logo

అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

పొలం పనులకు వెళ్లిన బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కంచికచర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఈ నెల 26న పోలీసులు పోక్సో కేసు నమోదు చేసిన విషయం విధితమే.

Published : 29 Jun 2022 04:51 IST


కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ నాగేంద్రకుమార్‌

కంచికచర్ల, న్యూస్‌టుడే: పొలం పనులకు వెళ్లిన బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కంచికచర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఈ నెల 26న పోలీసులు పోక్సో కేసు నమోదు చేసిన విషయం విధితమే. కేసు వివరాలను స్థానిక పోలీసుస్టేషన్‌లో నందిగామ గ్రామీణ సీఐ ఐ.వి.నాగేంద్రకుమార్‌ మంగళవారం వెల్లడించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి పూర్తి చేసి పొలం పనులకు వెళ్తోంది. ఈ నెల 24న రాత్రి 7 గంటలకు బయటకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికినా ఆచూకీ తెలియలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు 25న పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాలిక అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదే రోజు రాత్రి 8 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెను ద్విచక్ర వాహనంపై తీసుకువచ్చి ఇంటి సమీపంలో వదిలి వెళ్లాడు. చందర్లపాడు మండలం చింతలపాడుకు చెందిన కూలీ కస్తాల యలమందయ్య ఆమె ఇతర ప్రాంతాలకు మిర్చి కోతలకు వెళ్లిన సమయంలో పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలికను బైక్‌పై తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనికి ఇంతకు ముందే వివాహమైంది. నిందితుడు ముప్పాళ్ల నుంచి నందిగామ వైపు వస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతని ద్విచక్రవాహనాన్ని, సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని