జాప్యం ఖరీదు రూ.2కోట్లు
దుర్గగుడికి విద్యుత్తు బిల్లుల భారం తగ్గించేందుకు సౌర విద్యుత్తు ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఐదేళ్ల కిందట నిర్ణయించారు. విజయవాడ శివారు పాతపాడులో ఉన్న ఐదెకరాల ఆలయ స్థలంలో మూడేళ్ల కిందట ప్లాంట్ పనులు ప్రారంభించి పూర్తి చేశారు. ఇప్పటికి రెండేళ్లవుతున్నా..
అందుబాటులోకి రాని సౌర విద్యుత్తు ప్లాంట్
దుర్గగుడికి ఏటా రూ.90 లక్షలపైనే కరెంటు బిల్లులు
ఈనాడు, అమరావతి
దుర్గగుడికి విద్యుత్తు బిల్లుల భారం తగ్గించేందుకు సౌర విద్యుత్తు ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఐదేళ్ల కిందట నిర్ణయించారు. విజయవాడ శివారు పాతపాడులో ఉన్న ఐదెకరాల ఆలయ స్థలంలో మూడేళ్ల కిందట ప్లాంట్ పనులు ప్రారంభించి పూర్తి చేశారు. ఇప్పటికి రెండేళ్లవుతున్నా.. అక్కడ ఉత్పత్తిని ఆరంభించలేదు. ప్లాంట్ ద్వారా విద్యుత్తును నున్న సబ్స్టేషన్కు తరలించేందుకు అవసరమైన లైన్ను వేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. స్తంభాలు, కేబుళ్ల ఏర్పాటు పనులు ఆరంభించి మధ్యలోనే వదిలేశారు. ప్రధానంగా మధ్యలోని పాతపాడు సహా కొన్ని గ్రామవాసులు ఈ లైన్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. దీంతో మరో ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాల్సిన అధికారులు చొరవ చూపించడం లేదు. దీనివల్ల ఏటా దుర్గగుడికి రూ.90 లక్షలకు పైగా విద్యుత్తు బిల్లుల భారం తప్పడం లేదు.
ఇంద్రకీలాద్రిపై దుర్గగుడితో పాటు కొండ దిగువున ఉన్న భవనాలు, జమ్మిదొడ్డి కార్యాలయం, సి.వి.రెడ్డి ఛారిటీస్, మాడపాటి సత్రం, ఉద్యోగుల క్వార్టర్లు సహా అన్నింటికీ కలిపి నెలకు రూ.8 లక్షల వరకు విద్యుత్తు బిల్లులకు ఖర్చవుతోంది. ఏటా కనీసం రూ.90 లక్షలు దాటుతోంది. ఏటా 13 లక్షల యూనిట్ల వరకూ విద్యుత్తు అవసరమవుతోంది. ఈ స్థాయిలో భారీగా విద్యుత్తు బిల్లులకు ఖర్చవడంతో సౌర విద్యుత్తు ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఐదేళ్ల కిందట అప్పటి అధికారులు ప్రతిపాదనలు చేశారు. అనుకున్నట్టుగానే ప్రణాళికలు రూపొందించి, పనులు పూర్తిచేశారు. ఆ తర్వాత అడుగు ముందుకు పడడం లేదు. ఈ ప్లాంట్ నిర్మాణంతో దుర్గగుడికి ఏటా కనీసం రూ.కోటి ఆదా అవుతుందని అంచనా వేశారు. రెండేళ్లుగా అందుబాటులోకి తీసుకురాకుండా ఉంచేయడంతో రూ.2 కోట్ల వరకూ ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది.
రూ.4.64 కోట్ల ఖర్చుతో..
సౌర విద్యుత్తు ప్లాంట్ మొత్తం వ్యయం రూ.4.64 కోట్లు కాగా, రాయితీ రూ.92.8 లక్షలు లభించగా, దేవస్థానానికి రూ.3.71 కోట్లు ఖర్చయింది. ప్లాంట్ ద్వారా ఏటా 16లక్షల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. ఆలయానికి ఏటా ఖర్చయ్యే 13లక్షల యూనిట్లు కాకుండా.. మరో 2లక్షలకు పైగా యూనిట్లు మిగులుతాయి. దీనిని విద్యుత్తు శాఖే తీసుకుని ఏటా రూ.14లక్షల వరకు తిరిగి దేవస్థానానికే చెల్లిస్తుంది. ప్రస్తుతం ఆలయానికి వస్తున్న రూ.90లక్షల విద్యుత్తు బిల్లులు మిగలడంతో పాటు, ఏటా రూ.14 లక్షలు కలిపితే.. కనీసం రూ.కోటి ఆదా అవుతుంది. ప్లాంట్కు పెట్టిన రూ.3.71 కోట్ల వ్యయం నాలుగేళ్లలోపే తిరిగి వచ్చేస్తుంది. సోలార్ ప్లాంట్ 20 ఏళ్లు విద్యుత్తు ఉత్పత్తి చేస్తుందని అంచనా. అంటే మిగతా 16 ఏళ్లకు తీసుకున్న యూనిట్లకు తిరిగి విద్యుత్తుశాఖే చెల్లింపులు చేస్తుండడంతో దుర్గగుడికి మరింత ఆదాయమూ సమకూరనుంది.
ఈవోలు, అధికారులు మారుతుండడంతో..
పాతపాడులోని ఐదెకరాల స్థలంపైనా గత నాలుగేళ్లుగా ఎలాంటి ఆదాయం రావడం లేదు. దుర్గగుడికి ఏటా ఈవోలు మారుతూ ఉండడంతో సౌర విద్యుత్తు ప్లాంట్ను అందుబాటులోనికి తీసుకురావడంలో అధికారుల చొరవ కరవవుతోంది. ప్లాంట్కు ప్రణాళికలు రూపొందించినది ఒకరి హయాంలో.. నిర్మాణం మరొకరి హయాంలో జరిగింది. ఆ తర్వాత మరో ఇద్దరు ఈవోలు మారారు. దీంతో దీని వల్ల ఆలయానికి కలిగే లబ్ధి గురించి అధికారులకు అవగాహన ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇంజినీరింగ్ విభాగం అధికారులు సైతం తరచూ మారుతుండడంతో వారి పర్యవేక్షణ కూడా కొరవడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, విద్యుత్తు విభాగంతో మాట్లాడి ప్లాంట్ను వీలైనంత త్వరగా అందుబాటులోనికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తే దుర్గగుడికి కోట్ల రూపాయల ప్రయోజనం కలుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!