రాబోయే ఒలింపిక్స్పై ప్రత్యేక దృష్టి
‘73 సంవత్సరాల తర్వాత థామస్ కప్ గెలవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ స్ఫూర్తితో రాబోయే కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్లో ప్రతిభను కనబర్చేందుకు కృషి
స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్
క్రీడాకారులతో ఫొటోలు దిగి, ఆటోగ్రాఫ్లు ఇచ్చి ఉత్సాహపర్చిన కిదాంబి శ్రీకాంత్
గుంటూరు క్రీడలు, న్యూస్టుడే: ‘73 సంవత్సరాల తర్వాత థామస్ కప్ గెలవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ స్ఫూర్తితో రాబోయే కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్లో ప్రతిభను కనబర్చేందుకు కృషి చేస్తాం. 2024లో జరిగే ఒలింపిక్స్పై ప్రత్యేక దృష్టి పెడతాం’.. అని బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ స్పష్టం చేశారు. థామస్ కప్ విజయం తర్వాత తొలిసారి గుంటూరుకు వచ్చిన ఆయనకు ఇంటి వద్ద ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పున్నయ్య చౌదరి, సంయుక్త కార్యదర్శి సంపత్కుమార్, జిల్లా అధ్యక్షుడు రాయపాటి రంగబాబు, కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, కోశాధికారి రమేష్కుమార్, సంయుక్త కార్యదర్శి సురేష్కుమార్ తదితరులు శ్రీకాంత్కు గురువారం అభినందనలు తెలియజేసి సత్కరించారు. ఎన్టీఆర్ స్టేడియం కోచ్ బాషాతో శిక్షణ శిబిరంలో చిన్నారులు శ్రీకాంత్కు శుభాకాంక్షలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగునీరివ్వకపోతే బతికేదెలా..?
[ 20-04-2024]
తమకు తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయడం లేదని ప్రత్తిపాడులోని మహబూబ్ నగర్ కాలనీ వాసులు శుక్రవారం గుంటూరు- పర్చూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో జేఎల్ఎం మృతి
[ 20-04-2024]
విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్) మృతి చెందిన ఘటన ఇది. విద్యుత్తు శాఖ ఉద్యోగులు, బాధితుల కథనం ప్రకారం... పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అడుసుమల్లి సుబ్రహ్మణ్యం, చిలకమ్మ దంపతుల పెద్దకుమారుడు రాజేశ్ (27) ఇదే గ్రామంలో జేఎల్ఎంగా పనిచేస్తున్నారు. -
కలగా మినీ రైతుబజార్లు
[ 20-04-2024]
నాడు అలా...గత ప్రభుత్వంలో వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు 2018లో పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గంలో రైతుబజార్ను అందుబాటులోకి తెచ్చారు. ఆ రైతుబజార్లో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. -
ఓటు హక్కు వినియోగానికి కార్మికులకు సెలవు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరగనున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులకు సెలవు ప్రకటించినట్లు మూడో జోన్ కార్మిక శాఖ ఇన్ఛార్జి సంయుక్త కమిషనర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు -
మద్యం మత్తు.. కుటుంబాలు చిత్తు
[ 20-04-2024]
గత నెల 18వ తేదీన తెనాలి మున్సిపల్ కార్యాలయం చెంతనే నిర్మాణంలో ఉన్న మార్కెట్ భవంతిలో రవికిరణ్ (37) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారణం మద్యం మత్తు. మద్యం తాగి చెంతనే దోమల కాయిల్ వెలిగించుకుని నిద్రపోయిన అభాగ్యుడు కాయిల్ దుప్పటికి తగిలి మంటలు చెలరేగినా మత్తు వల్ల లేవలేక కాలిపోయాడు
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!