ఉద్యోగాల పేరుతో వల.. యువత విలవిల
ప్రభుత్వ కొలువులకు ఉండే డిమాండే వేరు. అవకాశం ఉంటే వీటిల్లో చేరాలనుకునే వారు కోకొల్లలు. వీటికి ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని అందినకాడికి దోచుకునే వారు ఎక్కువయ్యారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో స్మార్ట్గా మోసం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
ఉద్యోగ ప్రకటనల కోసం సంబంధిత శాఖల వెబ్సైట్లను తరచూ చేసే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో నకిలీ సైట్లు రూపొందించడం చాలా సులువు కావడంతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మోసగాళ్లు తాము ఎంచుకున్న ప్రభుత్వ శాఖ, సంస్థను పోలి ఉండేలా రూపొందిస్తున్నారు. సైట్ చిరునామా కూడా ఇంచుమించు అలాగే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెబ్ను హోస్ట్ చేసే సంస్థలు చాలా వచ్చాయి. చాలా చౌకగా వెబ్సైట్లు రూపొందించుకునేందుకు సాయం చేస్తున్నారు. కేవలం రూ. 5 వేలు నుంచి రూ. 10 వేలు లోపే తయారు చేసుకునే అవకాశం ఉంది. దీంతో కేటుగాళ్లు పెద్ద కష్టం లేకుండానే తక్కువ ఖర్చుతో మోసాలకు పాల్పడుతున్నారు.
ప్రభుత్వ కొలువులకు ఉండే డిమాండే వేరు. అవకాశం ఉంటే వీటిల్లో చేరాలనుకునే వారు కోకొల్లలు. వీటికి ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని అందినకాడికి దోచుకునే వారు ఎక్కువయ్యారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో స్మార్ట్గా మోసం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రభుత్వ శాఖలకు సంబంధించి నకిలీ వెబ్సైట్లు సృష్టించి.. అచ్చు అసలుదే అని తలపించేలా భ్రమింపజేస్తున్నారు. ఇంకేం.. వీటిని అడ్డం పెట్టుకుని నిరుద్యోగులను మాయగాళ్లు మోసం చేస్తున్నారు. అప్పోసొప్పో చేసి ఇటువంటి వారికి సొమ్ము ధారపోస్తున్నారు.
ఉద్యోగాల పేరుతో వల...
* ఇటీవల రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వెబ్సైట్కు నకిలీ వచ్చింది. ఇందులో శాఖలో వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటన ఉంది. అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. దీనికి క్యూఆర్ కోడ్ను ఇచ్చారు. దీనిని స్కాన్ చేసి రుసుము చెల్లించాలని సూచించారు. ఈ సైట్ నిజమే అని నమ్మి పలువురు దరఖాస్తు చేశారు. ఒక్కొక్కరు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 950 చెల్లించారు. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, ఆ సైట్ నకిలీదిగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సైట్ను బ్లాక్ చేయించారు.
* సీఆర్డీఏ పేరున ఓ నకిలీ వెబ్సైట్ను రూపొందించి, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా వేసిన ఘటన రెండేళ్ల క్రితం జరిగింది. నిందితుడు పలువురి నుంచి డబ్బులు వసూలు చేశాడు. సీఆర్డీఏలో పొరుగు సేవల పద్ధతిలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చాడు. దీనికి స్పందించి పలువురు నిరుద్యోగులు దరఖాస్తు చేశారు. ఎంకిపైన వారికి ఇంటర్వ్యూలు విజయవాడలో నిర్వహిస్తున్నట్లు సమాచారం పంపించాడు. వైబ్సైట్లోకి వెళ్లి రూ. 5 వేలు చెల్లించమని సూచించాడు. దీనికి స్పందించి ఒక్కొక్కరు రూ. ఐదు వేలు చొప్పున చెల్లించారు. కొందరు అనుమానంతో సీఆర్డీఏ కార్యాలయాన్ని సంప్రదించారు. విషయం తెలుసుకున్న అధికారులు వెబ్సైట్ చూడగా.. అది నకిలీదిగా గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిరుద్యోగ యువత పనే!
సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ ఉన్నతికి ఉపయోగించుకోవాల్సిన పలువురు యువకులు దారితప్పి ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడవుతోంది. సీఆర్డీఏ సకిలీ సైట్ను పూర్వ ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు. ఇంజినీరింగ్ చదువుతూ మధ్యలో మానేశాడు. ఈ యువకుడు ఓ సంస్థకు చెందిన ఉచిత వెబ్సైట్లో సీఆర్డీఏ పేరుతో సైట్ రూపొందించాడు. పశుసంవర్ధక శాఖ నకిలీ సైట్ విషయంలోనూ రాయలసీమ ప్రాంతానికి చెందిన యువకుడి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. వేరొకరి బ్యాంకు ఖాతాను తీసుకుని, క్యూఆర్ కోడ్కు అనుసంధానం చేశాడు. దరఖాస్తు చేసే వారు చెల్లించే మొత్తం ఆ ఖాతాకు జమ అయినట్లు పోలీసులు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో