CM Jagan Davos Tour: సీఎం జగన్‌తో గౌతమ్‌ అదానీ భేటీ

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పలువురు ప్రముఖులు ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.

Updated : 22 May 2022 18:50 IST

అమరావతి: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పలువురు ప్రముఖులు ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. అదానీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ, బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌ పాల్‌, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే తదితరులు జగన్‌తో సమావేశమయ్యారు. సీఎంతో గౌతమ్‌ అదానీ వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆయనకు జ్ఞాపికను అందజేశారు.

వీరితో పాటు వరల్డ్ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) మొబిలిటీ, సస్టైనబిలిటీ విభాగాధిపతి పెట్రో గొమేజ్‌, హెల్త్‌ విభాగాధిపతి డాక్టర్‌ శ్యామ్‌ బిషేన్‌తో సీఎం జగన్‌ భేటీ అయి ఆరోగ్య రంగంపై చర్చించారు. అనంతరం డబ్ల్యూఈఎఫ్‌తో ఫ్లాట్‌ఫాం పార్టనర్‌షిప్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని