలపై వైకాపాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. గురువారం కొల్లూరు మండలం అనంతవరంలో నిర్వహించిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైకాపా పాలన ఫలితంగా ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకునేందుకు తెదేపా ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్తోందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాధితులుగా మారిన ప్రజలు తమకు నీరాజనాలు పలుకుతున్నారన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైకాపా నాయకులు వెళ్తుంటే.. పన్నులు, ధరల భారాలు మోయలేని ప్రజలు అడుగడుగునా వారిని నిలదీస్తున్నారని చెప్పారు. ఈ తీరును గమనిస్తే ప్రజాన్యాయస్థానంలో వైకాపా దోషిగా నిలబడిన వైనం కళ్లకు కడుతోందని పేర్కొన్నారు. తెదేపా- వైకాపా పాలనలో నిత్యావసరాల ధరల్లో అంతరాలను స్పష్టం చేసేలా నాయకులు ఫ్లెక్సీ ప్రదర్శించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆనందబాబు ఆవిష్కరించారు. నేతలు డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, మైనేని మురళీకృష్ణ, ఎంపీటీసీ సభ్యురాలు నాగళ్ల శిరీష, సర్పంచ్ అలపర్తి ఉషారాణి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు